By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 4:10 PM IST
పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీకి చర్యలు తీసుకోండి- ప్రభుత్వానికి రేషన్ డీలర్లు విజ్ఞప్తి - Ration Dealers happy to cbn govt
Ration Dealers Palabhishekam to Chandrababu Portrait in Vijayawada : తమ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలోని రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తమంతా ఆదాయ మార్గాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వ్యాఖ్యానించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ సమస్యలు గురించి ఎన్నో సార్లు చెప్పేందుకు ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వకుండా తమ గొంతు నొక్కారని రేషన్ డీలర్లు విమర్శించారు. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు. ఇంటింటికి రేషన్ పంపిణీ విధానం తీసుకొచ్చి రూ. కోట్లు దండుకున్నారని ఆరోపించారు. అందుకే 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తమ మద్ధతు తెలిపారని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరగా రాష్ట్రంలో రేషన్ పంపిణీ పాత విధానంలో చేపట్టాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.