ETV Bharat / state

విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం - తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో నిర్ణయం - TG CM REVANTH AND AP CM CBN MEETING

Telugu States CMs Meeting on Division of State : విభజన సమస్యల కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేసి మూడంచెల్లో సమస్యలు పరిష్కరించాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు. రెండు వారాల్లో ఇరు రాష్ట్రాల సీఎస్​ల నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి అధికారుల కమిటీని నియమించనున్నారు. అధికారుల కమిటీ పరిష్కరించలేని సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ ఏర్పాటు కానుంది. మంత్రుల కమిటీ సైతం పరిష్కరించలేని అంశాలపై సీఎంలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై రెండు రాష్ట్రాలూ ఉమ్మడిగా పోరాటం చేయాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 7:27 AM IST

Updated : Jul 7, 2024, 8:29 AM IST

Telugu States CMs Meeting Decision
Telugu States CMs Meeting Decision (ETV Bharat)

CM Revanth Reddy and CM Chandrababu Meeting : విభజన చట్టంలోని పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, అధికారుల బృందం సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. సంప్రదింపుల కోసం ప్రజాభవన్‌కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడును తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు. శాలువా కప్పి కాళోజి నారాయణరావు రచించిన 'నా గొడవ' పుస్తకాన్ని బహుకరించారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కకు చంద్రబాబునాయుడు వెంకటేశ్వరస్వామి ఫొటోలను బహుకరించారు.

ఈ సమావేశంలో తెలంగాణ తరఫున సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్​ శాంతికుమారి ఉన్నారు. ఏపీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్​, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు సీఎస్‌లు ఆయా రాష్ట్రాల ఏజెండాలు చదివి వినిపించారు.

పదేళ్ల సమస్య పరిష్కారం మూడంచెల్లో : పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించే అవకాశం లేనందున మూడంచెల్లో పరిష్కరించుకోవాలని సీఎంలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అంశాలవారీగా చొరవతీసుకుని న్యాయపరమైన చిక్కులపైనా చర్చించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అధికారులు తొలుత విభజన చట్టంలోని 9,10వ షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఆస్తుల విభజన, ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అంశం, విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, 15 ఎయిడెడ్‌ ప్రాజెక్టుల రుణ పంపకాలు, రెండు రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను వివరించారు. ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయలను తెలియజేశారు.

కృష్ణా జలాలపై కలిసి పని చేయాలి : అన్నింటిపైనా విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. సీఎస్‌లు, మంత్రుల కమిటీ పరిధిలో పరిష్కారం దొరకని వాటిపై తమ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బేషజాలు, పంతాలకు వెళ్లకుండా ఆలోచిస్తే కొన్ని సమస్యలు అధికారులే పరిష్కరించగలరన్నారు. సుధీర్ఘ ఉద్యమంతో ఏర్పాటైన తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా వెళ్లాలని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై రెండు రాష్ట్రాలు కలిసి కేంద్రంతో మాట్లాడాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని రేవంత్‌రెడ్డి కోరారు. సున్నితమైన రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలను గౌరవించేలా నడుచుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

ఏపీ, తెలంగాణలో సుపరిపాలన ఉన్నందున రెండు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. విభజన సమస్యల పరిష్కారానికి రెండు వారాల్లో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కమిటీల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్‌లను సీఎంలు ఆదేశించారు.

"ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలు అందరూ కూలంకుశంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వీటి పరిష్కార మార్గాలు చూడడానికి ముందుగా రెండు రాష్ట్రాల ఉన్నతస్థాయి అధికారులతో కూడుకున్న ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రెండు వారాల్లోపు సమావేశమై వాళ్లస్థాయిలో పరిష్కారానికి వచ్చే అంశాలను చర్చించనున్నారు. ఈ కమిటీ ద్వారా పరిష్కారం కాని అంశాలు ఏవైనా ఉంటే రాష్ట్రస్థాయి మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీ కూడా పరిష్కార మార్గం చూపకపోతే ముఖ్యమంత్రుల వద్దకు ఆ సమస్య వెళుతుంది." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

మాదకద్రవ్యాల కట్టడికి కలిసి ముందు : మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై ఉమ్మడి పోరాటం చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. డ్రగ్స్ మహమ్మరి యువతకు శాపంగా మారిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇరు రాష్ట్రాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చాల్సిన అవసరం ఉందనగా చంద్రబాబు కూడా అంగీకరించారు. డ్రగ్స్, సైబర్ క్రైంపై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివరించిన రేవంత్‌రెడ్డి, ఏపీ కూడా కలిసి రావాలని కోరగా చంద్రబాబు సమ్మతించారు. రెండు రాష్ట్రాల అదనపు డీజీ స్థాయి అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు భట్టివిక్రమార్క తెలిపారు.

"ఏపీలో ఇప్పటికే డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో అణిచివేయాలనే ఉద్దేశంతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. ఇరు రాష్ట్రాల అడిషనల్​ డీజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. విభజన సమస్యలపై సత్వరమే నిర్ణయం తీసుకుందాం. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా సమావేశం కావడం చాలా శుభపరిణామం." - ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్​

ఆరు గ్యారంటీల ఖర్చుపై చంద్రబాబు ఆరా : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చవుతుందని తెలంగాణ సీఎస్‌ను ఏపీ సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్న చంద్రబాబు, నిధుల సమీకరణ ఎలా చేస్తున్నారని రేవంత్ రెడ్డి నుంచి ఆరా తీశారు. ఏపీలో కలిపిన ఐదు గ్రామపంచాయతీలను తమకు తిరిగివ్వాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పదని ఏపీ అధికారులు చెప్పారు. సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, మంత్రులు, అధికారులు అందరూ కలిసి భోజనం చేశారు.

'చంద్రబాబు స్ట్రాంగ్ లీడర్​, కేంద్రంలో ఆయనే కింగ్ మేకర్- మోదీ కొన్నిసార్లు రాజీపడాల్సిందే!' - Senior Journalist N Ram Interview

తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ - BJP MP Laxman said CMs Meeting

CM Revanth Reddy and CM Chandrababu Meeting : విభజన చట్టంలోని పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, అధికారుల బృందం సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. సంప్రదింపుల కోసం ప్రజాభవన్‌కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడును తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు. శాలువా కప్పి కాళోజి నారాయణరావు రచించిన 'నా గొడవ' పుస్తకాన్ని బహుకరించారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కకు చంద్రబాబునాయుడు వెంకటేశ్వరస్వామి ఫొటోలను బహుకరించారు.

ఈ సమావేశంలో తెలంగాణ తరఫున సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్​ శాంతికుమారి ఉన్నారు. ఏపీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్​, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు సీఎస్‌లు ఆయా రాష్ట్రాల ఏజెండాలు చదివి వినిపించారు.

పదేళ్ల సమస్య పరిష్కారం మూడంచెల్లో : పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించే అవకాశం లేనందున మూడంచెల్లో పరిష్కరించుకోవాలని సీఎంలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అంశాలవారీగా చొరవతీసుకుని న్యాయపరమైన చిక్కులపైనా చర్చించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అధికారులు తొలుత విభజన చట్టంలోని 9,10వ షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఆస్తుల విభజన, ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అంశం, విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, 15 ఎయిడెడ్‌ ప్రాజెక్టుల రుణ పంపకాలు, రెండు రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను వివరించారు. ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయలను తెలియజేశారు.

కృష్ణా జలాలపై కలిసి పని చేయాలి : అన్నింటిపైనా విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. సీఎస్‌లు, మంత్రుల కమిటీ పరిధిలో పరిష్కారం దొరకని వాటిపై తమ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బేషజాలు, పంతాలకు వెళ్లకుండా ఆలోచిస్తే కొన్ని సమస్యలు అధికారులే పరిష్కరించగలరన్నారు. సుధీర్ఘ ఉద్యమంతో ఏర్పాటైన తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా వెళ్లాలని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై రెండు రాష్ట్రాలు కలిసి కేంద్రంతో మాట్లాడాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని రేవంత్‌రెడ్డి కోరారు. సున్నితమైన రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలను గౌరవించేలా నడుచుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

ఏపీ, తెలంగాణలో సుపరిపాలన ఉన్నందున రెండు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. విభజన సమస్యల పరిష్కారానికి రెండు వారాల్లో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కమిటీల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్‌లను సీఎంలు ఆదేశించారు.

"ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలు అందరూ కూలంకుశంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వీటి పరిష్కార మార్గాలు చూడడానికి ముందుగా రెండు రాష్ట్రాల ఉన్నతస్థాయి అధికారులతో కూడుకున్న ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రెండు వారాల్లోపు సమావేశమై వాళ్లస్థాయిలో పరిష్కారానికి వచ్చే అంశాలను చర్చించనున్నారు. ఈ కమిటీ ద్వారా పరిష్కారం కాని అంశాలు ఏవైనా ఉంటే రాష్ట్రస్థాయి మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీ కూడా పరిష్కార మార్గం చూపకపోతే ముఖ్యమంత్రుల వద్దకు ఆ సమస్య వెళుతుంది." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

మాదకద్రవ్యాల కట్టడికి కలిసి ముందు : మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై ఉమ్మడి పోరాటం చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. డ్రగ్స్ మహమ్మరి యువతకు శాపంగా మారిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇరు రాష్ట్రాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చాల్సిన అవసరం ఉందనగా చంద్రబాబు కూడా అంగీకరించారు. డ్రగ్స్, సైబర్ క్రైంపై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివరించిన రేవంత్‌రెడ్డి, ఏపీ కూడా కలిసి రావాలని కోరగా చంద్రబాబు సమ్మతించారు. రెండు రాష్ట్రాల అదనపు డీజీ స్థాయి అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు భట్టివిక్రమార్క తెలిపారు.

"ఏపీలో ఇప్పటికే డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో అణిచివేయాలనే ఉద్దేశంతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. ఇరు రాష్ట్రాల అడిషనల్​ డీజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. విభజన సమస్యలపై సత్వరమే నిర్ణయం తీసుకుందాం. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా సమావేశం కావడం చాలా శుభపరిణామం." - ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్​

ఆరు గ్యారంటీల ఖర్చుపై చంద్రబాబు ఆరా : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చవుతుందని తెలంగాణ సీఎస్‌ను ఏపీ సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్న చంద్రబాబు, నిధుల సమీకరణ ఎలా చేస్తున్నారని రేవంత్ రెడ్డి నుంచి ఆరా తీశారు. ఏపీలో కలిపిన ఐదు గ్రామపంచాయతీలను తమకు తిరిగివ్వాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పదని ఏపీ అధికారులు చెప్పారు. సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, మంత్రులు, అధికారులు అందరూ కలిసి భోజనం చేశారు.

'చంద్రబాబు స్ట్రాంగ్ లీడర్​, కేంద్రంలో ఆయనే కింగ్ మేకర్- మోదీ కొన్నిసార్లు రాజీపడాల్సిందే!' - Senior Journalist N Ram Interview

తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ - BJP MP Laxman said CMs Meeting

Last Updated : Jul 7, 2024, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.