LIVE: గంగపుత్రుల కుటుంబాలతో భువనేశ్వరి మాటామంతీ - ప్రత్యక్షప్రసారం - Bhuvaneswari Meet Fishermen
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 1:55 PM IST
|Updated : Mar 29, 2024, 2:31 PM IST
Bhuvaneswari Meet with Fisheries Families Live: గంగపుత్రుల కుటుంబాలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మాటామంతీ నిర్వహించారు. అంతకుముందు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యాక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి భువనేశ్వరి కేక్ కట్ చేశారు. కృష్ణా జిల్లాలో నిజం గెలవాలి యాత్రలో భాగంగా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో మనస్తాపంతో మృతిచెందిన కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ క్రమంలో మచిలీపట్నం నుంచి అవనిగడ్డ వెళ్తున్న భువనేశ్వరికి నిమ్మకూరు వద్ద పామర్రు అభ్యర్థి వర్ల కుమార్ రాజా, నాయకులు ఘన స్వాగతం పలికారు. నిమ్మకూరు మహిళలు ఆమెకు పసుపు కుంకుమ అందచేశారు. మహిళలతో భువనేశ్వరి మాట్లాడారు. వారు ఆమెతో ఫొటో దిగారు. కాగా ప్రస్తుతం మత్స్యకారుల కుటుంబాలతో భువశ్వరి మాటామంతీ కార్యక్రమం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Mar 29, 2024, 2:31 PM IST