ETV Bharat / state

పప్పు వండే ముందు నానబెడుతున్నారా? - అసలు ఎందుకు నానబెట్టాలో మీకు తెలుసా? - WHY ARE PULSES SOAKED in water

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 2:16 PM IST

Pulses Soaked before Cooking : పప్పు ధాన్యాలను వండే ముందు దాదాపు అందరూ దానిని నానబెడుతుంటారు. బాగా నానితే త్వరగా ఉడుకుతాయని అనుకుంటారు. అయితే ఇది కరక్టేనా? నానబెట్టడం వల్ల త్వరగా ఉడకడంతో పాటు మరేమైనా ప్రయోజనాలు ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం.

Why are Pulses Soaked in Water Telugu
Why are Pulses Soaked in Water Telugu (ETV Bharat)

Why are Pulses Soaked in Water Telugu : ప్రతి ఇంటి కిచెన్​లో పప్పులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పప్పులను కూరలుగానూ, నానబెట్టి తినడం, పొడుల రూపంలోనూ వాడుతారు. పప్పుల ద్వారా శరీరానికి మాంసం తినడానికన్నా ఎక్కువ ప్రొటీన్లు అందుతాయి. అందుకే ప్రతి పేదవాడు మాంసం తెచ్చుకోపోయినా పప్పులను వంటకాల్లో వాడుతారు. కొందరు డైలీ డైట్​లో ఉదయం నానబెట్టిన పప్పు గింజలను తింటారు. మరికొంత మంది స్నాక్స్​గా ఉడికించి తింటారు. అసలు ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించారా? పప్పులను వండే ముందు ఎందుకు నానబెడతారని? దీనివల్ల ఉపయోగం ఏంటని? అసలు ఏ పప్పును ఎన్ని గంటలు నానబెట్టాలో తెలుసా? ఎలా నానబెట్టాలో మీకు ఐడియా ఉందా?

ఎందుకు నానబెట్టాలంటే : కంది, శెనగపప్పు, పెసర, రాజ్మా గింజలు, కాబూలీ శెనగలు వంటివి మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటాం. అయితే వీటిని వండుకునే ముందు కొన్ని గంటల పాటు నానబెట్టడం మనకు అలవాటే. నిజానికి ఈ ప్రక్రియ వల్ల అవి తొందరగా ఉడకడమే కాకుండా జీర్ణ వ్యవస్థకూ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పప్పులను నానబెట్టడం వల్ల వీటిలో ఉండే ఫైటేస్​ అనే ఎంజైమ్​ యాక్టివేట్​ అయి ఇది పప్పుల్లోని పోషకాల్ని శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. అలాగే నానబెట్టడం వల్ల ఇంకో లాభం ఉందండోయ్​. అదే అమైలేజ్​ అనే సమ్మేళనం యాక్టివేట్​ అయి పప్పులు, కాయధాన్యాల్లోని సంక్లిష్ట పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీని ఫలితంగా అవి త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. ఫలితంగా కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్​ వంటి జీర్ణ సమస్యలను దూరం చేయవచ్చు.

పప్పులను ఎంతసేపు నానెబెట్టాలో తెలుసా? : పప్పులు, కాయధాన్యాలను ఒక్కో రకాన్ని బట్టి దాన్ని నానబెట్టే సమయం మారుందని నిపుణులు చెబుతున్నారు. వాటిలో

  • కంది, పెసర, మినప్పప్పు, శెనగ వంటివి 6-8 గంటలు నాననివ్వాలి.
  • మినుములు, పెసలు వంటి ముడిపప్పులను 8-12 గంటల పాటు నానబెట్టాలి.
  • కాబూలీ శెనగలు, రాజ్మా, శెనగలు వంటి కాయధాన్యాల్ని 12-18 గంటలు నానబెట్టాలి. ఇక ఇంత సమయం లేదనుకునేవారు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వండుకున్నా ఫర్వాలేదు.

పప్పులను కడగడానికి కూడా ఓ పద్ధతుంది : ప్రస్తుతం మారుతున్న కాలంలో ప్రతీది ఎక్కువకాలం నిల్వ ఉంచుకోవాలని చూస్తారు. ఈ క్రమంలో మార్కెట్​లో దొరికే పప్పులకు పాలిష్​ చేసేస్తున్నారు. ఈ క్రమంలో పప్పుకు పురుగులు పట్టకుండా కృత్రిమ రంగులు, కొన్ని పౌడర్లు కలుపుతున్నారు. ఇక ఆ పప్పునే వినియోగదారులు కొనాలని మెరుపు కోసం నైలాన్​, లెదర్​, మఖ్మల్​ పాలిష్​ కూడా చేస్తారు. ఇలా చేసిన వాటిని తినడం అనారోగ్యం. అందుకే వీటిని వండుకునే ముందు ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుగుకోవాలి.

  • కావాల్సినంత పప్పును ఒక గిన్నెలో తీసుకొని అందులో నీరు పోసుకొని 3-4 సార్లు చేత్తో నలుపుతూ శుభ్రంగా నీటితో కడగాలి.
  • ఆ తర్వాత రంధ్రాలు ఉన్న జల్లెడను తీసుకొని ఆపప్పును అందులో వేయాలి. ఆతర్వాత కుళాయి నీటి కింద ఉంచి మరోసారి కడగాలి. ఇలా చేయడం వల్ల అడుగున ఉండే రసాయనాలు బయటకు వెళ్లిపోతాయి.
  • ఇప్పుడు మరో గిన్నెలో పప్పు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువసేపు పప్పు నానుతుంది. రసాయనాలు ఏవైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి.
  • తిరిగి వండుకునే ముందు మరో రెండుమూడుసార్లు కడగడం వల్ల పూర్తిగా రసాయనాలు తొలగిపోతాయి.

ఆ నీటిని ఎందుకు పడేస్తున్నారు, ఈ విధంగా ఉపయోగించండి : కొంతమంది పప్పును నానబెట్టిన తర్వాత పారేయాలని, లేకపోతే అలాగే వార్చకుండా వండుకోవడం చేస్తుంటారు. ఈ రెండు పద్ధతులు కరెక్టు కాదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే నానబెట్టిన నీటిలో టానిన్లు ఎక్కువగా ఉండడంతో ఇవి కడుపులోకి వెళ్తే కడుపుబ్బరం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఆ నీటిని పడేయకుండా మొక్కలకు పోస్తే అవి మరింత ఏపుగా పెరుగుతాయి. ఈ పద్ధతులు పాటిస్తే స్వచ్ఛమైన పప్పుతో పాటు ప్రోటీన్​ ఫుడ్​ అందుతుంది.

పప్పులకు పురుగు పట్టకుండా రసాయనాలు వేస్తున్నారా? - చాలా డేంజర్ - ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి! - Pulses Storage Tips

పప్పుదినుసులు ఎక్కువ రోజులు నిల్వ చేయాలా? ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​!

Why are Pulses Soaked in Water Telugu : ప్రతి ఇంటి కిచెన్​లో పప్పులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పప్పులను కూరలుగానూ, నానబెట్టి తినడం, పొడుల రూపంలోనూ వాడుతారు. పప్పుల ద్వారా శరీరానికి మాంసం తినడానికన్నా ఎక్కువ ప్రొటీన్లు అందుతాయి. అందుకే ప్రతి పేదవాడు మాంసం తెచ్చుకోపోయినా పప్పులను వంటకాల్లో వాడుతారు. కొందరు డైలీ డైట్​లో ఉదయం నానబెట్టిన పప్పు గింజలను తింటారు. మరికొంత మంది స్నాక్స్​గా ఉడికించి తింటారు. అసలు ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించారా? పప్పులను వండే ముందు ఎందుకు నానబెడతారని? దీనివల్ల ఉపయోగం ఏంటని? అసలు ఏ పప్పును ఎన్ని గంటలు నానబెట్టాలో తెలుసా? ఎలా నానబెట్టాలో మీకు ఐడియా ఉందా?

ఎందుకు నానబెట్టాలంటే : కంది, శెనగపప్పు, పెసర, రాజ్మా గింజలు, కాబూలీ శెనగలు వంటివి మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటాం. అయితే వీటిని వండుకునే ముందు కొన్ని గంటల పాటు నానబెట్టడం మనకు అలవాటే. నిజానికి ఈ ప్రక్రియ వల్ల అవి తొందరగా ఉడకడమే కాకుండా జీర్ణ వ్యవస్థకూ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పప్పులను నానబెట్టడం వల్ల వీటిలో ఉండే ఫైటేస్​ అనే ఎంజైమ్​ యాక్టివేట్​ అయి ఇది పప్పుల్లోని పోషకాల్ని శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. అలాగే నానబెట్టడం వల్ల ఇంకో లాభం ఉందండోయ్​. అదే అమైలేజ్​ అనే సమ్మేళనం యాక్టివేట్​ అయి పప్పులు, కాయధాన్యాల్లోని సంక్లిష్ట పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీని ఫలితంగా అవి త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. ఫలితంగా కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్​ వంటి జీర్ణ సమస్యలను దూరం చేయవచ్చు.

పప్పులను ఎంతసేపు నానెబెట్టాలో తెలుసా? : పప్పులు, కాయధాన్యాలను ఒక్కో రకాన్ని బట్టి దాన్ని నానబెట్టే సమయం మారుందని నిపుణులు చెబుతున్నారు. వాటిలో

  • కంది, పెసర, మినప్పప్పు, శెనగ వంటివి 6-8 గంటలు నాననివ్వాలి.
  • మినుములు, పెసలు వంటి ముడిపప్పులను 8-12 గంటల పాటు నానబెట్టాలి.
  • కాబూలీ శెనగలు, రాజ్మా, శెనగలు వంటి కాయధాన్యాల్ని 12-18 గంటలు నానబెట్టాలి. ఇక ఇంత సమయం లేదనుకునేవారు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వండుకున్నా ఫర్వాలేదు.

పప్పులను కడగడానికి కూడా ఓ పద్ధతుంది : ప్రస్తుతం మారుతున్న కాలంలో ప్రతీది ఎక్కువకాలం నిల్వ ఉంచుకోవాలని చూస్తారు. ఈ క్రమంలో మార్కెట్​లో దొరికే పప్పులకు పాలిష్​ చేసేస్తున్నారు. ఈ క్రమంలో పప్పుకు పురుగులు పట్టకుండా కృత్రిమ రంగులు, కొన్ని పౌడర్లు కలుపుతున్నారు. ఇక ఆ పప్పునే వినియోగదారులు కొనాలని మెరుపు కోసం నైలాన్​, లెదర్​, మఖ్మల్​ పాలిష్​ కూడా చేస్తారు. ఇలా చేసిన వాటిని తినడం అనారోగ్యం. అందుకే వీటిని వండుకునే ముందు ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుగుకోవాలి.

  • కావాల్సినంత పప్పును ఒక గిన్నెలో తీసుకొని అందులో నీరు పోసుకొని 3-4 సార్లు చేత్తో నలుపుతూ శుభ్రంగా నీటితో కడగాలి.
  • ఆ తర్వాత రంధ్రాలు ఉన్న జల్లెడను తీసుకొని ఆపప్పును అందులో వేయాలి. ఆతర్వాత కుళాయి నీటి కింద ఉంచి మరోసారి కడగాలి. ఇలా చేయడం వల్ల అడుగున ఉండే రసాయనాలు బయటకు వెళ్లిపోతాయి.
  • ఇప్పుడు మరో గిన్నెలో పప్పు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువసేపు పప్పు నానుతుంది. రసాయనాలు ఏవైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి.
  • తిరిగి వండుకునే ముందు మరో రెండుమూడుసార్లు కడగడం వల్ల పూర్తిగా రసాయనాలు తొలగిపోతాయి.

ఆ నీటిని ఎందుకు పడేస్తున్నారు, ఈ విధంగా ఉపయోగించండి : కొంతమంది పప్పును నానబెట్టిన తర్వాత పారేయాలని, లేకపోతే అలాగే వార్చకుండా వండుకోవడం చేస్తుంటారు. ఈ రెండు పద్ధతులు కరెక్టు కాదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే నానబెట్టిన నీటిలో టానిన్లు ఎక్కువగా ఉండడంతో ఇవి కడుపులోకి వెళ్తే కడుపుబ్బరం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఆ నీటిని పడేయకుండా మొక్కలకు పోస్తే అవి మరింత ఏపుగా పెరుగుతాయి. ఈ పద్ధతులు పాటిస్తే స్వచ్ఛమైన పప్పుతో పాటు ప్రోటీన్​ ఫుడ్​ అందుతుంది.

పప్పులకు పురుగు పట్టకుండా రసాయనాలు వేస్తున్నారా? - చాలా డేంజర్ - ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి! - Pulses Storage Tips

పప్పుదినుసులు ఎక్కువ రోజులు నిల్వ చేయాలా? ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.