ETV Bharat / state

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు - ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్థానికతపై హైకోర్టు తీర్పు - HC on Medical Admissions for local

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 8:03 PM IST

HC On Medical Admissions : రాష్ట్రంలో వైద్య కళాశాలల్లో కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి స్థానికత వివాదంపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. స్థానికంగా నివాసం ఉండే విద్యార్థులు స్థానికులే అని, స్థానికత విషయంలో మార్గనిర్దేశకాలు సరిగా లేవని పేర్కొంది. ఈ మేరకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని, దానికి అనుగుణంగా ప్రవేశాలు కల్పించాలని ఆదేశించింది.

HC on Medical Colleges admissions for Locals
HC On Medical Admissions (ETV Bharat)

HC on Medical Colleges admissions for Locals : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు స్థానికత అంశంపై హైకోర్టు తీర్పు విలువరించింది. స్థానికంగా నివాసం ఉండే విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని, అయితే స్థానికత విషయంలో ప్రభుత్వ మార్గనిర్దేశకాలు సరిగా లేవని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ మార్గ నిర్దేశకాలకనుగుణంగా కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత అంశంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు నీట్ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నీట్ రాసే సమయానికి వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. దీని వల్ల తెలంగాణ విద్యార్థుల్లో కొంతమంది స్థానికేతరులు అవుతున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నీట్​లో సీటు సాధించాలని లక్ష్యంతో కొంత మంది విద్యార్థులు పక్క రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదివారని, పదో తరగతి వరకు రాష్ట్రంలోనే చదివి కేవలం ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రాల్లో చదవడం వల్ల స్థానికేతరులుగా మారుతున్నారని వాదించారు.

ప్రభుత్వ మార్గనిర్దేశకాలు విడుదల తర్వాతే ప్రవేశాలు : తల్లిదండ్రుల ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా కొంతమంది విద్యార్థులు పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ ఇతర రాష్ట్రాల్లో చదవాల్సి వచ్చిందని, అలాంటి విద్యార్థులు కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్థానికేతరులుగా మారాల్సి వస్తుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సీజే ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాన్నే ఇక్కడ జీఓలో పొందుపరిచామని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. పిటిషనర్లలో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఉన్నారని ఏజీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వెలువరించింది. స్థానికత అంశంపై ప్రభుత్వం మార్గనిర్దేశకాలు విడుదల చేసిన తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించాలని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాన్ని ధర్మాసనం ఆదేశించింది.

ఎంబీబీఎస్​, బీడీఎస్​ ప్రవేశాల్లో స్థానికతను పక్కకు పెట్టి ఆన్​లైన్​ దరఖాస్తులు తీసుకోండి : హైకోర్టు - Telangana HC on MBBS Admissions

జీవో 33పై వివరణ ఇవ్వండి - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - TG HC on GO 33 for Medicine Course

HC on Medical Colleges admissions for Locals : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు స్థానికత అంశంపై హైకోర్టు తీర్పు విలువరించింది. స్థానికంగా నివాసం ఉండే విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని, అయితే స్థానికత విషయంలో ప్రభుత్వ మార్గనిర్దేశకాలు సరిగా లేవని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ మార్గ నిర్దేశకాలకనుగుణంగా కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత అంశంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు నీట్ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నీట్ రాసే సమయానికి వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. దీని వల్ల తెలంగాణ విద్యార్థుల్లో కొంతమంది స్థానికేతరులు అవుతున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నీట్​లో సీటు సాధించాలని లక్ష్యంతో కొంత మంది విద్యార్థులు పక్క రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదివారని, పదో తరగతి వరకు రాష్ట్రంలోనే చదివి కేవలం ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రాల్లో చదవడం వల్ల స్థానికేతరులుగా మారుతున్నారని వాదించారు.

ప్రభుత్వ మార్గనిర్దేశకాలు విడుదల తర్వాతే ప్రవేశాలు : తల్లిదండ్రుల ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా కొంతమంది విద్యార్థులు పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ ఇతర రాష్ట్రాల్లో చదవాల్సి వచ్చిందని, అలాంటి విద్యార్థులు కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్థానికేతరులుగా మారాల్సి వస్తుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సీజే ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాన్నే ఇక్కడ జీఓలో పొందుపరిచామని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. పిటిషనర్లలో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఉన్నారని ఏజీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వెలువరించింది. స్థానికత అంశంపై ప్రభుత్వం మార్గనిర్దేశకాలు విడుదల చేసిన తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించాలని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాన్ని ధర్మాసనం ఆదేశించింది.

ఎంబీబీఎస్​, బీడీఎస్​ ప్రవేశాల్లో స్థానికతను పక్కకు పెట్టి ఆన్​లైన్​ దరఖాస్తులు తీసుకోండి : హైకోర్టు - Telangana HC on MBBS Admissions

జీవో 33పై వివరణ ఇవ్వండి - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - TG HC on GO 33 for Medicine Course

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.