thumbnail

ప్రపంచాన్ని శాసించే స్థాయిలో భారతదేశం : కేంద్రమంత్రి రిజిజు

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 3:11 PM IST

Central Minister Kiren Rijiju Visits Incois Centre : శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్​లోని ఇన్‌కాయిస్‌ (Incois) ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్​లో నూతనంగా ఏర్పాటు చేసిన సినర్జిస్టిక్‌ ఓషన్‌ అబ్జర్వేషన్‌ ప్రిడిక్షన్‌ సర్వీసెస్‌(SYNOPS) విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఇన్​కాయిస్ శాస్త్రవేత్తలు పాతికేళ్లుగా ఎన్నో పరిశోధనలు చేసి మన దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు సైతం దిక్సూచిగా నిలిచారని ప్రశంసించారు.

India Leading World In Science Technology : దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో ఇన్‌కాయిస్‌ సేవలందించడం అభినందనీయం అని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్​కాయిస్​లో జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలోని రాకెట్ల నమూనాతో కూడిన రాడార్లను పరిశీలించి భూగోళ నమూనా ద్వారా సముద్ర స్థితిగతులను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇన్‌కాయిస్‌ మనదేశానికి గర్వకారణమన్న ఆయన హైదరాబాద్‌ నగరంలో ఇన్‌కాయిస్‌ అభివృద్ధికి సరైన ప్రాంతమన్నారు. ఈ సందర్భంగా ఇన్‌కాయిస్‌ ప్రతినిధులను ఆయన అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.