ETV Bharat / technology

ఐఐటీ మద్రాసులో రూ.500లకే ఆన్​లైన్ కోర్సులు- అప్లైకు లాస్ట్​ డేట్ ఎప్పుడంటే? - Online AI Courses In IIT Madras

author img

By ETV Bharat Tech Team

Published : 3 hours ago

Updated : 3 hours ago

Online AI Courses In IIT Madras: దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల్లో 11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సువర్ణావకాశం. ఏఐ సహా పలు ఆన్‌లైన్ కోర్సులను అందించడానికి IIT మద్రాస్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సందర్భంగా వీటికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి? ఎలా చేయాలి? వంటి వివరాలు మీకోసం.

Online AI Courses In IIT Madras
Online AI Courses In IIT Madras (ETV Bharat)

Online AI Courses In IIT Madras: దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థ IIT-మద్రాస్ విద్యార్థులకు గొప్ప అవకాశాలను అందిస్తోంది. 8 వారాల వ్యవధి గల ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానించింది. ఇందులో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వంటి అధునాతన కోర్సులు ఉన్నాయి.

వాటిలో ఒక్కో కోర్సుకు అప్లికేషన్ ఫీజు కేవలం రూ. 500 మాత్రమే. అయితే ఈ అవకాశం IIT-మద్రాస్‌లో భాగస్వాములుగా నమోదైన పాఠశాలల్లో 11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆయా పాఠశాలల విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సంప్రదించడం ద్వారా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులపై మరిన్ని వివరాలు:

  • ఇప్పటి వరకు 450 పాఠశాలలు ఐఐటీ మద్రాస్‌లో భాగస్వాములుగా చేరాయి.
  • 11,000 మందికి పైగా విద్యార్థులు వివిధ బ్యాచ్‌లలో వివిధ కోర్సుల నుంచి బెనిఫిట్ పొందారని IIT మద్రాస్ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది.
  • భవిష్యత్ తరాన్ని నిపుణులుగా తీర్చిదిద్దడం వారి బాధ్యత. దీంతోపాటు విద్యార్థులకు వారి అభిరుచులకు సరిపోయే కెరీర్ మార్గాన్ని ఎంచుకోవడానికి ముందస్తు అవకాశాలను అందించాల్సిన అవసరం ఉంది.
  • ఈ నేపథ్యంలోనే ఐఐటీ మద్రాస్ భాగస్వామ్య పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.
  • ఇందుకోసం అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమై అక్టోబర్ 4 వరకు కొనసాగనుంది.
  • ఇందులో పార్టనర్​గా జాయిన్ అయ్యేందుకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంది.
  • అక్టోబర్ 21 నుంచి ఈ ఆన్‌లైన్ కోర్సు బ్యాచ్‌లు ప్రారంభమవుతాయని ఐఐటీ మద్రాస్ స్పష్టం చేసింది.
  • ఏదైనా స్ట్రీమ్‌లోని 11వ తరగతి విద్యార్థులు డేటా సైన్స్ అండ్ ఏఐ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అయితే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కోర్సుకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివినవారు మాత్రమే అర్హులు.
  • కోర్సులో భాగంగా ప్రతి సోమవారం 30 నిమిషాల నిడివితో రికార్డ్ చేసిన లెక్చర్ వీడియోలు రిలీజ్ చేస్తారు. విద్యార్థులు వాటిని వారంలో ఎప్పుడైనా చూడొచ్చు.
  • శనివారాలు లేదా ఆదివారాల్లో నెలకు ఒకసారి లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది.
  • ఆన్‌లైన్ అసైన్‌మెంట్స్​లో 15 రోజులకు ఒకటి చొప్పున మొత్తం 4 ప్రాజెక్టులు ఉంటాయి. వీటిని సబ్మిట్ చేసేందుకు 2 వారాల గడువు ఉంటుంది.
  • విద్యార్థులు సబ్జెక్ట్ వీడియోలను వీక్షించి నిర్ణీత సమయంలోగా తమ అసైన్‌మెంట్‌లను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి.
  • ప్రతి అసైన్‌మెంట్​లో విద్యార్థులకు కనీసం 40శాతం మార్కులు రావాలి. నాలుగు ప్రాజెక్టులలో కనీసం మూడు ప్రాజెక్టులల్లో అయినా 40 శాతం మార్కులు వస్తేనే తుది మూల్యాంకనం చేస్తారు.
  • ఫైనల్​గా 8 వారాల ఆన్​లైన్​ కోర్సులను పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు ఇ-సర్టిఫికేట్‌లు ఇస్తారు.

'ఏఐలో 12.5 లక్షల ఉద్యోగాలు'- ఈ స్కిల్స్ నేర్చుకో జాబ్ పట్టుకో! - JOBS IN ARTIFICIAL INTELLIGENCE

AI ఫీచర్లతో 'ఏసర్' ల్యాప్​టాప్స్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - Acer AI Laptops Unveils

Online AI Courses In IIT Madras: దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థ IIT-మద్రాస్ విద్యార్థులకు గొప్ప అవకాశాలను అందిస్తోంది. 8 వారాల వ్యవధి గల ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానించింది. ఇందులో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వంటి అధునాతన కోర్సులు ఉన్నాయి.

వాటిలో ఒక్కో కోర్సుకు అప్లికేషన్ ఫీజు కేవలం రూ. 500 మాత్రమే. అయితే ఈ అవకాశం IIT-మద్రాస్‌లో భాగస్వాములుగా నమోదైన పాఠశాలల్లో 11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆయా పాఠశాలల విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సంప్రదించడం ద్వారా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులపై మరిన్ని వివరాలు:

  • ఇప్పటి వరకు 450 పాఠశాలలు ఐఐటీ మద్రాస్‌లో భాగస్వాములుగా చేరాయి.
  • 11,000 మందికి పైగా విద్యార్థులు వివిధ బ్యాచ్‌లలో వివిధ కోర్సుల నుంచి బెనిఫిట్ పొందారని IIT మద్రాస్ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది.
  • భవిష్యత్ తరాన్ని నిపుణులుగా తీర్చిదిద్దడం వారి బాధ్యత. దీంతోపాటు విద్యార్థులకు వారి అభిరుచులకు సరిపోయే కెరీర్ మార్గాన్ని ఎంచుకోవడానికి ముందస్తు అవకాశాలను అందించాల్సిన అవసరం ఉంది.
  • ఈ నేపథ్యంలోనే ఐఐటీ మద్రాస్ భాగస్వామ్య పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.
  • ఇందుకోసం అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమై అక్టోబర్ 4 వరకు కొనసాగనుంది.
  • ఇందులో పార్టనర్​గా జాయిన్ అయ్యేందుకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంది.
  • అక్టోబర్ 21 నుంచి ఈ ఆన్‌లైన్ కోర్సు బ్యాచ్‌లు ప్రారంభమవుతాయని ఐఐటీ మద్రాస్ స్పష్టం చేసింది.
  • ఏదైనా స్ట్రీమ్‌లోని 11వ తరగతి విద్యార్థులు డేటా సైన్స్ అండ్ ఏఐ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అయితే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కోర్సుకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివినవారు మాత్రమే అర్హులు.
  • కోర్సులో భాగంగా ప్రతి సోమవారం 30 నిమిషాల నిడివితో రికార్డ్ చేసిన లెక్చర్ వీడియోలు రిలీజ్ చేస్తారు. విద్యార్థులు వాటిని వారంలో ఎప్పుడైనా చూడొచ్చు.
  • శనివారాలు లేదా ఆదివారాల్లో నెలకు ఒకసారి లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది.
  • ఆన్‌లైన్ అసైన్‌మెంట్స్​లో 15 రోజులకు ఒకటి చొప్పున మొత్తం 4 ప్రాజెక్టులు ఉంటాయి. వీటిని సబ్మిట్ చేసేందుకు 2 వారాల గడువు ఉంటుంది.
  • విద్యార్థులు సబ్జెక్ట్ వీడియోలను వీక్షించి నిర్ణీత సమయంలోగా తమ అసైన్‌మెంట్‌లను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి.
  • ప్రతి అసైన్‌మెంట్​లో విద్యార్థులకు కనీసం 40శాతం మార్కులు రావాలి. నాలుగు ప్రాజెక్టులలో కనీసం మూడు ప్రాజెక్టులల్లో అయినా 40 శాతం మార్కులు వస్తేనే తుది మూల్యాంకనం చేస్తారు.
  • ఫైనల్​గా 8 వారాల ఆన్​లైన్​ కోర్సులను పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు ఇ-సర్టిఫికేట్‌లు ఇస్తారు.

'ఏఐలో 12.5 లక్షల ఉద్యోగాలు'- ఈ స్కిల్స్ నేర్చుకో జాబ్ పట్టుకో! - JOBS IN ARTIFICIAL INTELLIGENCE

AI ఫీచర్లతో 'ఏసర్' ల్యాప్​టాప్స్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - Acer AI Laptops Unveils

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.