ETV Bharat / state

భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌పై భూకబ్జా కేసు - Land Case On congress MP Candidate

Land Grabbing Case On MP Candidate Chamala Kiran Kumar Reddy : భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదైంది. రాగన్నగూడలో 200 గజాల ప్లాట్‌ కబ్జా చేశారని రాధిక అనే మహిళా ఫిర్యాదు చేయడంతో ఆదిభట్ల పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఆయనపై సెక్షన్‌ 447, 427, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 6:50 PM IST

Updated : Apr 19, 2024, 8:01 PM IST

Land Grabbing Case On MP Candidate Chamala Kiran Kumar Reddy
Land Grabbing Case On MP Candidate

Land Grabbing Case On MP Candidate Chamala Kiran Kumar Reddy : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్​లో భూకబ్జా కేసు నమోదైంది. తుర్కయాంజల్ పరిధిలో కిరణ్‌ కుమార్ రెడ్డి భూమిని కబ్జా చేశారంటూ కంచర్ల రాధిక అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డిపై సెక్షన్ 447, 427, 506 కింద కేసు నమోదు చేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ సర్వే నెంబర్ 500, 501లో 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ రాధిక అనే మహిళ ఫిర్యాదు చేశారు.

వ్యక్తిని కిడ్నాప్‌ చేసి 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ - సైబర్‌క్రైమ్‌ ఏసీపీ, తలకొండపల్లి ఎమ్మార్వోపై కేసు నమోదు - Kidnapping case against ACP and Mro

Land Grabbing Case On Congress MP Candidate : 2003లోనే కిరణ్ కుమార్ రెడ్డి భూమి కొన్నట్లుగా డాక్యుమెంట్ ఉందని, అదే భూమి రాధిక అనే మహిళ పేరు మీద 2015లో డాక్యుమెంట్ అయినట్లుగా ఉందని సీఐ వివరణ ఇచ్చారు. ఈ ప్లాట్ ఇద్దరి పేరుపై ఉండటంతో ఎవరిపై నేరారోపణ చేయలేమని తెలిపారు. ప్లాట్​కు సంబందించిన కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ కేసుపై ఇద్దరి డాక్యుమెంట్స్ తీసుకొని పూర్తి విచారణ జరుపుతున్నామని ఇందులో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగాయా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.

"రాగన్నగూడ సర్వే నెంబర్ 500, 501లో 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ రాధిక అనే మహిళ ఫిర్యాదు చేశారు. రాధిక పేరు మీద రిజిష్టేషన్ 2015లో ఉంది. కోర్టు సూచన మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము.ఇదే భూమిలో 2003లోనే కిరణ్ కుమార్ రెడ్డి భూమి కొన్నట్లుగా డాక్యుమెంట్ ఉంది. ఈ ప్లాట్ ఇద్దరి పేరుపై ఉండటంతో ఎవరిపై నేరారోపణ చేయలేము. ఈ ప్లాట్​కు సంబందించిన కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు తీసుకొని దర్యాప్తు చేస్తున్నాము. అన్ని డాక్యుమెంట్లు పరిశీలన చేసిన తర్వాత ప్లాట్ ఎవరిదనేది తెేలుస్తాము." -సీఐ రాఘవేంద్ర రెడ్డి

కేసీఆర్‌ సోదరుడి కుమారుడు కన్నారావు అరెస్ట్ - చర్లపల్లి జైలుకు తరలింపు - Kalvakuntla Kanna Rao Arrested

'పక్కా ప్రణాళికతోనే ఆ అసైన్డ్‌ భూములను కాజేసేందుకు మాండ్ర శివానందరెడ్డి కుట్ర' - Budvel Assigned Lands Case

Land Grabbing Case On MP Candidate Chamala Kiran Kumar Reddy : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్​లో భూకబ్జా కేసు నమోదైంది. తుర్కయాంజల్ పరిధిలో కిరణ్‌ కుమార్ రెడ్డి భూమిని కబ్జా చేశారంటూ కంచర్ల రాధిక అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డిపై సెక్షన్ 447, 427, 506 కింద కేసు నమోదు చేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ సర్వే నెంబర్ 500, 501లో 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ రాధిక అనే మహిళ ఫిర్యాదు చేశారు.

వ్యక్తిని కిడ్నాప్‌ చేసి 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ - సైబర్‌క్రైమ్‌ ఏసీపీ, తలకొండపల్లి ఎమ్మార్వోపై కేసు నమోదు - Kidnapping case against ACP and Mro

Land Grabbing Case On Congress MP Candidate : 2003లోనే కిరణ్ కుమార్ రెడ్డి భూమి కొన్నట్లుగా డాక్యుమెంట్ ఉందని, అదే భూమి రాధిక అనే మహిళ పేరు మీద 2015లో డాక్యుమెంట్ అయినట్లుగా ఉందని సీఐ వివరణ ఇచ్చారు. ఈ ప్లాట్ ఇద్దరి పేరుపై ఉండటంతో ఎవరిపై నేరారోపణ చేయలేమని తెలిపారు. ప్లాట్​కు సంబందించిన కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ కేసుపై ఇద్దరి డాక్యుమెంట్స్ తీసుకొని పూర్తి విచారణ జరుపుతున్నామని ఇందులో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగాయా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.

"రాగన్నగూడ సర్వే నెంబర్ 500, 501లో 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ రాధిక అనే మహిళ ఫిర్యాదు చేశారు. రాధిక పేరు మీద రిజిష్టేషన్ 2015లో ఉంది. కోర్టు సూచన మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము.ఇదే భూమిలో 2003లోనే కిరణ్ కుమార్ రెడ్డి భూమి కొన్నట్లుగా డాక్యుమెంట్ ఉంది. ఈ ప్లాట్ ఇద్దరి పేరుపై ఉండటంతో ఎవరిపై నేరారోపణ చేయలేము. ఈ ప్లాట్​కు సంబందించిన కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు తీసుకొని దర్యాప్తు చేస్తున్నాము. అన్ని డాక్యుమెంట్లు పరిశీలన చేసిన తర్వాత ప్లాట్ ఎవరిదనేది తెేలుస్తాము." -సీఐ రాఘవేంద్ర రెడ్డి

కేసీఆర్‌ సోదరుడి కుమారుడు కన్నారావు అరెస్ట్ - చర్లపల్లి జైలుకు తరలింపు - Kalvakuntla Kanna Rao Arrested

'పక్కా ప్రణాళికతోనే ఆ అసైన్డ్‌ భూములను కాజేసేందుకు మాండ్ర శివానందరెడ్డి కుట్ర' - Budvel Assigned Lands Case

Last Updated : Apr 19, 2024, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.