Ponnam Review Meeting On New Ration Cards and Indiramma Houses : రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, తెలంగాణలోని అన్ని జిల్లాలోని అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన జరుగుతుందని చెప్పారు. 21 నుంచి అర్హులైన వారి డేటా ఎంట్రీ చేస్తామన్నారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.
ఇందిరమ్మ గృహ కల్పన పథకంలో హైదరాబాద్లో స్థలం ఉండి, ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇల్లు లేని వారందరికీ మంజూరు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి వలస వచ్చిన వారికి కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. వీటి పంపిణీలో ఆదర్శంగా నిలుస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. అసంపూర్తిగా ఉన్న 2 పడక గదుల ఇళ్లను పూర్తి చేయడానికి గుత్తేదారులతో మాట్లాడతామని తెలిపారు. పూర్తయిన ఇళ్లను లాటరీ వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
"ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. హైదరాబాద్లో స్థలం ఉండి ఇల్లు లేనివారికి తొలి ప్రాధాన్యత ఇస్తాం. జిల్లాల నుంచి వలస వచ్చిన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఆదర్శంగా నిలుస్తాం. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేస్తాం. గుత్తేదారులతో మాట్లాడి డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. పూర్తయిన ఇళ్లను లాటరీ వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం" - మంత్రి పొన్నం ప్రభాకర్
కొత్త రేషన్కార్డుల దరఖాస్తుల డేట్ ఇదే! - అప్లై చేసేందుకు మళ్లీ ఊరెళ్లాల్సిందే
కొత్త రేషన్కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా? - వారంలో కీలక ప్రకటన