ETV Bharat / state

ఆరోపణలు కాదు, హైదరాబాద్ సమస్యలు పరిష్కరించండి - కిషన్ రెడ్డికి పొన్నం సలహా - Minister Ponnam on Kishan Reddy

Minister Ponnam on Kishan Reddy : హైదరాబాద్​ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా మాట్లాడారంటూ కేంద్రమంత్రి కిషన్​రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్​కు ఆయన ఏం తెచ్చారో చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్​ నగరాన్ని నిర్లక్ష్యం చేసిందే బీజేపీ, బీఆర్​ఎస్​ అని ఆరోపించారు. గాంధీభవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 6:58 PM IST

Minister Ponnam on Kishan Reddy
Minister Ponnam on Kishan Reddy (ETV Bharat)

Minister Ponnam Prabhakar Fires on Kishan Reddy : కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతింటోదంటూ కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ ఖండించారు. హైదరాబాద్​ నగరాన్ని నిర్లక్ష్యం చేసింది బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలేనని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి హైదరాబాద్​కు ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కిషన్​ రెడ్డి కేంద్రమంత్రి కాగానే తాను హైదరాబాద్​ ఇంఛార్జి మంత్రిగా ఆయనను కలిసినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

గత ప్రభుత్వంలో కేటీఆర్​ కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆరోపించారు. హైదరాబాద్​ నగరం అస్తవ్యస్తం కావడానికి మాజీ మంత్రి కేటీఆర్​నే కారణమని విమర్శించారు. త్వరలో ఉద్యోగ క్యాలెండర్​ తప్పకుండా ఇస్తామని వెల్లడించారు. ఉద్యోగ నియామకాలు జాప్యం అవుతున్నాయని మొన్నటివరకు ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దని కోరారు. విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ హామీ ఇచ్చారు. కేంద్రం హైదరాబాద్​ను స్మార్ట్​ సిటీ చేయలేదని, అమృత్​ పథకం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతోనే రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్​ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.

"హైదరాబాద్​ చారిత్రక నగరం ఇస్తాంబుల్​ వంటిది. చార్మినార్​, గోల్కొండ వంటి ఆర్కియాలజీకి సంబంధించి ఎన్నో కట్టడాలు ఉన్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిగా గత ఐదేళ్లలో కేంద్రం నుంచి హెరిటేజ్​, టూరిజం, ఆర్కియాలజీ విభాగాల నుంచి హైదరాబాద్​కు కిషన్​ రెడ్డి ఏం తెచ్చారు? మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు కావాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశాం. హైదరాబాద్​లో 151 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో సమస్యలు ఏర్పడుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఇంఛార్జి మంత్రిగా ఇక్కడి సమస్యలు చెప్పడానికి సిద్ధం. వీలైతే హైదరాబాద్​ అభివృద్ధికి సహాయం చేయండి." - పొన్నం ప్రభాకర్​, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

హైదరాబాద్​ ఇలా కావడానికి కారణం కేటీఆర్​నే : హైదరాబాద్​ గురించి ఇప్పుడు కేటీఆర్​ మాట్లాడుతున్నారు. అప్పుడు బీజేపీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తీసుకురాలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్​ ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని, హైదరాబాద్​ ఇలా కావడానికి ప్రధాన కారణం భూకబ్జాలు, అక్రమ కట్టడాలేనని, వీటిని ప్రోత్సహించింది కేటీఆర్​ అని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయిందన్నారు.

హైదరాబాద్​లో ఫార్మా సూటికల్​​ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తా : కిషన్​ రెడ్డి - Kishan Reddy On Pharma Sector

పథకాల పేరిట తెస్తున్న అప్పులు ఏం చేస్తున్నారు? - మహిళలకు ఇచ్చిన హమీలు ఏవీ? : కిషన్ రెడ్డి - KISHAN REDDYON CONGRESS GUARANTEES

Minister Ponnam Prabhakar Fires on Kishan Reddy : కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతింటోదంటూ కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ ఖండించారు. హైదరాబాద్​ నగరాన్ని నిర్లక్ష్యం చేసింది బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలేనని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి హైదరాబాద్​కు ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కిషన్​ రెడ్డి కేంద్రమంత్రి కాగానే తాను హైదరాబాద్​ ఇంఛార్జి మంత్రిగా ఆయనను కలిసినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

గత ప్రభుత్వంలో కేటీఆర్​ కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆరోపించారు. హైదరాబాద్​ నగరం అస్తవ్యస్తం కావడానికి మాజీ మంత్రి కేటీఆర్​నే కారణమని విమర్శించారు. త్వరలో ఉద్యోగ క్యాలెండర్​ తప్పకుండా ఇస్తామని వెల్లడించారు. ఉద్యోగ నియామకాలు జాప్యం అవుతున్నాయని మొన్నటివరకు ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దని కోరారు. విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ హామీ ఇచ్చారు. కేంద్రం హైదరాబాద్​ను స్మార్ట్​ సిటీ చేయలేదని, అమృత్​ పథకం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతోనే రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్​ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.

"హైదరాబాద్​ చారిత్రక నగరం ఇస్తాంబుల్​ వంటిది. చార్మినార్​, గోల్కొండ వంటి ఆర్కియాలజీకి సంబంధించి ఎన్నో కట్టడాలు ఉన్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిగా గత ఐదేళ్లలో కేంద్రం నుంచి హెరిటేజ్​, టూరిజం, ఆర్కియాలజీ విభాగాల నుంచి హైదరాబాద్​కు కిషన్​ రెడ్డి ఏం తెచ్చారు? మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు కావాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశాం. హైదరాబాద్​లో 151 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో సమస్యలు ఏర్పడుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఇంఛార్జి మంత్రిగా ఇక్కడి సమస్యలు చెప్పడానికి సిద్ధం. వీలైతే హైదరాబాద్​ అభివృద్ధికి సహాయం చేయండి." - పొన్నం ప్రభాకర్​, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

హైదరాబాద్​ ఇలా కావడానికి కారణం కేటీఆర్​నే : హైదరాబాద్​ గురించి ఇప్పుడు కేటీఆర్​ మాట్లాడుతున్నారు. అప్పుడు బీజేపీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తీసుకురాలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్​ ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని, హైదరాబాద్​ ఇలా కావడానికి ప్రధాన కారణం భూకబ్జాలు, అక్రమ కట్టడాలేనని, వీటిని ప్రోత్సహించింది కేటీఆర్​ అని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయిందన్నారు.

హైదరాబాద్​లో ఫార్మా సూటికల్​​ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తా : కిషన్​ రెడ్డి - Kishan Reddy On Pharma Sector

పథకాల పేరిట తెస్తున్న అప్పులు ఏం చేస్తున్నారు? - మహిళలకు ఇచ్చిన హమీలు ఏవీ? : కిషన్ రెడ్డి - KISHAN REDDYON CONGRESS GUARANTEES

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.