ETV Bharat / state

మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - బీఆర్​ఎస్​ జడ్పీ ఛైర్మన్ మధ్య మాటల యుద్ధం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 5:57 PM IST

Komatireddy Venkat Reddy vs ZP Chairman : ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని బీఆర్​ఎస్​ నేత యాదాద్రి భువనగిరి జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి ఆరోపించారు. గతంలో రైతుబంధు విషయంలో మాట్లాడిన మాటలకు జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నెలకొంది.

ZP Chairman Sandeep Reddy Comments On Congress
Komatireddy Venkat Reddy vs ZP Chairman

Komatireddy Venkat Reddy vs ZP Chairman : ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతుబంధు అడిగిన వారిని చెప్పుతో కొట్టాలని అనడం సరైనది కాదు అని బీఆర్​ఎస్​ జడ్పీ ఛైర్మన్​ సందీప్ రెడ్డి అన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం తొమ్మిది దఫాలుగా రైతుబంధు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్​ నాయకులు డిసెంబర్​ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుబంధు పది వేలు కాదు రూ.15,000 ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

ZP Chairman Sandeep Reddy Comments On Congress : పెన్షన్ రెండు వేలు కాకుండా రూ.4000 ఇస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం హామీ ఇచ్చిందని బీఆర్​ఎస్​ జడ్పీఛైర్మన్ సందీప్ రెడ్డి గుర్తుచేశారు. రైతులు తీసుకున్న రుణాలు 9వ తేదీన మాఫీ చేస్తామన్న కాంగ్రెస్​(Congress) నాయకులు, తిరిగి రైతులను తిట్టడం భావ్యం కాదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్​ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని, సందీప్​ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్​ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ నినాదాలు చేశారు.

అనంతరం సందీప్​రెడ్డి చేసిన విమర్శలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఖండిస్తూ తల్లితండ్రుల పేరుతో జడ్పీ ఛైర్మన్ అయిన వ్యక్తి తన ముందు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో సభలో కొద్దిసేపటి వరకు గందరగోళం నెలకొంది. దీంతో జడ్పీఛైర్మన్​ సందీప్​రెడ్డిని సభ నుంచి బయటకు పంపాలని పోలీసులకు మంత్రి ఆదేశాలిచ్చారు. వెంటనే పోలీసులు సందీప్ రెడ్డిని సమావేశం నుంచి బయటకు పంపించారు.

Komatireddy Venkat Reddy Fires on KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్(KCR) కాలిగోటికి కూడా సరిపోరని కేటీఆర్ అంటున్నారని, కానీ అదే రేవంత్ రెడ్డి, కేసీఆర్​ను ఫామ్ హౌస్​లో పడుకోబెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. అంతకముందు మంత్రి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని, మహదేవ్ పురంలో మినీ బస్​స్టాండ్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోని మహదేవ్​పురంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాట్లాడారు.

'మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను ఉద్యమంలో ఉన్నాను. ఆ సమయంలో కేటీఆర్(KTR) నువ్వు అమెరికాలో ఉన్నావు, మీ నాన్నపేరు చెప్పి దొంగ మాటలు చెప్పుకుంటూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యావు. రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్​గా గెలిచారు. నేను ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. ప్రస్తుతం నా పార్టీని సమిష్టిగా ముందుకు తీసుకెళ్తున్నా-' మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

'కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సబబు కాదు. దీనిపై పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తాం' - సందీప్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - బీఆర్​ఎస్​ జడ్పీ ఛైర్మన్ మధ్య మాటలయుద్ధం

పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - హస్తం పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్న గులాబీ నేతలు

'మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది - ఏ పార్టీవారైనా సీఎంను కలవొచ్చు'

Komatireddy Venkat Reddy vs ZP Chairman : ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతుబంధు అడిగిన వారిని చెప్పుతో కొట్టాలని అనడం సరైనది కాదు అని బీఆర్​ఎస్​ జడ్పీ ఛైర్మన్​ సందీప్ రెడ్డి అన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం తొమ్మిది దఫాలుగా రైతుబంధు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్​ నాయకులు డిసెంబర్​ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుబంధు పది వేలు కాదు రూ.15,000 ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

ZP Chairman Sandeep Reddy Comments On Congress : పెన్షన్ రెండు వేలు కాకుండా రూ.4000 ఇస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం హామీ ఇచ్చిందని బీఆర్​ఎస్​ జడ్పీఛైర్మన్ సందీప్ రెడ్డి గుర్తుచేశారు. రైతులు తీసుకున్న రుణాలు 9వ తేదీన మాఫీ చేస్తామన్న కాంగ్రెస్​(Congress) నాయకులు, తిరిగి రైతులను తిట్టడం భావ్యం కాదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్​ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని, సందీప్​ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్​ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ నినాదాలు చేశారు.

అనంతరం సందీప్​రెడ్డి చేసిన విమర్శలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఖండిస్తూ తల్లితండ్రుల పేరుతో జడ్పీ ఛైర్మన్ అయిన వ్యక్తి తన ముందు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో సభలో కొద్దిసేపటి వరకు గందరగోళం నెలకొంది. దీంతో జడ్పీఛైర్మన్​ సందీప్​రెడ్డిని సభ నుంచి బయటకు పంపాలని పోలీసులకు మంత్రి ఆదేశాలిచ్చారు. వెంటనే పోలీసులు సందీప్ రెడ్డిని సమావేశం నుంచి బయటకు పంపించారు.

Komatireddy Venkat Reddy Fires on KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్(KCR) కాలిగోటికి కూడా సరిపోరని కేటీఆర్ అంటున్నారని, కానీ అదే రేవంత్ రెడ్డి, కేసీఆర్​ను ఫామ్ హౌస్​లో పడుకోబెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. అంతకముందు మంత్రి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని, మహదేవ్ పురంలో మినీ బస్​స్టాండ్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోని మహదేవ్​పురంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాట్లాడారు.

'మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను ఉద్యమంలో ఉన్నాను. ఆ సమయంలో కేటీఆర్(KTR) నువ్వు అమెరికాలో ఉన్నావు, మీ నాన్నపేరు చెప్పి దొంగ మాటలు చెప్పుకుంటూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యావు. రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్​గా గెలిచారు. నేను ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. ప్రస్తుతం నా పార్టీని సమిష్టిగా ముందుకు తీసుకెళ్తున్నా-' మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

'కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సబబు కాదు. దీనిపై పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తాం' - సందీప్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - బీఆర్​ఎస్​ జడ్పీ ఛైర్మన్ మధ్య మాటలయుద్ధం

పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - హస్తం పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్న గులాబీ నేతలు

'మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది - ఏ పార్టీవారైనా సీఎంను కలవొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.