ETV Bharat / state

ఓరుగల్లులో గణేశ్ నిమజ్జనం - శోభాయాత్రగా తరలివెళ్లి గంగమ్మ ఒడికి చేరనున్న లంబోదరుడు - Ganesh Immersion In Warangal

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 7:46 AM IST

Updated : Sep 16, 2024, 9:48 AM IST

Ganesh Immersion In Warangal : ఓరుగల్లులో వినాయక నిమజ్జన శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం పూజలనంతరం డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాటాలు ఊరేగింపులు నడుమ సందడిగా గణనాథుడు గంగమ్మ చెంతకు చేరుకోనున్నాడు.

GANESH IMMERSION CELEBRATIONS 2024
Ganesh Immersion In Warangal (ETV Bharat)

Ganesh Immersion In Warangal : వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇవాళ వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరగనుంది. తొలి పూజలందుకునే గణపతి తొమ్మిది రోజుల పాటు భక్తుల చేత పూజలందుకుని కుడుములు, ఇతర నైవేద్యాలను ఆరగించి ఇవాళ గంగ చెంతకు బయలుదేరనున్నాడు. ఓరుగల్లులో ఈసారి గణపతి నవరాత్రులు ఆద్యంతం సందడిగా సాగాయి. విద్యుద్దీపకాంతులతో నగర వీధులు దేదీప్యమానంగా వెలిగిపోయింది.

జోరుగా నిమజ్జన ఏర్పాట్లు : గతంతో పోలిస్తే ఎక్కువగా విభిన్న గణపతులు కొలువుతీరాయి. ఇక వరంగల్‌లో 40 అడుగులతో తయారు చేసిన గణనాధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మండపాల వద్ద నిత్య పూజలతో పాటు భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సరస్వతీ, లక్ష్మీ పూజల్లో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం రాత్రి సమయాల్లోనూ మండపాల వద్ద అన్నదానాల కార్యక్రమాలను నిర్వహించారు.

పోయి రా గణపయ్య : ఇవాళ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండ, వరంగల్, కాజీపేట పరిధిలో బంధం చెరువు, కోట మల్లన్న చెరువు, గుండం చెరువు బెస్తం చెరువు, చినవడ్డేపల్లి చెరువు, రంగం సముద్రం చెరువు సిద్దేశ్వర గుండం తదిరర 21 చెరువుల వద్ద నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేశారు.

కోట చెరువులో నిమజ్జనం నిషేధం : నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో ఆఖరి నిమిషంలో కోట చెరువులో నిమజ్జనాలపై నిషేధం విధించారు. పంచాయతీ, మునిసిపల్, విద్యుత్, పోలీస్, రెవెన్యూ నీటి పారుదల తదితర శాఖల అధికారులు నిమజ్జనం పాల్గొంటున్నారు. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా ఉన్నందున గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

వెల్లివిరిసిన మత సామరస్యం : వినాయకుడి సేవలో ఓ ముస్లిం సోదరుడు అన్నీతానై ఆ వాడలో ఉన్న హిందువులతో కలిసి ఎంతో వైభవంగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. లంబోదరుడికి ఏకంగా 216 కిలోల లడ్డూను సమర్పించి, తన దైవభక్తిని చాటుకుంటున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తూజిపేట గ్రామంలో రియాజ్ ఏఆర్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలను తన సొంత డబ్బులతో నిర్వహిస్తున్నాడు.

నిషేధంపై యూటర్న్ - ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి గ్రీన్‌సిగ్నల్ - Ganesh Immersion 2024

గణేశ్ నిమజ్జనం స్పెషల్ - 17న అర్ధరాత్రి 2గంటల వరకు మెట్రో రైళ్లు - HYDERABAD METRO TIMINGS EXTENDED

Ganesh Immersion In Warangal : వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇవాళ వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరగనుంది. తొలి పూజలందుకునే గణపతి తొమ్మిది రోజుల పాటు భక్తుల చేత పూజలందుకుని కుడుములు, ఇతర నైవేద్యాలను ఆరగించి ఇవాళ గంగ చెంతకు బయలుదేరనున్నాడు. ఓరుగల్లులో ఈసారి గణపతి నవరాత్రులు ఆద్యంతం సందడిగా సాగాయి. విద్యుద్దీపకాంతులతో నగర వీధులు దేదీప్యమానంగా వెలిగిపోయింది.

జోరుగా నిమజ్జన ఏర్పాట్లు : గతంతో పోలిస్తే ఎక్కువగా విభిన్న గణపతులు కొలువుతీరాయి. ఇక వరంగల్‌లో 40 అడుగులతో తయారు చేసిన గణనాధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మండపాల వద్ద నిత్య పూజలతో పాటు భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సరస్వతీ, లక్ష్మీ పూజల్లో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం రాత్రి సమయాల్లోనూ మండపాల వద్ద అన్నదానాల కార్యక్రమాలను నిర్వహించారు.

పోయి రా గణపయ్య : ఇవాళ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండ, వరంగల్, కాజీపేట పరిధిలో బంధం చెరువు, కోట మల్లన్న చెరువు, గుండం చెరువు బెస్తం చెరువు, చినవడ్డేపల్లి చెరువు, రంగం సముద్రం చెరువు సిద్దేశ్వర గుండం తదిరర 21 చెరువుల వద్ద నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేశారు.

కోట చెరువులో నిమజ్జనం నిషేధం : నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో ఆఖరి నిమిషంలో కోట చెరువులో నిమజ్జనాలపై నిషేధం విధించారు. పంచాయతీ, మునిసిపల్, విద్యుత్, పోలీస్, రెవెన్యూ నీటి పారుదల తదితర శాఖల అధికారులు నిమజ్జనం పాల్గొంటున్నారు. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా ఉన్నందున గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

వెల్లివిరిసిన మత సామరస్యం : వినాయకుడి సేవలో ఓ ముస్లిం సోదరుడు అన్నీతానై ఆ వాడలో ఉన్న హిందువులతో కలిసి ఎంతో వైభవంగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. లంబోదరుడికి ఏకంగా 216 కిలోల లడ్డూను సమర్పించి, తన దైవభక్తిని చాటుకుంటున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తూజిపేట గ్రామంలో రియాజ్ ఏఆర్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలను తన సొంత డబ్బులతో నిర్వహిస్తున్నాడు.

నిషేధంపై యూటర్న్ - ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి గ్రీన్‌సిగ్నల్ - Ganesh Immersion 2024

గణేశ్ నిమజ్జనం స్పెషల్ - 17న అర్ధరాత్రి 2గంటల వరకు మెట్రో రైళ్లు - HYDERABAD METRO TIMINGS EXTENDED

Last Updated : Sep 16, 2024, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.