ETV Bharat / state

విద్యార్థులకు బిగ్​ అలర్ట్​ - హైదరాబాద్​లోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు - HOLIDAYS FOR SCHOOLS in hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 9:45 PM IST

Updated : Aug 31, 2024, 10:29 PM IST

HOLIDAYS FOR SCHOOLS : రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్​ సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

HOLIDAYS FOR SCHOOLS
HOLIDAYS FOR SCHOOLS (ETV Bharat)

Holiday For Schools In Hyderabad : రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్​ అలర్ట్​ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్​లోని అన్ని రకాల పాఠశాలలకు సోమవారం జిల్లా కలెక్టర్​ సెలవును ప్రకటించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్​ జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్​ ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్​, పోలీస్​, విద్యుత్​, ఆర్​ అండ్​ బీ శాఖలతో పాటు జీహెచ్​ఎంసీ అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే హైదరాబాద్​ కలెక్టరేట్​లోని కంట్రోల్​ రూం 040-23202813, 9063423979 నెంబరుతో పాటు ఆర్డీవో హైదరాబాద్ 7416818610, 9985117660, సికింద్రాబాద్ ఆర్డీవో ఫోన్ నెంబర్ 8019747481లకు ఫోన్‌ చేసి సమస్యలు తెలపాలని సూచించారు.

భారీ వర్షాలపై సీఎస్​తో సీఎం రేవంత్​ సమీక్ష : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించారు. వర్షాల ప్రభావంపై సీఎస్​ శాంతికుమారితో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడారు. రెవెన్యూ, మున్సిపల్​, విద్యుత్​, వైద్యారోగ్య శాఖాధికారులందరినీ అప్రమత్తం చేయాలని సీఎస్​కు సీఎం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం ఆదేశించారు.

దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయండి : రిజ‌ర్వాయ‌ర్ల గేట్లు ఎత్తే చోట దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హైదరాబాద్​లో మళ్లీ ప్రారంభమైన వర్షం : హైదరాబాద్​లో ముసురు కొనసాగుతోంది. చినుకుచినుకు పడుతూ నగరాన్ని వర్షపు నీటితో చిందరవందర చేస్తోంది. హైదరాబాద్​లోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. ఈ క్రమంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు వరద నీటితో జలమయం అయ్యాయి. ఈ వర్షం ఇంకో రెండు రోజులు ఇలానే ఉంటుందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రాను భయపెడుతున్న వర్షాలు - ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరికలు - heavy rainfall in andhrapradesh

తెలంగాణను వణికిస్తున్న వరుణుడు - ఇబ్బందులు పడుతున్న ప్రజానికం - Heavy Rains IN Telangana

Holiday For Schools In Hyderabad : రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్​ అలర్ట్​ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్​లోని అన్ని రకాల పాఠశాలలకు సోమవారం జిల్లా కలెక్టర్​ సెలవును ప్రకటించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్​ జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్​ ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్​, పోలీస్​, విద్యుత్​, ఆర్​ అండ్​ బీ శాఖలతో పాటు జీహెచ్​ఎంసీ అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే హైదరాబాద్​ కలెక్టరేట్​లోని కంట్రోల్​ రూం 040-23202813, 9063423979 నెంబరుతో పాటు ఆర్డీవో హైదరాబాద్ 7416818610, 9985117660, సికింద్రాబాద్ ఆర్డీవో ఫోన్ నెంబర్ 8019747481లకు ఫోన్‌ చేసి సమస్యలు తెలపాలని సూచించారు.

భారీ వర్షాలపై సీఎస్​తో సీఎం రేవంత్​ సమీక్ష : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించారు. వర్షాల ప్రభావంపై సీఎస్​ శాంతికుమారితో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడారు. రెవెన్యూ, మున్సిపల్​, విద్యుత్​, వైద్యారోగ్య శాఖాధికారులందరినీ అప్రమత్తం చేయాలని సీఎస్​కు సీఎం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం ఆదేశించారు.

దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయండి : రిజ‌ర్వాయ‌ర్ల గేట్లు ఎత్తే చోట దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హైదరాబాద్​లో మళ్లీ ప్రారంభమైన వర్షం : హైదరాబాద్​లో ముసురు కొనసాగుతోంది. చినుకుచినుకు పడుతూ నగరాన్ని వర్షపు నీటితో చిందరవందర చేస్తోంది. హైదరాబాద్​లోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. ఈ క్రమంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు వరద నీటితో జలమయం అయ్యాయి. ఈ వర్షం ఇంకో రెండు రోజులు ఇలానే ఉంటుందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రాను భయపెడుతున్న వర్షాలు - ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరికలు - heavy rainfall in andhrapradesh

తెలంగాణను వణికిస్తున్న వరుణుడు - ఇబ్బందులు పడుతున్న ప్రజానికం - Heavy Rains IN Telangana

Last Updated : Aug 31, 2024, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.