thumbnail

రాజధాని అమరావతి కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి : జేఏసీ - AP Amaravati JAC demands

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 7:52 PM IST

Amaravati JAC Leaders Demands : భవిష్యత్తులో రాజధానికి ఎవరి నుంచీ ఎలాంటి నష్టం జరగకుండా రక్షణ చట్టం తీసుకురావాలని అమరావతి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు చంద్రబాబుకు విన్నవిస్తామని నాయకులు తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, భూకజ్జాలు, దాడులపై విచారించేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ శాఖకు దళితుడిని మంత్రిగా నియమించాలని కోరారు. విచారణ సంస్థలతో  బాధ్యులైన వారిపై న్యాయ విచారణ చేయించి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. 

అలాగే కొత్తగా ఏర్పాటబోయే ప్రభుత్వం సమన్యాయ పాలన కొనసాగిస్తుందని ఆశిస్తున్నాట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలియని స్థితిలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల అజెండాతో వైసీపీ ఎన్నికలకు వెళ్తే, కూటమి ఏకైక రాజధాని అమరావతి అజెండాతో ఎన్నికలకు వెళ్లారని తెలిపారు. చివరికి రాష్ట్ర ప్రజలు మెుత్తం ఏకమై కూటమికే జై కొట్టారని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జేఏసీ నాయకులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.