ETV Bharat / state

హైడ్రా విధివిధానాలు ఖరారు - ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు - HYDRA for Disaster Management

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 9:08 PM IST

Updated : Jul 19, 2024, 10:18 PM IST

HYDRA for Disaster Management in Hyderabad : రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ ఆస్తులు, విలువైన స్థలాలతో పాటు విపత్తు సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం హైడ్రా పేరుతో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఛైర్మన్​గా, మంత్రులు సభ్యులుగా ఉండనున్న హైడ్రా ఏర్పాటుపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైడ్రా విధి విధానాలు, పరిధిని నిర్దేశిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది.

Occupancy of places in Hyderabad
HYDRA for Disaster Management in Hyderabad (ETV Bharat)

HYDRA Procedures in Hyderabad : రాజధాని ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో స్వతంత్ర వ్యవస్థకు రూపకల్పన చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థ నిర్మాణం, బాధ్యతలు, విధి విధానాలతో కూడిన జీవో 99ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విడుదల చేశారు.

హైదరాబాద్​కు రక్షణ కవచంగా హైడ్రా : జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోని 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పని చేయనుంది. జాతీయ సగటు కన్నా అధికంగా తెలంగాణలో ఏటా 3.2 శాతం మేర పట్టణ జనాభా పెరుగుతోంది. అందులో హైదరాబాద్ వాటా అధికంగా ఉన్న నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్​కు రక్షణ కవచంగా ఉండాలనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఒకే వేదిక ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ర్యాంకులోని ఐపీఎస్ అధికారి రంగనాథ్​ను జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం డైరెక్టర్​గా నియమించింది. ఇప్పుడు హైడ్రాకు ఆయనే కమిషనర్​గా విధులు నిర్వర్తించనున్నారు. అలాగే జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ విభాగాలు బల్దియాలో గతంలో మాదిరిగానే కొనసాగనున్నాయి.

రక్షణ చర్యలు చేపటడ్డం హైడ్రా బాధ్యత : జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు విపత్తుల రక్షణ కల్పించే విషయమై సమగ్ర ప్రణాళికను హైడ్రా రూపొందించాలి. రాష్ట్ర, ఇతర రాష్ట్రాలు, జాతీయ స్థాయి విపత్తు స్పందన బృందాలు, వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ వాతావరణ సమాచారాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపటడ్డం హైడ్రా బాధ్యత. అలాగే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల పరిధిలోని పార్కులు, లేఅవుట్​లు ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల ఆక్రమణలపై ఫిర్యాదులను స్వీకరిస్తూ విచారణ చేపట్టడం, ఆక్రమణలను అడ్డుకోవడం, చెరువులను కబ్జాల నుంచి రక్షించడం వంటి బాధ్యతలను హైడ్రా చేయాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీసు కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు హైడ్రాకు సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘన, శిథిల భవనాలు, పౌరుల భద్రతకు సంబంధించిన పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్తులను పరిశీలించే అధికారం ఈ విభాగానికి ఉంటుంది. అలాగే నియమ నిబంధనల ప్రకారం అనధికార ప్రకటనలు, అక్రమ నిర్మాణాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు.

హైడ్రాకు నిధుల కేటాయింపు : సంస్థ నిర్మాణానికి ఎంత మంది సిబ్బంది, ఏయే హోదాల్లో ఏ మేరకు అవసరం, వారికి శిక్షణ ఇవ్వడం, కావల్సిన వాహనాలు, సామాగ్రి, నిధులు, భవనాలు, వాటి నిర్వహణ వంటి అంశాలతో కమిషనర్ సమగ్ర ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని సూచించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర స్థానిక సంస్థల నుంచి హైడ్రాకు నిధుల కేటాయింపు ఉంటుంది.

అలాగే అగ్నిమాపక చట్టం 1999 ప్రకారం ఆ శాఖ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో అగ్నిమాపక ఎన్ వోసీలు జారీ చేసే విషయమై హైడ్రా భవనాల్లో తనిఖీలు చేపట్టే అధికారాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవడం, వాహన రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం, రోడ్లపై గుంతలు, ముప్పు పొంచి ఉన్న మార్గాలు, వరద ముంపును గురయ్యే కాలనీలను గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో హైడ్రా చర్యలు చేపడుతుంది.

హైడ్రా రూపకల్పనలో కమిటీలు : హైడ్రా రూపకల్పనలో ప్రభుత్వం రెండు కమిటీలను కూడా నియమించింది. ముఖ్యమంత్రి ఛైర్మన్ గా, పురపాలక, రెవెన్యూ శాఖల మంత్రులు, జిల్లాల ఇంఛార్జీ మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రెవెన్యూ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం అధిపతి సభ్యులుగా ప్రధానమైన గవర్నింగ్ బాడీ పనిచేయనుంది.

విధానపరమైన నిర్ణయాలపై ఈ కమిటీ మార్గనిర్దేశంతో పాటు సమీక్షలు చేయనుంది. అలాగే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్​గా ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులు సభ్యులగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ ఉప కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీల్లోనూ హైడ్రా కమిషనర్ మెంబర్ కన్వీనర్​గా ఉంటూ హైడ్రాను ముందుకు తీసుకెళ్లనున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి నయా అస్త్రం 'హైడ్రా' - దీని గురించి మీకు తెలుసా? - HYDRA for Disaster Management

బలమైన వ్యవస్థగా 'హైడ్రా' ఉండాలి - అందుకు నిధులు కేటాయింపు? - రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth on HYDRA Procedures

HYDRA Procedures in Hyderabad : రాజధాని ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో స్వతంత్ర వ్యవస్థకు రూపకల్పన చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థ నిర్మాణం, బాధ్యతలు, విధి విధానాలతో కూడిన జీవో 99ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విడుదల చేశారు.

హైదరాబాద్​కు రక్షణ కవచంగా హైడ్రా : జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోని 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పని చేయనుంది. జాతీయ సగటు కన్నా అధికంగా తెలంగాణలో ఏటా 3.2 శాతం మేర పట్టణ జనాభా పెరుగుతోంది. అందులో హైదరాబాద్ వాటా అధికంగా ఉన్న నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్​కు రక్షణ కవచంగా ఉండాలనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఒకే వేదిక ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ర్యాంకులోని ఐపీఎస్ అధికారి రంగనాథ్​ను జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం డైరెక్టర్​గా నియమించింది. ఇప్పుడు హైడ్రాకు ఆయనే కమిషనర్​గా విధులు నిర్వర్తించనున్నారు. అలాగే జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ విభాగాలు బల్దియాలో గతంలో మాదిరిగానే కొనసాగనున్నాయి.

రక్షణ చర్యలు చేపటడ్డం హైడ్రా బాధ్యత : జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు విపత్తుల రక్షణ కల్పించే విషయమై సమగ్ర ప్రణాళికను హైడ్రా రూపొందించాలి. రాష్ట్ర, ఇతర రాష్ట్రాలు, జాతీయ స్థాయి విపత్తు స్పందన బృందాలు, వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ వాతావరణ సమాచారాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపటడ్డం హైడ్రా బాధ్యత. అలాగే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల పరిధిలోని పార్కులు, లేఅవుట్​లు ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల ఆక్రమణలపై ఫిర్యాదులను స్వీకరిస్తూ విచారణ చేపట్టడం, ఆక్రమణలను అడ్డుకోవడం, చెరువులను కబ్జాల నుంచి రక్షించడం వంటి బాధ్యతలను హైడ్రా చేయాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీసు కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు హైడ్రాకు సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘన, శిథిల భవనాలు, పౌరుల భద్రతకు సంబంధించిన పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్తులను పరిశీలించే అధికారం ఈ విభాగానికి ఉంటుంది. అలాగే నియమ నిబంధనల ప్రకారం అనధికార ప్రకటనలు, అక్రమ నిర్మాణాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు.

హైడ్రాకు నిధుల కేటాయింపు : సంస్థ నిర్మాణానికి ఎంత మంది సిబ్బంది, ఏయే హోదాల్లో ఏ మేరకు అవసరం, వారికి శిక్షణ ఇవ్వడం, కావల్సిన వాహనాలు, సామాగ్రి, నిధులు, భవనాలు, వాటి నిర్వహణ వంటి అంశాలతో కమిషనర్ సమగ్ర ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని సూచించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర స్థానిక సంస్థల నుంచి హైడ్రాకు నిధుల కేటాయింపు ఉంటుంది.

అలాగే అగ్నిమాపక చట్టం 1999 ప్రకారం ఆ శాఖ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో అగ్నిమాపక ఎన్ వోసీలు జారీ చేసే విషయమై హైడ్రా భవనాల్లో తనిఖీలు చేపట్టే అధికారాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవడం, వాహన రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం, రోడ్లపై గుంతలు, ముప్పు పొంచి ఉన్న మార్గాలు, వరద ముంపును గురయ్యే కాలనీలను గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో హైడ్రా చర్యలు చేపడుతుంది.

హైడ్రా రూపకల్పనలో కమిటీలు : హైడ్రా రూపకల్పనలో ప్రభుత్వం రెండు కమిటీలను కూడా నియమించింది. ముఖ్యమంత్రి ఛైర్మన్ గా, పురపాలక, రెవెన్యూ శాఖల మంత్రులు, జిల్లాల ఇంఛార్జీ మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రెవెన్యూ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం అధిపతి సభ్యులుగా ప్రధానమైన గవర్నింగ్ బాడీ పనిచేయనుంది.

విధానపరమైన నిర్ణయాలపై ఈ కమిటీ మార్గనిర్దేశంతో పాటు సమీక్షలు చేయనుంది. అలాగే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్​గా ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులు సభ్యులగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ ఉప కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీల్లోనూ హైడ్రా కమిషనర్ మెంబర్ కన్వీనర్​గా ఉంటూ హైడ్రాను ముందుకు తీసుకెళ్లనున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి నయా అస్త్రం 'హైడ్రా' - దీని గురించి మీకు తెలుసా? - HYDRA for Disaster Management

బలమైన వ్యవస్థగా 'హైడ్రా' ఉండాలి - అందుకు నిధులు కేటాయింపు? - రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth on HYDRA Procedures

Last Updated : Jul 19, 2024, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.