ETV Bharat / state

హైదరాబాద్​ రోడ్లపై ప్రయాణం అంటేనే హడలిపోతున్న ప్రజలు - ఎందుకో తెలుసా? - Road Accidents In Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 7:45 AM IST

Road Accidents In Hyderabad : హైదరాబాద్ రోడ్లపై ప్రయాణం అంటేనే అటు వాహనదారులకు ఇటు పాదచారులకు దడ పుడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో వాహనాలను యథేచ్ఛగా నడుపుతున్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు ఉల్లంఘనలపై చలనాలు వేసేందుకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులకు మెమోలు జారీ చేసినా దారికి రావట్లేదంటూ ఓ పోలీస్‌ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Road Accidents In Hyderabad
Road Accidents In Hyderabad (ETV Bharat)

Road Accidents In Hyderabad : హైదరాబాద్‌లో రోడ్లు ప్రమాదాల కారణంగా రక్తమోడుతున్నాయి. ఇటీవల మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. తాజాగా హబ్సిగూడలో ఆగివున్న ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందడం నగరాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. ఈ ప్రమాదాలకు వాహనాల అతివేగమే కారణమని పోలీసులు నిర్థారించారు. పోలీసులు నిర్వహించిన తనిఖీలలో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలు, బస్సు డ్రైవర్లలో కొందరికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని గుర్తించగా మరికొందరు ఉదయాన్నే మద్యం తాగి బస్సు నడిపినట్లు తేల్చారు.

పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 3 గంటల్లో 350 మందికి పైగా అపసవ్యదశలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు పట్టుబడ్డారు. నగరవ్యాప్తంగా సుమారు 60 ప్రాంతాల్లో వాహనదారులు అపసవ్యదిశలో ప్రయాణం సాగిస్తున్నట్లు పోలీసులు నివేదిక రూపొందించారు. అయితే నగరంలో ఈ ఏడాది 7 నెలల వ్యవధిలో సుమారు 200కు పైగా రహదారి ప్రమాదాలు జరిగాయి. వీటిలో సుమారు 25 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది.

తరచూ జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్య : జనాభాతో పోటీపడుతూ పెరుగుతున్న వాహనాలతో తరచూ ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది. మారిన అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమించేందుకు హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఉన్న 18 ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లను 31కి పెంచారు. రెండు జోన్లను మూడు జోన్లు చేశారు. ముగ్గురు ట్రాఫిక్‌ డీసీపీలు, 11 మంది ఏసీపీలు, 1800 మందికి పైగా సిబ్బందిని కేటాయించారు.

ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమించాలనే లక్ష్యంతో ఠాణాలు పెంచినా పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది. ప్రముఖుల పర్యటనల సమయంలో మాత్రమే అధికశాతం ట్రాఫిక్‌ పోలీసు అధికారులు రోడ్లపై కనిపిస్తున్నారనే విమర్శలున్నాయి. నగర సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పలుమార్లు విజిబుల్‌ పోలీసింగ్‌ అమలు చేయమని ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదంటూ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారొకరు ఆవేదన వ్యక్తం చేశారు.

DGP Orders To Officials On Traffic Problem : ట్రాఫిక్‌ వ్యవస్థను గాడిన పెట్టేందుకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని డీజీపీ జితేందర్‌ స్పష్టంచేశారు. ఈ-చలానాల నిధుల నుంచి జిల్లాలకు అవసరమైన ట్రాఫిక్‌ పరికరాలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ నిర్వహణలో ఎదురవుతున్న వాహనరద్దీ, రహదారి భద్రత, నిబంధనల ఉల్లంఘన వంటి సవాళ్లను ట్రాఫిక్‌ క్రమశిక్షణతో అధిగమించవచ్చన్నారు.

గ్రేటర్‌తోపాటు జిల్లాసాయిలో అనుసరించాల్సిన పద్దతులపై దిశానిర్దేశం చేశారు. నగరంలో జరిగే ప్రధాన కార్యక్రమాలు, రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు డ్రోన్లు వినియోగించాలన్నారు. ట్రాఫిక్‌ కూడళ్లలో సిగ్నల్‌ సైకిల్‌ అప్టిమైజేషన్, సైకిల్‌ సమయాన్ని 3 నిమిషాలు మించనీయవద్దన్నారు. వాహనరద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్లమీదనే ఉంటూ పర్యవేక్షణ చేయాలన్నారు. ట్రాఫిక్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు, బలోపేతం చేయాలన్నారు. వర్షాకాలం 4 నెలలు ప్రయాణం సాఫీగా సాగేలా జీహెచ్​ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ సూచించారు.

సీట్​బెల్ట్, హెల్మెట్​లే శ్రీరామరక్ష - అది పాటించకుంటే తప్పదు జీవిత శిక్ష!

రేస్‌ ట్రాకుల్లా హైదరాబాద్‌ రహదారులు - మితిమీరిన వేగంతో ప్రాణాలు తీస్తున్న మందుబాబులు - Hyderabad Road Accidents

Road Accidents In Hyderabad : హైదరాబాద్‌లో రోడ్లు ప్రమాదాల కారణంగా రక్తమోడుతున్నాయి. ఇటీవల మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. తాజాగా హబ్సిగూడలో ఆగివున్న ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందడం నగరాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. ఈ ప్రమాదాలకు వాహనాల అతివేగమే కారణమని పోలీసులు నిర్థారించారు. పోలీసులు నిర్వహించిన తనిఖీలలో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలు, బస్సు డ్రైవర్లలో కొందరికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని గుర్తించగా మరికొందరు ఉదయాన్నే మద్యం తాగి బస్సు నడిపినట్లు తేల్చారు.

పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 3 గంటల్లో 350 మందికి పైగా అపసవ్యదశలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు పట్టుబడ్డారు. నగరవ్యాప్తంగా సుమారు 60 ప్రాంతాల్లో వాహనదారులు అపసవ్యదిశలో ప్రయాణం సాగిస్తున్నట్లు పోలీసులు నివేదిక రూపొందించారు. అయితే నగరంలో ఈ ఏడాది 7 నెలల వ్యవధిలో సుమారు 200కు పైగా రహదారి ప్రమాదాలు జరిగాయి. వీటిలో సుమారు 25 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది.

తరచూ జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్య : జనాభాతో పోటీపడుతూ పెరుగుతున్న వాహనాలతో తరచూ ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది. మారిన అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమించేందుకు హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఉన్న 18 ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లను 31కి పెంచారు. రెండు జోన్లను మూడు జోన్లు చేశారు. ముగ్గురు ట్రాఫిక్‌ డీసీపీలు, 11 మంది ఏసీపీలు, 1800 మందికి పైగా సిబ్బందిని కేటాయించారు.

ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమించాలనే లక్ష్యంతో ఠాణాలు పెంచినా పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది. ప్రముఖుల పర్యటనల సమయంలో మాత్రమే అధికశాతం ట్రాఫిక్‌ పోలీసు అధికారులు రోడ్లపై కనిపిస్తున్నారనే విమర్శలున్నాయి. నగర సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పలుమార్లు విజిబుల్‌ పోలీసింగ్‌ అమలు చేయమని ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదంటూ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారొకరు ఆవేదన వ్యక్తం చేశారు.

DGP Orders To Officials On Traffic Problem : ట్రాఫిక్‌ వ్యవస్థను గాడిన పెట్టేందుకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని డీజీపీ జితేందర్‌ స్పష్టంచేశారు. ఈ-చలానాల నిధుల నుంచి జిల్లాలకు అవసరమైన ట్రాఫిక్‌ పరికరాలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ నిర్వహణలో ఎదురవుతున్న వాహనరద్దీ, రహదారి భద్రత, నిబంధనల ఉల్లంఘన వంటి సవాళ్లను ట్రాఫిక్‌ క్రమశిక్షణతో అధిగమించవచ్చన్నారు.

గ్రేటర్‌తోపాటు జిల్లాసాయిలో అనుసరించాల్సిన పద్దతులపై దిశానిర్దేశం చేశారు. నగరంలో జరిగే ప్రధాన కార్యక్రమాలు, రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు డ్రోన్లు వినియోగించాలన్నారు. ట్రాఫిక్‌ కూడళ్లలో సిగ్నల్‌ సైకిల్‌ అప్టిమైజేషన్, సైకిల్‌ సమయాన్ని 3 నిమిషాలు మించనీయవద్దన్నారు. వాహనరద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్లమీదనే ఉంటూ పర్యవేక్షణ చేయాలన్నారు. ట్రాఫిక్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు, బలోపేతం చేయాలన్నారు. వర్షాకాలం 4 నెలలు ప్రయాణం సాఫీగా సాగేలా జీహెచ్​ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ సూచించారు.

సీట్​బెల్ట్, హెల్మెట్​లే శ్రీరామరక్ష - అది పాటించకుంటే తప్పదు జీవిత శిక్ష!

రేస్‌ ట్రాకుల్లా హైదరాబాద్‌ రహదారులు - మితిమీరిన వేగంతో ప్రాణాలు తీస్తున్న మందుబాబులు - Hyderabad Road Accidents

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.