ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు ఐఎండీ హెచ్చరిక - 4 రోజులపాటు భారీ వర్షాలు - పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - Telangana Weather Report

author img

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 4:52 PM IST

Updated : May 7, 2024, 7:28 PM IST

Telangana Weather Report : రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో వీస్తాయని, ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Telangana Weather Report Today
Telangana Weather Report (ETV Bharat)

Telangana Weather Report Today : రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రాగల నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

సోమవారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి/గాలి విచ్చిన్నతి కొనసాగింది. ఈరోజు సైతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అలాగే పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

IMD Alert on Heavy Rains in Telangana : ఈ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు ఎక్కువగా ఉంటాయని, ఈ సమయంలో ప్రజలు బయటకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది.

ఓ వైపు ఎండలు మండుతుండగా, మరోవైపు అడపాదడపా వానలు కురుస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు పలు జిల్లాల్లో రైతన్నలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. మరోవైపు ఉరుములు మెరుపులతో పిడుగులు పడి, మూగజీవాలు సహా పలువురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఇవీ అత్యధిక ప్రభావిత ప్రాంతాలు : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఏ ప్రాంతంలో పిడుగు పడబోతుందో ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటికీ, పిడుగుపాటు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిడుగుపాటుపై అప్రమత్తం చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ మొబైల్స్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ పంపిస్తున్నా, ఆశించిన ఫలితం ఉండటం లేదు. మృతుల్లో రైతులు, రైతు కూలీలే అధికంగా ఉంటున్నారు. అడవులు, వాటి సమీపంలోని మైదానాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ కావున అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్​లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం - కూలిన చెట్లు, తెగిపడ్డ విద్యుత్ తీగలు - HEAVY RAINs IN HYDERABAD

కరీంనగర్‌లో భారీవర్షాలు, ఈదురు గాలుల బీభత్సం - సీఎం రేవంత్ రెడ్డి సహా బీజేపీ సభలు రద్దు - Stormy Winds in Karimnagar District

Telangana Weather Report Today : రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రాగల నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

సోమవారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి/గాలి విచ్చిన్నతి కొనసాగింది. ఈరోజు సైతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అలాగే పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

IMD Alert on Heavy Rains in Telangana : ఈ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు ఎక్కువగా ఉంటాయని, ఈ సమయంలో ప్రజలు బయటకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది.

ఓ వైపు ఎండలు మండుతుండగా, మరోవైపు అడపాదడపా వానలు కురుస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు పలు జిల్లాల్లో రైతన్నలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. మరోవైపు ఉరుములు మెరుపులతో పిడుగులు పడి, మూగజీవాలు సహా పలువురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఇవీ అత్యధిక ప్రభావిత ప్రాంతాలు : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఏ ప్రాంతంలో పిడుగు పడబోతుందో ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటికీ, పిడుగుపాటు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిడుగుపాటుపై అప్రమత్తం చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ మొబైల్స్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ పంపిస్తున్నా, ఆశించిన ఫలితం ఉండటం లేదు. మృతుల్లో రైతులు, రైతు కూలీలే అధికంగా ఉంటున్నారు. అడవులు, వాటి సమీపంలోని మైదానాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ కావున అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్​లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం - కూలిన చెట్లు, తెగిపడ్డ విద్యుత్ తీగలు - HEAVY RAINs IN HYDERABAD

కరీంనగర్‌లో భారీవర్షాలు, ఈదురు గాలుల బీభత్సం - సీఎం రేవంత్ రెడ్డి సహా బీజేపీ సభలు రద్దు - Stormy Winds in Karimnagar District

Last Updated : May 7, 2024, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.