ETV Bharat / state

'కేంద్ర సర్కార్​ పన్ను విధానంతో రాష్ట్రాల ఆదాయానికి గండి - సర్‌ ఛార్జీలు, సెస్‌లు 10 శాతానికి మించకూడదు' - Union Budget Preparatory Meeting

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 10:09 PM IST

Updated : Jun 22, 2024, 10:25 PM IST

State Finance Minister Bhatti Attend in Union Budget Preparatory Meeting : కేంద్రప్రభుత్వం సెస్‌ సర్‌ఛార్జీల రూపంలో పన్నులు సేకరించడం వల్ల, రాష్ట్రాలు నష్టపోతున్నాయని కేంద్ర బడ్జెట్​ సన్నాహక సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్​ విధించే సర్‌ఛార్జీలు, సెస్‌లను పదిశాతం మించకుండా చూడాలని కోరానన్నారు. బడ్జెట్‌ ప్రవేశంపెట్టేందుకు నికర రుణపరిమితి ముందే ప్రకటించాలని కోరినట్లు మీడియా వేదికగా వివరించారు.

Deputy CM Bhatti Vikramarka Attend in GST Council Meeting
State Finance Minister Bhatti Attend in Union Budget Preparatory Meeting (ETV Bharat)

Deputy CM Bhatti Vikramarka Attend in GST Council Meeting : కేంద్ర ప్రాయోజిత పథకాల్లో షరతుల్లో రాష్ట్రాలకు కొన్ని వెసలుబాట్లు కల్పిస్తూ పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంతో పాటు, జీఎస్టీ కౌన్సిల్ భేటీలో భట్టి పాల్గొన్నారు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టకముందే నికర రుణపరిమితి ప్రకటించాలి : ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు వాటా తగ్గిందని, కేంద్రప్రభుత్వం విధించే సర్ ఛార్జీలు, సెస్​లను పదిశాతంలోపే ఉండేలా చూడాలని కోరినట్లు భట్టి తెలిపారు. అదేవిధంగా బడ్జెట్‌ ప్రవేశంపెట్టేందుకు నికర రుణపరిమితి ముందే ప్రకటించాలని కోరారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు పాలమూరు రంగారెడ్డికి జాతీయహోదా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్​కు నిధులివ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. ఎరువులు, సమీకృత విద్యాలయాల భవనాలకు జీఎస్టీ తగ్గించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు.

"కేంద్ర ప్రాయోజిత పథకాలపై పునఃసమీక్షించి, ఇప్పటివరకు ఉపయోగపడే కొన్ని కేంద్ర పథకాలపై పునఃసమీక్ష చేసి కొత్త పథకాలు తీసుకురావాలని కోరాం. ఆర్థిక సంఘాల సిఫారుసల ప్రకారం పన్ను విభజన విధానాల వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గింది. అందువల్ల కేంద్రం విధించుకునే సర్‌ ఛార్జీలు, సెస్‌లు వంటి వాటిని 10 శాతానికి మించకుండా ఉండేటట్టు చూడమని విజ్ఞప్తి చేశాను. అదేవిధంగా ఫెర్టిలైజర్స్‌ 18శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని కోరాము." -భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి

Bhatti Attend in Union Budget Preparatory Meeting : కేంద్ర ప్రయోజిత కార్యక్రమాలకు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఏటా రూ.450కోట్లు ఇవ్వాలని, ఇప్పటికే రూ.2,250కోట్లు రావాల్సి ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక రూ.495.21కోట్లు కేంద్రప్రయోజిత ఖాతాల్లో, ఏపీఖాతాల్లో తప్పుగా విడుదల చేసిందన్న ఆయన, దీనిని తిరిగి తెలంగాణకు వేయాలని కోరినట్లు వివరించారు.

Deputy CM Bhatti on GST Charges : రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ భవనాల కోసం సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని 18శాతం జీఎస్టీని తగ్గించడమో లేదా తీసివేయడమే చేయాలని డిప్యూటీ సీఎం భట్టి కోరారు. ఫెర్టిలైజర్స్‌ 18శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అందుకోసం గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్‌కు రిఫర్‌ చేశారు. జీఎస్టీకి సంబంధించి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన బకాయిలు, ఐజీఎస్టీ అంశాల్ని కౌన్సిల్‌ దృష్టికి తెచ్చామన్నారు. బీడీ ఆకులపై జీఎస్టీ తొలగించాలని కోరారు.

మోదీ 3.0లో తొలి బడ్జెట్- ఎన్నికల రాష్ట్రాలకు వరాలు- నిర్మలమ్మ ముందున్న సవాళ్లు ఇవే! - Union Budget 2024

ఆశల పల్లకిలో కొత్త బడ్జెట్​ - ఆర్థిక అవరోధాలను అధిగమించడం ఎలా?

Deputy CM Bhatti Vikramarka Attend in GST Council Meeting : కేంద్ర ప్రాయోజిత పథకాల్లో షరతుల్లో రాష్ట్రాలకు కొన్ని వెసలుబాట్లు కల్పిస్తూ పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంతో పాటు, జీఎస్టీ కౌన్సిల్ భేటీలో భట్టి పాల్గొన్నారు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టకముందే నికర రుణపరిమితి ప్రకటించాలి : ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు వాటా తగ్గిందని, కేంద్రప్రభుత్వం విధించే సర్ ఛార్జీలు, సెస్​లను పదిశాతంలోపే ఉండేలా చూడాలని కోరినట్లు భట్టి తెలిపారు. అదేవిధంగా బడ్జెట్‌ ప్రవేశంపెట్టేందుకు నికర రుణపరిమితి ముందే ప్రకటించాలని కోరారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు పాలమూరు రంగారెడ్డికి జాతీయహోదా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్​కు నిధులివ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. ఎరువులు, సమీకృత విద్యాలయాల భవనాలకు జీఎస్టీ తగ్గించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు.

"కేంద్ర ప్రాయోజిత పథకాలపై పునఃసమీక్షించి, ఇప్పటివరకు ఉపయోగపడే కొన్ని కేంద్ర పథకాలపై పునఃసమీక్ష చేసి కొత్త పథకాలు తీసుకురావాలని కోరాం. ఆర్థిక సంఘాల సిఫారుసల ప్రకారం పన్ను విభజన విధానాల వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గింది. అందువల్ల కేంద్రం విధించుకునే సర్‌ ఛార్జీలు, సెస్‌లు వంటి వాటిని 10 శాతానికి మించకుండా ఉండేటట్టు చూడమని విజ్ఞప్తి చేశాను. అదేవిధంగా ఫెర్టిలైజర్స్‌ 18శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని కోరాము." -భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి

Bhatti Attend in Union Budget Preparatory Meeting : కేంద్ర ప్రయోజిత కార్యక్రమాలకు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఏటా రూ.450కోట్లు ఇవ్వాలని, ఇప్పటికే రూ.2,250కోట్లు రావాల్సి ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక రూ.495.21కోట్లు కేంద్రప్రయోజిత ఖాతాల్లో, ఏపీఖాతాల్లో తప్పుగా విడుదల చేసిందన్న ఆయన, దీనిని తిరిగి తెలంగాణకు వేయాలని కోరినట్లు వివరించారు.

Deputy CM Bhatti on GST Charges : రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ భవనాల కోసం సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని 18శాతం జీఎస్టీని తగ్గించడమో లేదా తీసివేయడమే చేయాలని డిప్యూటీ సీఎం భట్టి కోరారు. ఫెర్టిలైజర్స్‌ 18శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అందుకోసం గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్‌కు రిఫర్‌ చేశారు. జీఎస్టీకి సంబంధించి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన బకాయిలు, ఐజీఎస్టీ అంశాల్ని కౌన్సిల్‌ దృష్టికి తెచ్చామన్నారు. బీడీ ఆకులపై జీఎస్టీ తొలగించాలని కోరారు.

మోదీ 3.0లో తొలి బడ్జెట్- ఎన్నికల రాష్ట్రాలకు వరాలు- నిర్మలమ్మ ముందున్న సవాళ్లు ఇవే! - Union Budget 2024

ఆశల పల్లకిలో కొత్త బడ్జెట్​ - ఆర్థిక అవరోధాలను అధిగమించడం ఎలా?

Last Updated : Jun 22, 2024, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.