ETV Bharat / state

కొండ నాలుకకు మందేస్తే - ఉన్న నాలిక ఊడినట్లుంది : కేటీఆర్ - KTR Tweet On Pension Recovery

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 1:23 PM IST

KTR Fires On Revanth Govt : కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలిక ఊడినట్లుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని చెప్పి, ఓ వృద్ధురాలి నుంచి పింఛన్ లాక్కుంటున్నారని మండిపడ్డారు. పింఛన్​ కింద వచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ కొత్తగూడెం జిల్లాలో ఓ వృద్ధురాలికి వచ్చిన నోటీసులపై ఆయన ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు.

KTR Fires On Revanth Govt
KTR Tweet On Pension Recovery (ETV Bharat)

KTR Tweet On Pension Recovery : కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలిక ఊడినట్లుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొత్తగూడెం జిల్లాలో ఓ వృద్ధురాలు పింఛన్ కింద వచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలన్న నోటీసులపై ఆయన ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో దొంగ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలు పెట్టిందని ఆక్షేపించారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ, వేలాది మంది ఆసరా పింఛన్​ లబ్దిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.

KTR Comments On Congress : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పింఛన్ కింద వచ్చిన రూ.1.72 లక్షలను వెనక్కి కట్టాలని నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పింఛన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని, లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని కేటీఆర్ హెచ్చరించారు.

పెన్షన్ తిరిగి ఇవ్వాలని నోటీసులు : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా చేయూత పథకం కింద వృద్ధుల పింఛన్ రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇంకా ఆ హామీ అమలు కాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు పలుమార్లు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, వృద్ధుల పింఛన్ పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి, ఓ వృద్ధురాలి నుంచి ఉన్న పింఛన్ తిరిగి చెల్లించాలన్న నోటీసులపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

సీఎంకు దిల్లీ చక్కర్లు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడమే తెలుసు - ప్రజలు అవసరం లేదు : కేటీఆర్​ - ktr tweet Gopanpally flyover issue

'ప్రభుత్వాన్ని విమర్శిస్తే కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారా' - డీజీపీకి మాజీ మంత్రుల ట్వీట్​ - KTR and Harish on Police Behavior

KTR Tweet On Pension Recovery : కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలిక ఊడినట్లుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొత్తగూడెం జిల్లాలో ఓ వృద్ధురాలు పింఛన్ కింద వచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలన్న నోటీసులపై ఆయన ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో దొంగ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలు పెట్టిందని ఆక్షేపించారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ, వేలాది మంది ఆసరా పింఛన్​ లబ్దిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.

KTR Comments On Congress : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పింఛన్ కింద వచ్చిన రూ.1.72 లక్షలను వెనక్కి కట్టాలని నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పింఛన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని, లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని కేటీఆర్ హెచ్చరించారు.

పెన్షన్ తిరిగి ఇవ్వాలని నోటీసులు : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా చేయూత పథకం కింద వృద్ధుల పింఛన్ రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇంకా ఆ హామీ అమలు కాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు పలుమార్లు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, వృద్ధుల పింఛన్ పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి, ఓ వృద్ధురాలి నుంచి ఉన్న పింఛన్ తిరిగి చెల్లించాలన్న నోటీసులపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

సీఎంకు దిల్లీ చక్కర్లు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడమే తెలుసు - ప్రజలు అవసరం లేదు : కేటీఆర్​ - ktr tweet Gopanpally flyover issue

'ప్రభుత్వాన్ని విమర్శిస్తే కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారా' - డీజీపీకి మాజీ మంత్రుల ట్వీట్​ - KTR and Harish on Police Behavior

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.