ETV Bharat / state

ఆ ఊరంతా లారీలే - 100 మందికి పైగా డ్రైవర్లే - Lorry Families Story in Narayanpur

మా నాన్న డ్రైవర్​, మా అన్నయ్య డ్రైవర్​, మా తమ్ముడు డ్రైవర్ - ఆ ఊర్లో ఎవరిని కదిపినా ఇదే మాట

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Samsthan Narayanpur Lorry Families Story
Samsthan Narayanpur Lorry Families Story (ETV Bharat)

Samsthan Narayanpur Lorry Families Story : ఏ ఊళ్లోనైనా సరే మా ఊళ్లో ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నారు. లేకపోతే మా ఊరి నిండా ప్రతి ఇంటిలోనూ పోలీస్ లేక రక్షణ దళంలో పని చేసే వ్యక్తి ఉంటారు అని చెప్పుకుంటే వింటుంటాం. కానీ ఆ ఊళ్లో మాత్రం ఎవరిని కదిపినా ఒకే మాట మా నాన్న డ్రైవర్​, మాకు లారీలు ఉన్నాయి. మా అన్నయ్య డ్రైవర్​, మా తమ్ముడు డ్రైవర్​ వారికి లారీలు ఉన్నాయని చెబుతారు. ఏంటి ఆశ్చర్యం వేస్తోంది కదూ. ఒకే ఊళ్లో ఇంతమంది లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లుగా ఉండటం ఏంటని? ఇక్కడ వందకు పైనే కుటుంబాలు లారీ పరిశ్రమనే నమ్ముకొని జీవిస్తున్నాయంటే నమ్మగలరా? ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉందంటే? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది.

అసలు కథేంటంటే : యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్​ నారాయణపురం మండలం అల్లందేవి చెర్వు గ్రామంలో 130 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల్లోని సుమారు 100కు పైగా కుటుంబాలు గత 45 ఏళ్లుగా లారీ పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇలా గ్రామంలో ప్రతి ఇంట్లోనూ లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లుగా పని చేస్తున్నవారు ఉన్నారు. కరోనా కంటే ముందు ఊరిలో 150 కంటే ఎక్కువ లారీలే ఉండేవి.

ఈ ఊరిలో కొన్ని కుటుంబాల్లో ఒక్కరికి నాలుగు వరకు లారీలు ఉండటం ఒక విశేషం. అది కూడా మొదట క్లీనర్​గా పని చేసిన వారు డ్రైవర్లుగా మారడం, ఆ తర్వాత లారీ యజమానులుగా మారి లారీ ఓనర్​ కమ్​ డ్రైవర్​గా మారుతున్నారు. అలా రానురానూ లారీలకు యజమానులుగా మారి ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు లారీలతో వ్యాపారం చేస్తున్నారు. మరికొంత మంది డ్రైవింగ్​ ఫీల్డ్​కు సంబంధం లేకున్నా, లారీ యజమానులుగా మారి ఉపాధి పొందుతున్నారు.

ప్రస్తుతం ఇక్కడున్న యువత చాలా వరకు లారీ డ్రైవర్లుగానే ఉపాధి పొందుతూ ముందుకు సాగుతున్నారు. అయితే కరోనా విపత్తుల తర్వాత డ్రైవర్​ వృత్తి ఇబ్బందిగా మారి వ్యాపారం అంత లాభసాటిగా లేకపోవడంతో గ్రామంలో లారీ వృత్తి అనేది మసకబారుతోంది. ఇప్పుడు నాలుగు లారీలు ఉన్నవాళ్లు రెండింటికే పరిమితం అవుతున్నారు. కేవలం ఒక్క లారీ మాత్రమే ఉన్నవాళ్లు డ్రైవర్లుగా మారి నడుపుతున్నారు. ఇలా ఇప్పుడు సుమారు వంద లారీలు వరకు ఆ గ్రామంలో ఉన్నాయి.

Samsthan Narayanpur Lorry Families Story
ఈ ఇద్దరే మొదటి డ్రైవర్లు, యజమానులు (ETV Bharat)

ఆ ఇద్దరే మొదటి డ్రైవర్లు, యజమానులు : అంతటి భిక్షపతి, యాదయ్యలు 1980లో ఈ గ్రామంలో లారీ డ్రైవర్లుగా ఉన్నారు. అప్పుడు వారి వద్దకు క్లీనర్​గా వెళ్లి డ్రైవర్లుగా మారుతూ ఒకరి నుంచి ఒకరు ఊరంతా లారీ డ్రైవర్లు, ఓనర్లుగా మారారు. అంతేకాకుండా మొదట గ్రామంలో లారీ యజమానిగా మారింది కూడా అంతటి భిక్షపతినే. ఆ ఊళ్లో డ్రైవర్​గా పని చేసి ముసలితనం వచ్చినవాళ్లు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో మాత్రం లారీ పరిశ్రమను మాత్రం వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా గ్రామంలోకి లారీలు అన్ని చేరుకొని సందడి వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీల యాజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, అలాగే ఆటోనగర్​ ఇసుక లారీల యజమానుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సుర్వి రాజుగౌడ్​ ఈ గ్రామస్థులే కావడం విశేషం.

లారీ డ్రైవర్​కు నెలకు రూ.10 లక్షల ఆదాయం! - ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా? - Truck Driver Turns Influencer

Samsthan Narayanpur Lorry Families Story : ఏ ఊళ్లోనైనా సరే మా ఊళ్లో ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నారు. లేకపోతే మా ఊరి నిండా ప్రతి ఇంటిలోనూ పోలీస్ లేక రక్షణ దళంలో పని చేసే వ్యక్తి ఉంటారు అని చెప్పుకుంటే వింటుంటాం. కానీ ఆ ఊళ్లో మాత్రం ఎవరిని కదిపినా ఒకే మాట మా నాన్న డ్రైవర్​, మాకు లారీలు ఉన్నాయి. మా అన్నయ్య డ్రైవర్​, మా తమ్ముడు డ్రైవర్​ వారికి లారీలు ఉన్నాయని చెబుతారు. ఏంటి ఆశ్చర్యం వేస్తోంది కదూ. ఒకే ఊళ్లో ఇంతమంది లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లుగా ఉండటం ఏంటని? ఇక్కడ వందకు పైనే కుటుంబాలు లారీ పరిశ్రమనే నమ్ముకొని జీవిస్తున్నాయంటే నమ్మగలరా? ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉందంటే? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది.

అసలు కథేంటంటే : యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్​ నారాయణపురం మండలం అల్లందేవి చెర్వు గ్రామంలో 130 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల్లోని సుమారు 100కు పైగా కుటుంబాలు గత 45 ఏళ్లుగా లారీ పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇలా గ్రామంలో ప్రతి ఇంట్లోనూ లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లుగా పని చేస్తున్నవారు ఉన్నారు. కరోనా కంటే ముందు ఊరిలో 150 కంటే ఎక్కువ లారీలే ఉండేవి.

ఈ ఊరిలో కొన్ని కుటుంబాల్లో ఒక్కరికి నాలుగు వరకు లారీలు ఉండటం ఒక విశేషం. అది కూడా మొదట క్లీనర్​గా పని చేసిన వారు డ్రైవర్లుగా మారడం, ఆ తర్వాత లారీ యజమానులుగా మారి లారీ ఓనర్​ కమ్​ డ్రైవర్​గా మారుతున్నారు. అలా రానురానూ లారీలకు యజమానులుగా మారి ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు లారీలతో వ్యాపారం చేస్తున్నారు. మరికొంత మంది డ్రైవింగ్​ ఫీల్డ్​కు సంబంధం లేకున్నా, లారీ యజమానులుగా మారి ఉపాధి పొందుతున్నారు.

ప్రస్తుతం ఇక్కడున్న యువత చాలా వరకు లారీ డ్రైవర్లుగానే ఉపాధి పొందుతూ ముందుకు సాగుతున్నారు. అయితే కరోనా విపత్తుల తర్వాత డ్రైవర్​ వృత్తి ఇబ్బందిగా మారి వ్యాపారం అంత లాభసాటిగా లేకపోవడంతో గ్రామంలో లారీ వృత్తి అనేది మసకబారుతోంది. ఇప్పుడు నాలుగు లారీలు ఉన్నవాళ్లు రెండింటికే పరిమితం అవుతున్నారు. కేవలం ఒక్క లారీ మాత్రమే ఉన్నవాళ్లు డ్రైవర్లుగా మారి నడుపుతున్నారు. ఇలా ఇప్పుడు సుమారు వంద లారీలు వరకు ఆ గ్రామంలో ఉన్నాయి.

Samsthan Narayanpur Lorry Families Story
ఈ ఇద్దరే మొదటి డ్రైవర్లు, యజమానులు (ETV Bharat)

ఆ ఇద్దరే మొదటి డ్రైవర్లు, యజమానులు : అంతటి భిక్షపతి, యాదయ్యలు 1980లో ఈ గ్రామంలో లారీ డ్రైవర్లుగా ఉన్నారు. అప్పుడు వారి వద్దకు క్లీనర్​గా వెళ్లి డ్రైవర్లుగా మారుతూ ఒకరి నుంచి ఒకరు ఊరంతా లారీ డ్రైవర్లు, ఓనర్లుగా మారారు. అంతేకాకుండా మొదట గ్రామంలో లారీ యజమానిగా మారింది కూడా అంతటి భిక్షపతినే. ఆ ఊళ్లో డ్రైవర్​గా పని చేసి ముసలితనం వచ్చినవాళ్లు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో మాత్రం లారీ పరిశ్రమను మాత్రం వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా గ్రామంలోకి లారీలు అన్ని చేరుకొని సందడి వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీల యాజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, అలాగే ఆటోనగర్​ ఇసుక లారీల యజమానుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సుర్వి రాజుగౌడ్​ ఈ గ్రామస్థులే కావడం విశేషం.

లారీ డ్రైవర్​కు నెలకు రూ.10 లక్షల ఆదాయం! - ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా? - Truck Driver Turns Influencer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.