thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 3:58 PM IST

ETV Bharat / Videos

'వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బీసీలపై దాడులు పెరిగాయి' - BC Welfare Association Supports tdp

BC Welfare Association Support to Chandrababu Naidu in Vijayawada : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బీసీలపై దాడులు పెరిగిపోయాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు అన్నారు. విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శంకరరావు మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలతో గుంటూరులో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశాన్నినిర్వహించామన్నారు. మీటింగ్​లో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీల సంక్షేమంపై చర్చించామన్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇసుక, మైనింగ్, లిక్కర్ వంటి వ్యాపారాలలో విపరీతంగా దోచుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమానంగా జరగాలంటే విజన్ ఉన్న నాయకుడు అధికారంలోకి రావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు లాంటి విజన్ ఉన్న నాయకుడికే సాధ్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలు టీడీపీ, జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.



 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.