ETV Bharat / state

వచ్చే ఏడాది ఆఖరుకు దేవాదుల పూర్తి! - నేడు ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష - Minister Uttam Review On Devadula

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 7:39 AM IST

Telangana Govt to Complete Devadula Soon : దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడంపై, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టులో దాదాపు 91శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2025 డిసెంబర్ నాటికి మిగిలిన పనులు పూర్తి చేసి, 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ దేవాదుల పంప్‌హౌస్ వద్ద నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు.

Minister Uttam Review On Devadula Lift Irrigation Project Today
Telangana Govt to Complete Devadula Soon (ETV Bharat)

Minister Uttam Review On Devadula Lift Irrigation Project Today : ఉమ్మడి వరంగల్ జిల్లాకు జలప్రదాయినిగా భావించే జే-చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కాంగ్రెస్ కలల ప్రాజెక్టుగా భావించే ఈ పథకాన్ని పూర్తి చేయడమే తొలి ప్రాధాన్యంగా తీసుకుంది. 2 దశాబ్దాలుగా పూర్తికాని దేవాదుల ప్రాజెక్టును, వచ్చే ఏడాది చివరి కల్లా ముగించి నీరందించాలని లక్ష్యం పెట్టుకుంది.

ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టు స్థితిగతులను సమీక్షించేందుకు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనకు రానున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడంలోని దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

దేవాదుల ఎత్తిపోతల పూర్తి చేసేలా సర్కార్‌ కసరత్తు : ఉమ్మడి వరంగల్‌ సహా కరీంనగర్‌, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 5 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా, 2004లో అప్పటి కాంగ్రెస్‌ సర్కార్‌ దేవాదులకు శ్రీకారం చుట్టింది. 6,016 కోట్ల రూపాయల అంచనాతో మొదలు పెట్టగా, ఫేజ్‌-2, 3లతో కలిపి రూ.17,500 కోట్లకు అంచనా వ్యయం పెరిగింది. ఇప్పటివరకు రూ.14,188 కోట్లు ఖర్చు కాగా రెండు దశల్లో కలిపి 12 రిజర్వాయర్లు, 11 పంప్‌హౌజ్‌లు నిర్మించారు.

మొత్తం 3లక్షల 17వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుండగా, మూడో దశ పూర్తైతే మరో 2,40,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు రానున్నాయి. మొత్తం 33,224 ఎకరాల భూసేకరణకు నిర్ణయించగా, ఇప్పటికి వరకు 30,268 ఎకరాల భూమిని సేకరించారు. మరో 2,957 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మల్టీస్టోరేజి ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఈ ప్రాజెక్టులో 39.16 టీఎమ్​సీల నీటిని, 170 రోజులపాటు ఎత్తిపోయనున్నారు. ఫేజ్-1, 2, 3 లకు కలిపి మొత్తం 499 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించనున్నారు.

దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న సర్కార్, తొలిసారిగా ప్రాజెక్టు పంప్‌హౌస్ వద్ద ఉన్నతస్థాయి సమీక్ష చేస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలు దేరనున్న మంత్రులు, ములుగు జిల్లా తుపాకుల గూడెం వద్దకు చేరుకుని దేవాదుల పంపింగ్ స్టేషన్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళతారు.

చురుగ్గా శ్రీరాంసాగర్ గేట్ల మరమ్మతు పనులు - వరద రాకముందే పూర్తి చేసేలా అధికారుల ప్రయత్నం - SRSP Gates Repair Actively

కోట్లు ఖర్చు చేసి కూడా కేసీఆర్ అందరికీ నీళ్లివ్వలేదు : భట్టి విక్రమార్క - BHATTI FIRES ON BRS RULING

Minister Uttam Review On Devadula Lift Irrigation Project Today : ఉమ్మడి వరంగల్ జిల్లాకు జలప్రదాయినిగా భావించే జే-చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కాంగ్రెస్ కలల ప్రాజెక్టుగా భావించే ఈ పథకాన్ని పూర్తి చేయడమే తొలి ప్రాధాన్యంగా తీసుకుంది. 2 దశాబ్దాలుగా పూర్తికాని దేవాదుల ప్రాజెక్టును, వచ్చే ఏడాది చివరి కల్లా ముగించి నీరందించాలని లక్ష్యం పెట్టుకుంది.

ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టు స్థితిగతులను సమీక్షించేందుకు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనకు రానున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడంలోని దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

దేవాదుల ఎత్తిపోతల పూర్తి చేసేలా సర్కార్‌ కసరత్తు : ఉమ్మడి వరంగల్‌ సహా కరీంనగర్‌, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 5 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా, 2004లో అప్పటి కాంగ్రెస్‌ సర్కార్‌ దేవాదులకు శ్రీకారం చుట్టింది. 6,016 కోట్ల రూపాయల అంచనాతో మొదలు పెట్టగా, ఫేజ్‌-2, 3లతో కలిపి రూ.17,500 కోట్లకు అంచనా వ్యయం పెరిగింది. ఇప్పటివరకు రూ.14,188 కోట్లు ఖర్చు కాగా రెండు దశల్లో కలిపి 12 రిజర్వాయర్లు, 11 పంప్‌హౌజ్‌లు నిర్మించారు.

మొత్తం 3లక్షల 17వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుండగా, మూడో దశ పూర్తైతే మరో 2,40,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు రానున్నాయి. మొత్తం 33,224 ఎకరాల భూసేకరణకు నిర్ణయించగా, ఇప్పటికి వరకు 30,268 ఎకరాల భూమిని సేకరించారు. మరో 2,957 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మల్టీస్టోరేజి ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఈ ప్రాజెక్టులో 39.16 టీఎమ్​సీల నీటిని, 170 రోజులపాటు ఎత్తిపోయనున్నారు. ఫేజ్-1, 2, 3 లకు కలిపి మొత్తం 499 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించనున్నారు.

దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న సర్కార్, తొలిసారిగా ప్రాజెక్టు పంప్‌హౌస్ వద్ద ఉన్నతస్థాయి సమీక్ష చేస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలు దేరనున్న మంత్రులు, ములుగు జిల్లా తుపాకుల గూడెం వద్దకు చేరుకుని దేవాదుల పంపింగ్ స్టేషన్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళతారు.

చురుగ్గా శ్రీరాంసాగర్ గేట్ల మరమ్మతు పనులు - వరద రాకముందే పూర్తి చేసేలా అధికారుల ప్రయత్నం - SRSP Gates Repair Actively

కోట్లు ఖర్చు చేసి కూడా కేసీఆర్ అందరికీ నీళ్లివ్వలేదు : భట్టి విక్రమార్క - BHATTI FIRES ON BRS RULING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.