ETV Bharat / state

ప్రత్తిపాటి శరత్​ అరెస్ట్ అక్రమం - ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య: టీడీపీ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 8:01 AM IST

TDP Leaders Condemn Prathipati Sarath Arrest : జీఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్​ను అరెస్ట్ చేశారు. శరత్​ అరెస్ట్‌ను టీడీపీ నేతలు ఖండించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Prathipati Sarath Arrest
Prathipati Sarath Arrest

TDP Leaders Condemn Prathipati Sarath Arrest : జీఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్​ను (Prathipati Sarath) అరెస్ట్ చేశారు. శరత్‌ను టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఆయనపై జీఎస్టీ విభాగం మనీలాండరింగ్‌, పన్ను ఎగవేత అభియోగాలు మోపింది. ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120 బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద మాచవరం పీఎస్‌లో కేసు నమోదయింది. ప్రత్తిపాటి కుమారుడు, భార్య, బావమరిది సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ కార్యకర్తలు సీపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్ధృతంగా మారింది.

అమరావతిని విచ్ఛిన్నం చేసేలా వైఎస్ఆర్సీపీ కుట్రలు- భూసేకరణ ప్రకటన ఉపసంహరణకు కసరత్తు

Chandrababu on Prathipati Sarath Arrest : మాజీ మంత్రి ప్రత్తారాటి పుల్లారావు కుమారుడు శరత్‌ది అక్రమ అరెస్ట్ అని, ముమ్మాటికి ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని ఎక్స్‌ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ఆరోపించారు. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగమే శరత్‌ అరెస్ట్ అని, ఆయనను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ అఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమ పార్టీ నాయకులను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్లే, ఇప్పుడు ఏపీఎస్ఆర్​డీఐ ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోందని దుయ్యబట్టారు. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలని విమర్శించారు. ఏపీఎస్ఆర్​డీఐ బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 40 రోజుల్లో ఇంటికి పోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యులుగా పని చేస్తే, అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

Nara Lokesh Condemn Prathipati Sarath Arrest : శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా, సైకో జ‌గ‌న్ తాడేప‌ల్లి ముఠానా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)ప్రశ్నించారు. టెర్ర‌రిస్టుని అరెస్ట్ చేసిన‌ట్టు ఎందుకు ర‌హ‌స్యంగా ఉంచుతున్నారని నిలదీశారు. శ‌ర‌త్‌కి ఏమైనా హాని త‌ల‌పెట్టారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్ర‌త్తిపాటి పుల్లారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుందని నారా లోకేశ్ వివరించారు.

ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని, బ‌ల‌మైన టీడీపీ నేత‌లే ల‌క్ష్యంగా సైకో జ‌గ‌న్ ప‌న్నుతున్న కుతంత్రాల‌ను తిప్పికొడ‌తామని నారా లోకేశ్ తెలిపారు. ఆయనను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని డిమాండ్ చేశారు. త‌ప్పుడు కేసులు, అక్ర‌మ అరెస్టులపై న్యాయ‌పోరాటం చేస్తామని తెలిపారు. జ‌గ‌న్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్ట‌లు ఆప‌క‌పోతే, చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుందని నారా లోకేశ్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమరానికి సై - టీడీపీ, జనసేన 'జెండా' సభకు సర్వం సిద్ధం

పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేస్తున్నారు : ప్రత్తిపాటి శరత్ అరెస్ట్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేని ఆయన అకారణంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ అండతో పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్న జగన్ సర్కార్‌కు మరో 45 రోజుల్లో రాజకీయ సమాధి కట్టడం ఖాయమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

జగన్​కు భయం‌ పట్టుకుంది : పత్తిపాటి పుల్లారావు (Prathipati Pullarao Son Arrest) కుమారుడు శరత్ అక్రమ అరెస్ట్‌పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే ముఖ్యమంత్రి లక్ష్యమని మండిపడ్డారు. తండ్రిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేని జగన్, కుమారుడి మీద కేసు పెట్టించారని విమర్శించారు. జగన్​కు భయం‌ పట్టుకుందని ఇంతకంటే ఉదాహరణ లేదని పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్

టీడీపీ-జనసేన విన్నింగ్‌ టీమ్‌ - వైఎస్సార్సీపీ చీటింగ్‌ టీమ్‌ : చంద్రబాబు

TDP Leaders Condemn Prathipati Sarath Arrest : జీఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్​ను (Prathipati Sarath) అరెస్ట్ చేశారు. శరత్‌ను టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఆయనపై జీఎస్టీ విభాగం మనీలాండరింగ్‌, పన్ను ఎగవేత అభియోగాలు మోపింది. ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120 బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద మాచవరం పీఎస్‌లో కేసు నమోదయింది. ప్రత్తిపాటి కుమారుడు, భార్య, బావమరిది సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ కార్యకర్తలు సీపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్ధృతంగా మారింది.

అమరావతిని విచ్ఛిన్నం చేసేలా వైఎస్ఆర్సీపీ కుట్రలు- భూసేకరణ ప్రకటన ఉపసంహరణకు కసరత్తు

Chandrababu on Prathipati Sarath Arrest : మాజీ మంత్రి ప్రత్తారాటి పుల్లారావు కుమారుడు శరత్‌ది అక్రమ అరెస్ట్ అని, ముమ్మాటికి ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని ఎక్స్‌ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ఆరోపించారు. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగమే శరత్‌ అరెస్ట్ అని, ఆయనను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ అఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమ పార్టీ నాయకులను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్లే, ఇప్పుడు ఏపీఎస్ఆర్​డీఐ ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోందని దుయ్యబట్టారు. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలని విమర్శించారు. ఏపీఎస్ఆర్​డీఐ బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 40 రోజుల్లో ఇంటికి పోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యులుగా పని చేస్తే, అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

Nara Lokesh Condemn Prathipati Sarath Arrest : శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా, సైకో జ‌గ‌న్ తాడేప‌ల్లి ముఠానా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)ప్రశ్నించారు. టెర్ర‌రిస్టుని అరెస్ట్ చేసిన‌ట్టు ఎందుకు ర‌హ‌స్యంగా ఉంచుతున్నారని నిలదీశారు. శ‌ర‌త్‌కి ఏమైనా హాని త‌ల‌పెట్టారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్ర‌త్తిపాటి పుల్లారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుందని నారా లోకేశ్ వివరించారు.

ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని, బ‌ల‌మైన టీడీపీ నేత‌లే ల‌క్ష్యంగా సైకో జ‌గ‌న్ ప‌న్నుతున్న కుతంత్రాల‌ను తిప్పికొడ‌తామని నారా లోకేశ్ తెలిపారు. ఆయనను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని డిమాండ్ చేశారు. త‌ప్పుడు కేసులు, అక్ర‌మ అరెస్టులపై న్యాయ‌పోరాటం చేస్తామని తెలిపారు. జ‌గ‌న్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్ట‌లు ఆప‌క‌పోతే, చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుందని నారా లోకేశ్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమరానికి సై - టీడీపీ, జనసేన 'జెండా' సభకు సర్వం సిద్ధం

పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేస్తున్నారు : ప్రత్తిపాటి శరత్ అరెస్ట్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేని ఆయన అకారణంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ అండతో పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్న జగన్ సర్కార్‌కు మరో 45 రోజుల్లో రాజకీయ సమాధి కట్టడం ఖాయమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

జగన్​కు భయం‌ పట్టుకుంది : పత్తిపాటి పుల్లారావు (Prathipati Pullarao Son Arrest) కుమారుడు శరత్ అక్రమ అరెస్ట్‌పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే ముఖ్యమంత్రి లక్ష్యమని మండిపడ్డారు. తండ్రిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేని జగన్, కుమారుడి మీద కేసు పెట్టించారని విమర్శించారు. జగన్​కు భయం‌ పట్టుకుందని ఇంతకంటే ఉదాహరణ లేదని పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్

టీడీపీ-జనసేన విన్నింగ్‌ టీమ్‌ - వైఎస్సార్సీపీ చీటింగ్‌ టీమ్‌ : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.