ETV Bharat / state

నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు - అనేక రకాలుగా వేధించారు: ముంబయి నటి - Mumbai Actress Complaint to Police

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 8:19 PM IST

Updated : Aug 30, 2024, 10:53 PM IST

Mumbai Actress Complaint to Vijayawada Police: ముంబయి సినీనటి వైఎస్సార్​సీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ కార్యాలయానికి వెళ్లిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వివరించారు.

mumbai_actress_complaint_to_police
mumbai_actress_complaint_to_police (ETV Bharat)

Mumbai Actress Complaint to Vijayawada Police: వైసీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో ముంబయి సినీ నటి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ కార్యాలయానికి వచ్చిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వివరించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.

పెళ్లి వద్దన్నందుకే నాపై కక్ష: ఈ కేసులో నిజాలు బయటకు రావాలని ముంబయి నటి అన్నారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. వైఎస్సార్​సీపీ నేతలు, పోలీసుల వల్ల తాను, తన కుటుంబసభ్యులు చాలా ఇబ్బంది పడ్డామని తెలిపారు. అంతే కాకుండా వాళ్లు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. తనను అనేక రకాలుగా వేధించారని అన్నారు. తన దగ్గరున్న సాక్ష్యాలు, ఆధారాలు పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు. వైఎస్సార్​సీపీ నేత విద్యాసాగర్‌ తన దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడని కానీ తాను వ్యతిరేకించినట్లు వివరించారు. విద్యాసాగర్‌ను వద్దన్నాననే అసూయతో తనపై కక్ష కట్టాడని వాపోయారు. విద్యాసాగర్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని ముంబయి నటి అన్నారు.

పోలీసులు వాంగ్మూలం రికార్డు చేశారని మీడియాకు ముంబయి నటి న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. నటిని వేధించిన ముగ్గురు ఐపీఎస్‌లు ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీపై ఫిర్యాదు చేశామన్నారు. ముంబయి నటిపై ఎక్కడా కేసులు లేవని, 41ఏ నోటీసులిచ్చి కేసులో కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. వృద్ధులైన నటి తల్లిదండ్రులను జైలులో పెట్టి బెయిల్ రాకుండా చేశారని తెలిపారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణలో తేలుతుందన్నారు. ఫిర్యాదు చేసిన విద్యాసాగర్ చూపించే అగ్రిమెంటూ కేసు పెట్టేందుకు చేసిందేనని నర్రా శ్రీనివాస్​ స్పష్టం చేశారు.

ఈ ఉదయం ముంబయి నుంచి విజయవాడ వచ్చిన నటిని హోటల్‌లో ఆమె తరఫు న్యాయవాదులు కలిశారు. నటితో మాట్లాడి న్యాయవాదులు ఫిర్యాదు కాపీని సిద్ధం చేశారు. సాయంత్రం సీపీ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వచ్చిన నటి సీపీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. కేసు వివరాలు, ఆధారాలను విజయవాడ సీపీకి నటి అందజేశారు. అటు నటిపై వేధింపుల కేసులో నిజనిజాలు తేల్చేందుకు ఏసీపీ స్రవంతిరాయ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. సినీనటిపై నమోదు చేసిన ఫోర్జరీ కేసునూ విచారణాధికారి పరిశీలిస్తున్నారు.

పోలీసుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - ముంబయి సినీ నటిపై కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు - Mumbai Actress Harassment Case

గూండాల తరహాలో కిడ్నాప్‌ చేశారు - ఏపీ పోలీసులు వేధించారు: ముంబై నటి - Mumbai Actress Harassment Issue

Mumbai Actress Complaint to Vijayawada Police: వైసీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో ముంబయి సినీ నటి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ కార్యాలయానికి వచ్చిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వివరించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.

పెళ్లి వద్దన్నందుకే నాపై కక్ష: ఈ కేసులో నిజాలు బయటకు రావాలని ముంబయి నటి అన్నారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. వైఎస్సార్​సీపీ నేతలు, పోలీసుల వల్ల తాను, తన కుటుంబసభ్యులు చాలా ఇబ్బంది పడ్డామని తెలిపారు. అంతే కాకుండా వాళ్లు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. తనను అనేక రకాలుగా వేధించారని అన్నారు. తన దగ్గరున్న సాక్ష్యాలు, ఆధారాలు పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు. వైఎస్సార్​సీపీ నేత విద్యాసాగర్‌ తన దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడని కానీ తాను వ్యతిరేకించినట్లు వివరించారు. విద్యాసాగర్‌ను వద్దన్నాననే అసూయతో తనపై కక్ష కట్టాడని వాపోయారు. విద్యాసాగర్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని ముంబయి నటి అన్నారు.

పోలీసులు వాంగ్మూలం రికార్డు చేశారని మీడియాకు ముంబయి నటి న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. నటిని వేధించిన ముగ్గురు ఐపీఎస్‌లు ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీపై ఫిర్యాదు చేశామన్నారు. ముంబయి నటిపై ఎక్కడా కేసులు లేవని, 41ఏ నోటీసులిచ్చి కేసులో కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. వృద్ధులైన నటి తల్లిదండ్రులను జైలులో పెట్టి బెయిల్ రాకుండా చేశారని తెలిపారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణలో తేలుతుందన్నారు. ఫిర్యాదు చేసిన విద్యాసాగర్ చూపించే అగ్రిమెంటూ కేసు పెట్టేందుకు చేసిందేనని నర్రా శ్రీనివాస్​ స్పష్టం చేశారు.

ఈ ఉదయం ముంబయి నుంచి విజయవాడ వచ్చిన నటిని హోటల్‌లో ఆమె తరఫు న్యాయవాదులు కలిశారు. నటితో మాట్లాడి న్యాయవాదులు ఫిర్యాదు కాపీని సిద్ధం చేశారు. సాయంత్రం సీపీ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వచ్చిన నటి సీపీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. కేసు వివరాలు, ఆధారాలను విజయవాడ సీపీకి నటి అందజేశారు. అటు నటిపై వేధింపుల కేసులో నిజనిజాలు తేల్చేందుకు ఏసీపీ స్రవంతిరాయ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. సినీనటిపై నమోదు చేసిన ఫోర్జరీ కేసునూ విచారణాధికారి పరిశీలిస్తున్నారు.

పోలీసుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - ముంబయి సినీ నటిపై కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు - Mumbai Actress Harassment Case

గూండాల తరహాలో కిడ్నాప్‌ చేశారు - ఏపీ పోలీసులు వేధించారు: ముంబై నటి - Mumbai Actress Harassment Issue

Last Updated : Aug 30, 2024, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.