ETV Bharat / state

రాష్ట్ర సొంతపన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి - గతేడాదితో పోలిస్తే రూ.1700 కోట్లు అదనం - Tax Revenue to State Exchequer

author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 7:50 PM IST

Telangana State Income Significant Growth : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో రాష్ట్ర ఖజానాకు పన్ను ఆదాయం రూ.11 వేల కోట్లకుపైగా సమకూరింది. నిరుడు ఏప్రిల్‌తో పోలిస్తే, రూ.1,700 కోట్ల వరకు పెరుగుదల ఉంది. జీఎస్టీ ద్వారా అత్యధికంగా 4,475 కోట్లు రాగా, అమ్మకం పన్ను రూపంలో రూ.2,661 కోట్లు ఖజానాకు చేరాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఏప్రిల్ నెలలో రూ.2,246 కోట్ల రూపాయల అప్పు తీసుకున్న సర్కార్, 13వేల కోట్లకుపైగా వ్యయం చేసింది. మొదటి నెలలో నికరలోటు రూ.381 కోట్లు, ద్రవ్యలోటు రూ.2,246 కోట్లుగా నమోదైంది.

Telangana State Income Increase
Tax Revenue to Telangana State Exchequer (ETV Bharat)
సొంతపన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి - నిరుడుతో పోలిస్తే రూ.1700 కోట్లు అదనం (ETV Bharat)

Tax Revenue to Telangana State Exchequer : 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్‌లో, రాష్ట్ర ఖజానాకు రూ.11,818 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో పన్నుల ద్వారా వచ్చిన మొత్తం రూ.11,464 కోట్ల రూపాయలు, కాగా పన్నేతర ఆదాయం రూ.354 కోట్లుగా ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదాయ, వ్యయ వివరాలు సమర్పించింది.

జీఎస్టీ ద్వారా అత్యధిక వసూళ్లు : గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో పన్నుల ద్వారా రాష్ట్రానికి రూ.9,698 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే, ఈ ఏడాది మొదటి నెలలో పన్ను ఆదాయం నిరుడితో పోలిస్తే రూ. 1,766 కోట్లు పెరిగింది. అత్యధికంగా జీఎస్టీ ద్వారా రూ. 4,475 కోట్లు రాగా, అమ్మకం పన్ను రూపంలో రూ. 2,661 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.1,580 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,116 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.908 కోట్లు ఖజానాకు చేరాయి.

ఇతర పన్నుల రూపంలో మరో రూ.721 కోట్లు వచ్చాయి. ఏప్రిల్ నెలలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా నిధులు సమకూరలేదు. ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా 2,246 కోట్ల రూపాయలు సమకూర్చుకొంది. అన్ని రకాలుగా ఖజానాకు 14,068 కోట్ల రూపాయలు రాగా, అందులో ప్రభుత్వం రూ.13,918 కోట్లు ఖర్చు చేసింది. ఏప్రిల్ నెలలో వడ్డీల చెల్లింపుల కోసం రూ.1,865 కోట్లు, వేతనాల కోసం రూ.3,847 కోట్లు వ్యయం చేసింది.

Telangana Revenue 2024 : పెన్షన్లపై రూ.1,331 కోట్లు, రాయితీలపై రూ. 976 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. మూలధనం కింద 3,119 కోట్ల రూపాయలను ప్రభుత్వం వ్యయం చేసింది. రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై రూ.4,697 కోట్లు, సామాజిక రంగంపై రూ.4,677 కోట్లు, ఆర్థిక రంగంపై 4,553 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో ప్రాథమిక లోటు 381 కోట్లు కాగా, ద్రవ్యలోటు 2,246 కోట్ల రూపాయలు నమోదైంది. రెవెన్యూ మిగులు మాత్రం 1,020 కోట్ల రూపాయలుగా చూపారు.

అప్పుల్లో మరింత దూకుడు - జనవరి నెలాఖరుకు నమోదైన రాష్ట్ర ఆదాయ, అప్పుల పూర్తి వివరాలివే

భూముల మార్కెట్ విలువలు సవరించండి - అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం - Revanth Review on Income Sources

సొంతపన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి - నిరుడుతో పోలిస్తే రూ.1700 కోట్లు అదనం (ETV Bharat)

Tax Revenue to Telangana State Exchequer : 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్‌లో, రాష్ట్ర ఖజానాకు రూ.11,818 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో పన్నుల ద్వారా వచ్చిన మొత్తం రూ.11,464 కోట్ల రూపాయలు, కాగా పన్నేతర ఆదాయం రూ.354 కోట్లుగా ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదాయ, వ్యయ వివరాలు సమర్పించింది.

జీఎస్టీ ద్వారా అత్యధిక వసూళ్లు : గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో పన్నుల ద్వారా రాష్ట్రానికి రూ.9,698 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే, ఈ ఏడాది మొదటి నెలలో పన్ను ఆదాయం నిరుడితో పోలిస్తే రూ. 1,766 కోట్లు పెరిగింది. అత్యధికంగా జీఎస్టీ ద్వారా రూ. 4,475 కోట్లు రాగా, అమ్మకం పన్ను రూపంలో రూ. 2,661 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.1,580 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,116 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.908 కోట్లు ఖజానాకు చేరాయి.

ఇతర పన్నుల రూపంలో మరో రూ.721 కోట్లు వచ్చాయి. ఏప్రిల్ నెలలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా నిధులు సమకూరలేదు. ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా 2,246 కోట్ల రూపాయలు సమకూర్చుకొంది. అన్ని రకాలుగా ఖజానాకు 14,068 కోట్ల రూపాయలు రాగా, అందులో ప్రభుత్వం రూ.13,918 కోట్లు ఖర్చు చేసింది. ఏప్రిల్ నెలలో వడ్డీల చెల్లింపుల కోసం రూ.1,865 కోట్లు, వేతనాల కోసం రూ.3,847 కోట్లు వ్యయం చేసింది.

Telangana Revenue 2024 : పెన్షన్లపై రూ.1,331 కోట్లు, రాయితీలపై రూ. 976 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. మూలధనం కింద 3,119 కోట్ల రూపాయలను ప్రభుత్వం వ్యయం చేసింది. రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై రూ.4,697 కోట్లు, సామాజిక రంగంపై రూ.4,677 కోట్లు, ఆర్థిక రంగంపై 4,553 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో ప్రాథమిక లోటు 381 కోట్లు కాగా, ద్రవ్యలోటు 2,246 కోట్ల రూపాయలు నమోదైంది. రెవెన్యూ మిగులు మాత్రం 1,020 కోట్ల రూపాయలుగా చూపారు.

అప్పుల్లో మరింత దూకుడు - జనవరి నెలాఖరుకు నమోదైన రాష్ట్ర ఆదాయ, అప్పుల పూర్తి వివరాలివే

భూముల మార్కెట్ విలువలు సవరించండి - అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం - Revanth Review on Income Sources

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.