YSRCP Leader Sajjala Attend Hearing At Police Station : ఏపీలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సజ్జల పాత్రను పోలీసులు గుర్తించారు. ఆ మేరకు సజ్జలను మంగళగిరి గ్రామీణ పోలీసులు విచారణకు పిలిచారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సిఐ వై. శ్రీనివాసరావు సజ్జలను విచారిస్తున్నారు. అయితే సజ్జల విచారణకు వచ్చిన సందర్భంగా కాసేపు నాటకీయ పరిణామాలు జరిగాయి.
సజ్జల వెంట తనను పంపాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనకు దిగారు. కేవలం సజ్జలను మాత్రమే పంపాలని ఉన్నతాధికారులు చెప్పినట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పొన్నవోలు పోలీసులతో గొడవకు దిగారు. ఉన్నతాధికారులతో మాట్లాడగా వారు కూడా సజ్జలనుమాత్రమే లోపలకు పంపాలని స్పష్టం చేశారు. దీంతో సజ్జలను మాత్రమే పోలీసులు లోపలకు పంపించారు. ఈ సందర్భంగా సీఐపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి వేలు చూపి బెదిరించారు. ఇవాళ సాయంత్రం వరకూ సజ్జలను పోలీసులు విచారిస్తారు. దీని కోసం ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు. గతంలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సజ్జలను విచారిస్తున్నారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - విచారణకు హాజరైన సజ్జల - పోలీసులను వేలు చూపి బెదిరించిన పొన్నవోలు
మంగళగిరి గ్రామీణ పీఎస్లో విచారణకు హాజరైన వైసీపీ నేత సజ్జల - పోలీసులతో వాగ్వాదానికి దిగిన పొన్నవోలు సుధాకర్రెడ్డి
Published : 2 hours ago
YSRCP Leader Sajjala Attend Hearing At Police Station : ఏపీలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సజ్జల పాత్రను పోలీసులు గుర్తించారు. ఆ మేరకు సజ్జలను మంగళగిరి గ్రామీణ పోలీసులు విచారణకు పిలిచారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సిఐ వై. శ్రీనివాసరావు సజ్జలను విచారిస్తున్నారు. అయితే సజ్జల విచారణకు వచ్చిన సందర్భంగా కాసేపు నాటకీయ పరిణామాలు జరిగాయి.
సజ్జల వెంట తనను పంపాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనకు దిగారు. కేవలం సజ్జలను మాత్రమే పంపాలని ఉన్నతాధికారులు చెప్పినట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పొన్నవోలు పోలీసులతో గొడవకు దిగారు. ఉన్నతాధికారులతో మాట్లాడగా వారు కూడా సజ్జలనుమాత్రమే లోపలకు పంపాలని స్పష్టం చేశారు. దీంతో సజ్జలను మాత్రమే పోలీసులు లోపలకు పంపించారు. ఈ సందర్భంగా సీఐపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి వేలు చూపి బెదిరించారు. ఇవాళ సాయంత్రం వరకూ సజ్జలను పోలీసులు విచారిస్తారు. దీని కోసం ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు. గతంలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సజ్జలను విచారిస్తున్నారు.