కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ను వ్యాపార ప్రయోజనాల కోసమే మూసేస్తున్నారు: సీఐటీయూ నేతలు - nellore port issue
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2024/640-480-20657980-thumbnail-16x9-port.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 6:49 PM IST
Adani is Turning Krishnapatnam Port Into a Dirty Port : అదాని యాజమాన్యం కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ను తన వ్యాపార ప్రయోజనాల కోసం మూసివేస్తుందని సీఐటీయూ నేతలు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కంటైనర్ టెర్మినల్ను మూసివేసి బొగ్గు, బూడిద, ఐరన్ఓర్లాంటి వాటిని ఎగుమతి, దిగుమతి చేసి కాలుష్యభరితమైన పోర్టుగా మార్చేయాలని పన్నాగం పన్నిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్నాగానికి వంత పాడుతూ ఖజానాకు, ఉపాధికి గండికొట్టే చర్యలను ప్రొత్సహిస్తుందని నేతలు వ్యాఖ్యానించారు.
కంటైనర్ టెర్మినల్ తరలిపోతే వేలాదిమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొల్పోతారని సీఐటీయూ నేత మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులకు గృహ, పరిశ్రమల అవసరమగు ఉపకరణాలు, విడిభాగాలు దిగుమతులకు అవకాశాలు కోల్పోతామని తెలిపారు. పోర్టుకు సమీపంలో నిర్మించిన గోదాములు కోల్డ్ స్టోరేజ్లు నిరుపయోగమైతాయని వాపోయారు. పోర్టులోని 14 బెర్తులను బొగ్గు, ఐరన్ఓర్, ఎరువులను హ్యాండ్లింగ్ చేయడం వలన కాలుష్యం పెరిగి చుట్టుప్రక్కల గ్రామాల్లో నివాసాలు ఉండే పరిస్థితి లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటైనర్ టెర్మినల్ నిర్వహణ అక్కడ కొనసాగించాలని లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చారించారు.