ETV Bharat / state

ఫర్నీచర్‌ గోదాంలో అగ్నిప్రమాదం - తండ్రీ కుమార్తె మృతి - మరో ఇద్దరి పరిస్థితి విషమం - FIRE ACCIDENT AT FURNITURE GODOWN

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 7:41 AM IST

Updated : Jul 24, 2024, 11:44 AM IST

Fire Accident In Furniture Godown Today : హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జియాగూడ వెంకటేశ్వర్‌నగర్‌లో ఫర్నిచర్‌, రెగ్జీన్‌ గోదాంలో ప్రమాదం సంభవించింది. భవనంలో మొత్తం 20 మంది చిక్కుకోగా వారిని అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు రక్షించారు. తీవ్రంగా గాయపడి వానిరి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొంతూ తండ్రి, కుమార్తె మృతి చెందారు. అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Fire Accident In Furniture Godown
Fire Accident In Furniture Godown (ETV Bharat)

Furniture Godown Fire Accident in Hyderabad Today : రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుల్సుంపుర జియాగూడ లోని వెంకటేశ్వరనగర్‌లో ఫర్నిచర్‌ తయారీ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మూడంతస్తుల భవనంలోని, మూడవ అంతస్తులో 20 మంది గోదాంలో పనిచేసే సిబ్బంది చిక్కుకోగా వారిని అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన ద్వారా కిందకు తీసుకువచ్చారు. అయితే వారిలో ఆరుగురికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొంతూ తండ్రి, కుమార్తె మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మృతులు శ్రీనివాస్‌, శివప్రియగా పోలీసులు గుర్తించారు.

కింది అంతస్తు నుంచి మంటలు పై భాగానికి వ్యాపించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మొత్తం పది అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే గోదాంలో ఎటువంటి అగ్నిమాపక ప్రమాణాలు లేనట్టు అధికారులు గుర్తించారు. మంటలను ఇంకా అదుపు చేస్తున్నారు. గాయపడిన వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తోంది. మంటలను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

గోదాం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. రాత్రి వేళ అంత మంది గోదాంలో ఎందుకు ఉన్నారనే విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. గోదాం యజమానిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రి సమయంలో 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు లేవని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

'రాత్రి ఒంటిగంట సమయంలో పొగలు అలుముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన మేము స్థానికుల సాయం కోసం అరిచాం. చుట్టుపక్కల వారు వచ్చి చీరలు వేసి మమ్మల్ని కిందకు దించారు. ఆలోపే భవనం మొత్తం మంటలు అంటుకున్నాయి. ఇక్కడ అనుమతులు లేకుండా గోదాంలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. అయినా గోదాంలు నిర్వహిస్తున్నారు.' అగ్నిప్రమాద బాధితులు

పడవలో అగ్నిప్రమాదం- 40 మంది మృతి

హుజూరాబాద్​లో భారీ అగ్నిప్రమాదం - కాలి బూడిదైన 35 దుకాణాలు - Massive Fire Accident In Karimnagar

Furniture Godown Fire Accident in Hyderabad Today : రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుల్సుంపుర జియాగూడ లోని వెంకటేశ్వరనగర్‌లో ఫర్నిచర్‌ తయారీ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మూడంతస్తుల భవనంలోని, మూడవ అంతస్తులో 20 మంది గోదాంలో పనిచేసే సిబ్బంది చిక్కుకోగా వారిని అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన ద్వారా కిందకు తీసుకువచ్చారు. అయితే వారిలో ఆరుగురికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొంతూ తండ్రి, కుమార్తె మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మృతులు శ్రీనివాస్‌, శివప్రియగా పోలీసులు గుర్తించారు.

కింది అంతస్తు నుంచి మంటలు పై భాగానికి వ్యాపించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మొత్తం పది అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే గోదాంలో ఎటువంటి అగ్నిమాపక ప్రమాణాలు లేనట్టు అధికారులు గుర్తించారు. మంటలను ఇంకా అదుపు చేస్తున్నారు. గాయపడిన వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తోంది. మంటలను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

గోదాం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. రాత్రి వేళ అంత మంది గోదాంలో ఎందుకు ఉన్నారనే విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. గోదాం యజమానిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రి సమయంలో 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు లేవని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

'రాత్రి ఒంటిగంట సమయంలో పొగలు అలుముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన మేము స్థానికుల సాయం కోసం అరిచాం. చుట్టుపక్కల వారు వచ్చి చీరలు వేసి మమ్మల్ని కిందకు దించారు. ఆలోపే భవనం మొత్తం మంటలు అంటుకున్నాయి. ఇక్కడ అనుమతులు లేకుండా గోదాంలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. అయినా గోదాంలు నిర్వహిస్తున్నారు.' అగ్నిప్రమాద బాధితులు

పడవలో అగ్నిప్రమాదం- 40 మంది మృతి

హుజూరాబాద్​లో భారీ అగ్నిప్రమాదం - కాలి బూడిదైన 35 దుకాణాలు - Massive Fire Accident In Karimnagar

Last Updated : Jul 24, 2024, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.