ETV Bharat / state

గోవా ట్రిప్​ ప్లాన్​ చేస్తున్నారా? సికింద్రాబాద్​ నుంచి డైరెక్ట్​ ట్రైన్ - వివరాలివే​ - Hyderabad To Goa Special Train

Hyderabad To Goa Special Train : గోవా పర్యటనకు వెళ్లే తెలుగు ప్రయాణికులకు గుడ్​న్యూస్. సికింద్రాబాద్​నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా వాస్కోడిగామా రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎప్పటి నుంచి పట్టాలెక్కనుందంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Hyderabad To Goa Special Train
Hyderabad To Goa Special Train (ETV Bharat)

Hyderabad To Goa Special Train : ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ - వాస్కోడిగామా రైలును ప్రకటించింది. ఎప్పటి నుంచో ఈ రైలు తీసుకురావాలన్న డిమాండ్ ఉండగా ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అక్టోబర్ 6న సికింద్రాబాద్ నుంచి ఈ రైలును ప్రారంభించనున్నారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.

సికింద్రాబాద్​ టు గోవా ట్రైన్​ టైమింగ్స్​ ఇవే : సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్ కు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైమరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే? : కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. 4వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్ కు అనుమతిస్తారు. 6వ తేదీ రైలు మాత్రం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు చేరుకుంటుంది.

గోవా వెళ్లేవారిలో 20 శాతం మంది తెలుగువారే : ఏటా దాదాపు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తుండగా ఇందులో 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలవారే ఉండడం విశేషం. నేరుగా రైలులో వెళ్లే సదుపాయం లేక సొంత వాహనాలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి గోవాకు ప్రయాణం సాగించేది.

ఇది కాకుండా కాచిగూడ - యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి - ప్రయాణం సాగించేవారు. బై వీక్లీ ట్రైన్ తో ఆ కష్టాలకు తొలిగిపోయినట్లె అని ప్రయాణికులు భావిస్తున్నారు.

గోవా టూర్​ ప్లాన్​ చేస్తున్నారా? - సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉందని మీకు తెలుసా? - SECUNDERABAD TO GOA DIRECT TRAIN

గోవా వెళ్లే తెలుగు వారికి కేంద్రం గుడ్ న్యూస్ - వారానికి రెండు సార్లు డైరెక్ట్ ట్రైన్ - Express Train From Hyderabad to Goa

Hyderabad To Goa Special Train : ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ - వాస్కోడిగామా రైలును ప్రకటించింది. ఎప్పటి నుంచో ఈ రైలు తీసుకురావాలన్న డిమాండ్ ఉండగా ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అక్టోబర్ 6న సికింద్రాబాద్ నుంచి ఈ రైలును ప్రారంభించనున్నారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.

సికింద్రాబాద్​ టు గోవా ట్రైన్​ టైమింగ్స్​ ఇవే : సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్ కు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైమరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే? : కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. 4వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్ కు అనుమతిస్తారు. 6వ తేదీ రైలు మాత్రం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు చేరుకుంటుంది.

గోవా వెళ్లేవారిలో 20 శాతం మంది తెలుగువారే : ఏటా దాదాపు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తుండగా ఇందులో 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలవారే ఉండడం విశేషం. నేరుగా రైలులో వెళ్లే సదుపాయం లేక సొంత వాహనాలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి గోవాకు ప్రయాణం సాగించేది.

ఇది కాకుండా కాచిగూడ - యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి - ప్రయాణం సాగించేవారు. బై వీక్లీ ట్రైన్ తో ఆ కష్టాలకు తొలిగిపోయినట్లె అని ప్రయాణికులు భావిస్తున్నారు.

గోవా టూర్​ ప్లాన్​ చేస్తున్నారా? - సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉందని మీకు తెలుసా? - SECUNDERABAD TO GOA DIRECT TRAIN

గోవా వెళ్లే తెలుగు వారికి కేంద్రం గుడ్ న్యూస్ - వారానికి రెండు సార్లు డైరెక్ట్ ట్రైన్ - Express Train From Hyderabad to Goa

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.