ETV Bharat / state

అలాంటి వారు రైతుబంధు డబ్బులు తిరిగి ఇచ్చేయండి - ప్రభుత్వం ఆదేశం - Rythu Bandhu scheme Recovery

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 9:00 PM IST

Rythu Bandhu Scheme : రైతుబంధుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు వెనక్కి తీసుకోనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మేడ్చల్​ జిల్లాలోని ఓ రైతుకు రూ.16 లక్షలు తిరిగి చెల్లించాలని నోటీసులు పంపింది.

Rythu Bandhu Scheme
Rythu Bandhu Scheme (ETV Bharat)

Rythu Bandhu scheme Recovery in Telangana : గతంలో ఇచ్చిన రైతుబంధుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​ మండలం పోచారం రైతు యాదగిరిరెడ్డికి నోటీసులు పంపించింది. వెంచర్లపై ఇచ్చిన రైతుబంధు సొమ్ము రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధుగా తీసుకున్న రూ.16 లక్షలు తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. గతంలో 33 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి రైతు యాదగిరిరెడ్డి అమ్మేశారు. రైతుబంధు కింద 33 ఎకరాల ప్లాట్ల భూమిపై యాదగిరిరెడ్డికి రూ.16 లక్షల రైతుబంధును ప్రభుత్వం చెల్లించింది.

Rythu Bandhu scheme Recovery in Telangana : గతంలో ఇచ్చిన రైతుబంధుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​ మండలం పోచారం రైతు యాదగిరిరెడ్డికి నోటీసులు పంపించింది. వెంచర్లపై ఇచ్చిన రైతుబంధు సొమ్ము రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధుగా తీసుకున్న రూ.16 లక్షలు తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. గతంలో 33 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి రైతు యాదగిరిరెడ్డి అమ్మేశారు. రైతుబంధు కింద 33 ఎకరాల ప్లాట్ల భూమిపై యాదగిరిరెడ్డికి రూ.16 లక్షల రైతుబంధును ప్రభుత్వం చెల్లించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.