ETV Bharat / state

'విద్యాశాఖ మంత్రిని నియమించి చదువును వ్యాపారంగా మార్చిన కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి' - TNSF Protest at TG Intermediate Board

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 3:51 PM IST

TNSF Protest at TG Intermediate Board : రాష్ట్రంలో కోచింగ్​ సెంటర్లు విద్యను వ్యాపారం చేస్తూ లక్షల్లో ఫీజు దండుకుంటు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆర్థిక దోపిడికి గురి చేస్తున్నారని తెలంగాణ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్​ఎస్​ఎఫ్​) మండిపడింది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్​ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లోని విద్యారంగ సమస్యలపై ఇంటర్మీడియట్​ బోర్డు ముందు నిరసన చేపట్టింది.

TNSF Protest at TG Intermediate Board
TDP Followers Protest in Hyderabad (ETV Bharat)

TNSF Protest at TG Intermediate Board in Hyderabad : మధ్యతరగతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలంటే అనేక సమస్యల్లో ఆర్థిక ఇబ్బంది ఒకటని ప్రైవేట్​ కళాశాలలను కోచింగ్​ పేరుతో మరింత సమస్యలు సృష్టిస్తున్నారని తెలంగాణ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్​ఎస్​ఎఫ్​) ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటర్మీడియట్​ విద్యారంగ సమస్యలపై హైదరాబాద్​లోని నాంపల్లిలో ఉన్న బోర్డు ఆఫ్​ ఇంటర్మీడియట్​ దగ్గర నిరసన తెలిపింది. వెంటనే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది.

TNSF Demands on Intermediate Education : జూనియర్ కళాశాలలో అకాడమీలు(కోచింగ్​ సెంటర్లు)గా మార్చి ఇంటర్​ బోర్ఢు నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ, నీట్​, జేఈఈ కోచింగ్​ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని టీఎన్​ఎస్​ఎఫ్ పేర్కొంది. వాటిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాంట్రగడ్డ ప్రసన్న కోరారు. విద్యను వ్యాపారం చేస్తూ లక్షల్లో ఫీజు దండుకుంటున్నారని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆర్థిక దోపిడికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారంగా కోచింగ్​ల పేరుతో విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇంటర్మీడియట్​ బోర్డు పట్టించుకోక పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ ఈడు పిల్లల్ని స్కూల్​కు రప్పించడమే లక్ష్యంగా - జూన్ 3 నుంచి బడిబాట - BADI BATA IN TELANGANA 2024

ఇంటర్​ విద్యను వ్యాపారంగా మలుచుకుని పుస్తకాలు, స్టేషనరీ, దుస్తుల పేరుతో వేలాది రూపాయలు ప్రైవేట్​ సంస్థలు దోచుకుంటున్నారని ప్రసన్న ఆరోపించారు. ఇప్పిటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్​, కార్పొరేట్​ కళాశాలలపై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

"ఇంటర్మీడియట్​ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకల మీద టీఎన్​ఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో నిరసన చేపట్టాం. అనేక రకాల కోచింగ్​ల పేరుతో దళారి వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షల్లో రూపాయలను దండుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకొనేవారు లేకపోవడం బాధాకరం. జూనియర్ కళాశాల్లో సిబ్బంది పెంచడంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాం." - కాంట్రగడ్డ ప్రసన్న, టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

'విద్యాశాఖ మంత్రిని నియమించి చదువును వ్యాపారం చేస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి' (ETV Bharat)

విదేశాల్లో ఉద్యోగాల కోసం పాట్లు - గణనీయంగా తగ్గిన ఫారెన్​ జాబ్స్​ - Jobs Decreased in Foreign Countries

TNSF Protest at TG Intermediate Board in Hyderabad : మధ్యతరగతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలంటే అనేక సమస్యల్లో ఆర్థిక ఇబ్బంది ఒకటని ప్రైవేట్​ కళాశాలలను కోచింగ్​ పేరుతో మరింత సమస్యలు సృష్టిస్తున్నారని తెలంగాణ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్​ఎస్​ఎఫ్​) ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటర్మీడియట్​ విద్యారంగ సమస్యలపై హైదరాబాద్​లోని నాంపల్లిలో ఉన్న బోర్డు ఆఫ్​ ఇంటర్మీడియట్​ దగ్గర నిరసన తెలిపింది. వెంటనే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది.

TNSF Demands on Intermediate Education : జూనియర్ కళాశాలలో అకాడమీలు(కోచింగ్​ సెంటర్లు)గా మార్చి ఇంటర్​ బోర్ఢు నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ, నీట్​, జేఈఈ కోచింగ్​ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని టీఎన్​ఎస్​ఎఫ్ పేర్కొంది. వాటిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాంట్రగడ్డ ప్రసన్న కోరారు. విద్యను వ్యాపారం చేస్తూ లక్షల్లో ఫీజు దండుకుంటున్నారని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆర్థిక దోపిడికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారంగా కోచింగ్​ల పేరుతో విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇంటర్మీడియట్​ బోర్డు పట్టించుకోక పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ ఈడు పిల్లల్ని స్కూల్​కు రప్పించడమే లక్ష్యంగా - జూన్ 3 నుంచి బడిబాట - BADI BATA IN TELANGANA 2024

ఇంటర్​ విద్యను వ్యాపారంగా మలుచుకుని పుస్తకాలు, స్టేషనరీ, దుస్తుల పేరుతో వేలాది రూపాయలు ప్రైవేట్​ సంస్థలు దోచుకుంటున్నారని ప్రసన్న ఆరోపించారు. ఇప్పిటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్​, కార్పొరేట్​ కళాశాలలపై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

"ఇంటర్మీడియట్​ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకల మీద టీఎన్​ఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో నిరసన చేపట్టాం. అనేక రకాల కోచింగ్​ల పేరుతో దళారి వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షల్లో రూపాయలను దండుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకొనేవారు లేకపోవడం బాధాకరం. జూనియర్ కళాశాల్లో సిబ్బంది పెంచడంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాం." - కాంట్రగడ్డ ప్రసన్న, టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

'విద్యాశాఖ మంత్రిని నియమించి చదువును వ్యాపారం చేస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి' (ETV Bharat)

విదేశాల్లో ఉద్యోగాల కోసం పాట్లు - గణనీయంగా తగ్గిన ఫారెన్​ జాబ్స్​ - Jobs Decreased in Foreign Countries

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.