thumbnail

LIVE : పార్టీ ఫిరాయింపులపై గవర్నర్​కు ఫిర్యాదు చేసిన బీఆర్​ఎస్​ నేతలు - brs leaders met governor

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 12:52 PM IST

పార్టీ ఫిరాయింపుల అంశంతో పాటు నిరుద్యోగుల సమస్యలను భారత రాష్ట్ర సమితి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. ఇవాళ పార్టీ బృందం కేటీఆర్ నాయకత్వంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్​ను కలిసింది. పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాలని గులాబీ పార్టీ నేతలు గవర్నర్​కు వినతిపత్రం అందించారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే శాసనసభాపతి ప్రసాద్ కుమార్ ఫిర్యాదు చేసిన బీఆర్​ఎస్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ పోరాడుతోంది. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ భేటీలో పార్టీ ఫిరాయింపుల అంశంతో పాటు నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నియామకాల అంశాన్ని గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లినట్లు గులాబీ నేతలు తెలిపారు. కొత్త గవర్నర్​గా రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఆయనను బీఆర్​ఎస్ నేతలు కలవడం ఇదే తొలిసారి. కేటీఆర్​తో పాటు రాజ్​భవన్​కు వెళ్లిన వారిలో పార్టీ నేతలు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.