ETV Bharat / state

వచ్చే వారం నుంచే ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ - మరో 5 లక్షల మందికి లబ్ధి! - LRS APPLICATIONS IN TELANGANA

వచ్చే వారం నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ మొదలు - సాంకేతిక సమస్యలపై అధికారుల దృష్టి - క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే అనుమతులపై ఆలోచన

PENDING LRS APPLICATIONS
LRS Applications In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 7:18 AM IST

LRS Applications in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన స్థలాల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ పథకంతో కొత్తగా మరో ఐదు లక్షల మందికి లబ్ధిచేకూరే అవకాశముంది. రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు 2020లోనే ఉత్తర్వులు వెలువడగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వివిధ కారణాలతో ఇప్పటి వరకు సుమారు 9 లక్షల దరఖాస్తులను పరిష్కరించగలిగారు. పెండింగ్ అర్జీలన్నీ ఒకేసారి పరిష్కరించేందుకు 25 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఇటీవలే ఓటీఎస్​ను ప్రకటించింది.

ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ మొదలు : మరోవైపు ఏదైనా లేఅవుట్​లో 10 శాతం మాత్రమే స్థలాలు అమ్ముడై , 90 శాతం ఖాళీగా ఉన్న ప్లాట్లకు కూడా నిర్ధారిత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల దాదాపు ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఇలాంటి స్థలాలను కొన్నవారు సబ్​రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి నేరుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ వెంచర్ల పరిశీలన గతంలోనే పూర్తవడమే ఇందుకు కారణం.

సాంకేతిక సమస్యలపై అధికారుల దృష్టి : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో 16 లక్షల వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటి విస్తీర్ణం ఆధారంగా ఆన్​లైన్​లో ఫీజు చెల్లించాలి. ఈ మేరకు దరఖాస్తుదారుడి ఫోన్‌కు లింకును పంపుతారు. దాన్ని తెరిచి ఆన్‌లైన్​లో ఫీజు చెల్లించిన వారి స్థలాన్ని అధికారులు తనిఖీ చేసి, అన్నీ మంచిగా ఉన్నాయనుకుంటే ప్రోసీడింగ్స్‌ అందజేస్తారు. దాంతో స్థల క్రమబద్ధీకరణ పూర్తవుతుంది.

అయితే 16 లక్షల మంది ఫీజు చెల్లించే పక్షంలో అన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి చాలా రోజులు పడుతుంది. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లను, నీటి వనరులకు 200 మీటర్ల పరిధిలో ఉన్న భూముల సర్వే నంబర్లను అధికారుల ఇప్పటికే కంప్యూటరీకరించారు.పెండింగ్‌ దరఖాస్తులలో ఈ నంబర్లుంటే వాటిని పక్కన పెడతారు. ఇలాంటి స్థలాలు మొత్తం దరఖాస్తుల్లో 5 శాతం ఉండవచ్చని భావిస్తున్నారు

భారాన్ని భరించడమే సవాల్‌ :మార్చి 31లోపు 16 లక్షల స్థలాలకు సంబంధించిన ఫీజుల చెల్లింపు ప్రక్రియ పూర్తి కావాలి. దీన్ని బట్టి రోజుకు 51 వేల మంది వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఇంత మంది ఒకేసారి ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేస్తే సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సాంకేతికంగా ఒకటికి రెండుసార్లు పరిశీలించి వచ్చే సోమవారం నుంచి ప్రక్రియను ప్రారంభించాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది.

LRS దరఖాస్తుదారులు ఆటోమేటెడ్‌గా ఫీజు ఖరారు - అప్పటిలోగా చెల్లిస్తేనే 25% డిస్కౌంట్

హెచ్​ఎండీఏ ఆశలన్నీ ఆ లక్ష ప్లాట్లపైనే - ఎల్​ఆర్​ఎస్​తో రూ.1000 కోట్ల ఆదాయం?

LRS Applications in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన స్థలాల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ పథకంతో కొత్తగా మరో ఐదు లక్షల మందికి లబ్ధిచేకూరే అవకాశముంది. రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు 2020లోనే ఉత్తర్వులు వెలువడగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వివిధ కారణాలతో ఇప్పటి వరకు సుమారు 9 లక్షల దరఖాస్తులను పరిష్కరించగలిగారు. పెండింగ్ అర్జీలన్నీ ఒకేసారి పరిష్కరించేందుకు 25 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఇటీవలే ఓటీఎస్​ను ప్రకటించింది.

ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ మొదలు : మరోవైపు ఏదైనా లేఅవుట్​లో 10 శాతం మాత్రమే స్థలాలు అమ్ముడై , 90 శాతం ఖాళీగా ఉన్న ప్లాట్లకు కూడా నిర్ధారిత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల దాదాపు ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఇలాంటి స్థలాలను కొన్నవారు సబ్​రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి నేరుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ వెంచర్ల పరిశీలన గతంలోనే పూర్తవడమే ఇందుకు కారణం.

సాంకేతిక సమస్యలపై అధికారుల దృష్టి : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో 16 లక్షల వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటి విస్తీర్ణం ఆధారంగా ఆన్​లైన్​లో ఫీజు చెల్లించాలి. ఈ మేరకు దరఖాస్తుదారుడి ఫోన్‌కు లింకును పంపుతారు. దాన్ని తెరిచి ఆన్‌లైన్​లో ఫీజు చెల్లించిన వారి స్థలాన్ని అధికారులు తనిఖీ చేసి, అన్నీ మంచిగా ఉన్నాయనుకుంటే ప్రోసీడింగ్స్‌ అందజేస్తారు. దాంతో స్థల క్రమబద్ధీకరణ పూర్తవుతుంది.

అయితే 16 లక్షల మంది ఫీజు చెల్లించే పక్షంలో అన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి చాలా రోజులు పడుతుంది. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లను, నీటి వనరులకు 200 మీటర్ల పరిధిలో ఉన్న భూముల సర్వే నంబర్లను అధికారుల ఇప్పటికే కంప్యూటరీకరించారు.పెండింగ్‌ దరఖాస్తులలో ఈ నంబర్లుంటే వాటిని పక్కన పెడతారు. ఇలాంటి స్థలాలు మొత్తం దరఖాస్తుల్లో 5 శాతం ఉండవచ్చని భావిస్తున్నారు

భారాన్ని భరించడమే సవాల్‌ :మార్చి 31లోపు 16 లక్షల స్థలాలకు సంబంధించిన ఫీజుల చెల్లింపు ప్రక్రియ పూర్తి కావాలి. దీన్ని బట్టి రోజుకు 51 వేల మంది వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఇంత మంది ఒకేసారి ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేస్తే సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సాంకేతికంగా ఒకటికి రెండుసార్లు పరిశీలించి వచ్చే సోమవారం నుంచి ప్రక్రియను ప్రారంభించాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది.

LRS దరఖాస్తుదారులు ఆటోమేటెడ్‌గా ఫీజు ఖరారు - అప్పటిలోగా చెల్లిస్తేనే 25% డిస్కౌంట్

హెచ్​ఎండీఏ ఆశలన్నీ ఆ లక్ష ప్లాట్లపైనే - ఎల్​ఆర్​ఎస్​తో రూ.1000 కోట్ల ఆదాయం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.