ETV Bharat / state

ఈ నెల 23 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు - నోటిఫికేషన్ జారీ - TELANGANA ASSEMBLY SESSIONS 2024

Telangana Assembly Sessions From July 23rd : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 23వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు, 24 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 2:29 PM IST

Updated : Jul 18, 2024, 4:05 PM IST

TELANGANA ASSEMBLY SESSIONS
TELANGANA ASSEMBLY SESSIONS (ETV Bharat)

Telangana Assembly Sessions 2024 : రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఈనెల 24 నుంచి శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్​ను గవర్నర్​ జారీ చేశారు. మొదటి రోజున అసెంబ్లీలో కంటోన్మెంట్​ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాపం ఉండనుంది. ఈ నెల 25వ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈనెల 23న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్​లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్లు, ఇతర నిధులను పరిశీలించి బడ్జెట్​కు తుదిరూపం ఇవ్వనున్నారు. ఈనెల 25న అసెంబ్లీ కమిటీ హాల్​లో కేబినెట్​ సమావేశం నిర్వహించి బడ్జెట్​ ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వనుంది. నాలుగు నెలల కోసం ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ ఆమోదించిన రూ.2.75 లక్షల కోట్ల ఓటాన్​ బడ్జెట్​ ఈ నెలాఖరుతో ముగియనుంది. సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్​తో పాటు ధరణి, రైతుభరోసా, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, జాబ్​ క్యాలెండర్​, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వం చిహ్నం తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

వారం క్రితమే సమావేశాల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష : ఈనెల 11వ తేదీన శాసనసభ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​, శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖాధికారులతో అసెంబ్లీ సమావేశాల గురించి సమీక్ష నిర్వహించారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ఈ సమావేశాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టడంతో ఆర్థిక శాఖ అధికారులతో కూడా శాసనసభ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ చర్చించారు. ఇప్పుడు రైతు రుణమాఫీ రూ.30 వేల కోట్లతో ఆగస్టు చివరి నాటికి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలో నేడు రుణమాఫీ నిధులు మొదటి విడతగా రూ.7వేల కోట్లను రూ.1.50 లక్షల కంటే తక్కువ మాఫీ ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

Telangana Assembly Sessions 2024 : రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఈనెల 24 నుంచి శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్​ను గవర్నర్​ జారీ చేశారు. మొదటి రోజున అసెంబ్లీలో కంటోన్మెంట్​ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాపం ఉండనుంది. ఈ నెల 25వ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈనెల 23న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్​లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్లు, ఇతర నిధులను పరిశీలించి బడ్జెట్​కు తుదిరూపం ఇవ్వనున్నారు. ఈనెల 25న అసెంబ్లీ కమిటీ హాల్​లో కేబినెట్​ సమావేశం నిర్వహించి బడ్జెట్​ ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వనుంది. నాలుగు నెలల కోసం ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ ఆమోదించిన రూ.2.75 లక్షల కోట్ల ఓటాన్​ బడ్జెట్​ ఈ నెలాఖరుతో ముగియనుంది. సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్​తో పాటు ధరణి, రైతుభరోసా, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, జాబ్​ క్యాలెండర్​, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వం చిహ్నం తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

వారం క్రితమే సమావేశాల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష : ఈనెల 11వ తేదీన శాసనసభ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​, శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖాధికారులతో అసెంబ్లీ సమావేశాల గురించి సమీక్ష నిర్వహించారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ఈ సమావేశాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టడంతో ఆర్థిక శాఖ అధికారులతో కూడా శాసనసభ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ చర్చించారు. ఇప్పుడు రైతు రుణమాఫీ రూ.30 వేల కోట్లతో ఆగస్టు చివరి నాటికి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలో నేడు రుణమాఫీ నిధులు మొదటి విడతగా రూ.7వేల కోట్లను రూ.1.50 లక్షల కంటే తక్కువ మాఫీ ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

త్వరలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టే అవకాశం - Telangana Assembly Monsoon Sessions

తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుని గడీల ఉండలేదు : సీఎం రేవంత్ రెడ్డి

Last Updated : Jul 18, 2024, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.