By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 20, 2024, 12:12 PM IST
విశ్వంభర సెట్స్లో మెగాస్టార్తో ఏపీ పర్యటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ - Kandula Durgesh meet Mega star
AP Cinematography Minister Kandula Durgesh meet Mega star chiranjeevi : పర్యాటక, సినిమాటోగ్రఫిశాఖ మంత్రి కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్లోని విశ్వంభర సినిమా సెట్కి వెళ్లిన మంత్రి దుర్గేష్కు చిరంజీవితో పాటు చిత్ర బృందం సాధర స్వాగతం పలికింది. పర్యాటక, సినిమాటోగ్రఫి మంత్రిగా దుర్గేష్ సంపూర్ణ విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. విశ్వంభర’ సెట్స్లో ఆయనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందని మెగాస్టార్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామన్న దుర్గేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సెట్లో ఆయనతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. అందులో చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు మూవీ యూనిట్ సభ్యులు ఉన్నారు. ఇక సోషియో ఫాంటసీ ఫిల్మ్గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.