thumbnail

పట్టపగలే రెచ్చిపోయిన దోపిడీ ముఠా - కారులో వెళ్తున్న యువకుడిపై దాడి చేసి బంగారం చోరీ - Rajendra Nagar chain snatching case

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 9:44 PM IST

Chain Snatching Issue in Hyderabad : హైదరాబాద్‌ నగర శివారు రాజేంద్రనగర్​లో పట్టపగలే నడి రోడ్డుపై దోపిడీ ముఠా సభ్యులు రెచ్చిపోయారు. ఉప్పర్​పల్లి చౌరస్తాలో కారులో పయనిస్తున్న యువకుడిని ఐదుగురు వెంబడించి, మెట్రో పిల్లర్​ వద్ద కారు టర్నింగ్‌ చేస్తుండగా హెల్మెట్‌తో దాడి చేశారు. యువకుడిని చితకబాది, 10 తులాల బంగారు గొలుసుని లాగే ప్రయత్నం చేయగా 4 తులాల గొలుసు చేతికి చిక్కడంతో దొంగిలించి పరారయ్యారు. పట్టపగలే దొంగలు రెచ్చిపోవడంతో వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు చైన్‌ స్నాచర్‌ల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Chain Snatch at Ameenpur : ఈ మధ్య కాలంలో రహదారుల వెంబడి జరుగుతున్న ఈ చోరీలు మరింత అలజడిని రేకెత్తిస్తున్నాయి. గత నెలలో సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో సైతం వాహనంపై ప్రయాణిస్తుండగా చోరీకు గురైన రెండు ఘటనలు స్థానికంగా ఆందోళన కలిగించాయి. మహిళల మెడలోని గొలుసును దొంగలించడంతో, ఆ రహదారి వెంబడి మహిళలు వెళ్లాలంటే భయపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.