ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ : కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడిని విచారించనున్న జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్ - JUSTICE GHOSE on KALESHWARAM

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 4:29 PM IST

Kaleshwaram Project Latest News : కాళేశ్వరం ఆనకట్టలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ వేగం పెంచింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరెను విచారించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయనను విచారణకు రావాలని రెండు తేదీలను ఫిక్స్​ చేసింది.

Justice PC Ghose Commission on Kaleshwaram Project
Justice PC Ghose Commission on Kaleshwaram Project (ETV Bharat)

Justice PC Ghose Commission on Kaleshwaram Project : కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె నుంచి వివరాలు, సమాచారం తీసుకోనుంది. ఈ మేరకు శుక్రవారం లేదా సోమవారం రావాలని ఆయనను కమిషన్​ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ప్రజెంటేషన్​ ఇవ్వడంతో పాటు పత్రికల్లో కథనాలు, వివిధ సందర్భాల్లో శ్రీరాం వెదిరె మాట్లాడిన నేపథ్యంలో జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ఆయన నుంచి సమాచారం, వివరాలు తీసుకోవాలని భావిస్తున్నారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా పని చేసిన అధికారులను కూడా కమిషన్​ విచారణకు పిలవనుంది. సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్​ఏ, సీడబ్ల్యూపీఆర్​ఎస్​, వ్యాప్కోస్​ తదితర సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలిచే ఆలోచనలో కమిషన్​ ఉంది. నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించిన జస్టిస్​ పీసీ ఘోష్​ అందులోని కొన్ని అంశాలపై వివరణ కోరింది. తమకు కొన్ని డాక్యుమెంట్లు కావాలని నిపుణుల కమిటీ కోరింది. నిపుణులకు ఆ డాక్యుమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషన్​ సూచించింది.

కాళేశ్వరం ఆనకట్టల పనుల్లో సబ్​ కాంట్రాక్టర్లు కూడా పనులు చేసినట్లు కమిషన్​ దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఒక సంస్థలో పని చేసిన ఓ వ్యక్తి ప్రాజెక్టు పనుల సమయంలో విభేదించి బయటకు వెళ్లారని, ఆయనతో పాటు ఇతరులను కూడా పిలిచే యోచనలో కమిషన్​ ఉంది. నేడు జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ముందు 20 డిప్యూటీ ఈఈలు, ఇద్దరు అకౌంటెంట్​ ఆఫీసర్లు హాజరయ్యారు. వారి నుంచి అవసరమైన వివరాలు, సమాచారం తీసుకున్న కమిషన్​ ఆ అంశాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బుధవారం ఏఈఈలు జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ముందు హాజరుకానున్నారు.

Justice PC Ghose Commission on Kaleshwaram Project : కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె నుంచి వివరాలు, సమాచారం తీసుకోనుంది. ఈ మేరకు శుక్రవారం లేదా సోమవారం రావాలని ఆయనను కమిషన్​ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ప్రజెంటేషన్​ ఇవ్వడంతో పాటు పత్రికల్లో కథనాలు, వివిధ సందర్భాల్లో శ్రీరాం వెదిరె మాట్లాడిన నేపథ్యంలో జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ఆయన నుంచి సమాచారం, వివరాలు తీసుకోవాలని భావిస్తున్నారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా పని చేసిన అధికారులను కూడా కమిషన్​ విచారణకు పిలవనుంది. సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్​ఏ, సీడబ్ల్యూపీఆర్​ఎస్​, వ్యాప్కోస్​ తదితర సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలిచే ఆలోచనలో కమిషన్​ ఉంది. నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించిన జస్టిస్​ పీసీ ఘోష్​ అందులోని కొన్ని అంశాలపై వివరణ కోరింది. తమకు కొన్ని డాక్యుమెంట్లు కావాలని నిపుణుల కమిటీ కోరింది. నిపుణులకు ఆ డాక్యుమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషన్​ సూచించింది.

కాళేశ్వరం ఆనకట్టల పనుల్లో సబ్​ కాంట్రాక్టర్లు కూడా పనులు చేసినట్లు కమిషన్​ దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఒక సంస్థలో పని చేసిన ఓ వ్యక్తి ప్రాజెక్టు పనుల సమయంలో విభేదించి బయటకు వెళ్లారని, ఆయనతో పాటు ఇతరులను కూడా పిలిచే యోచనలో కమిషన్​ ఉంది. నేడు జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ముందు 20 డిప్యూటీ ఈఈలు, ఇద్దరు అకౌంటెంట్​ ఆఫీసర్లు హాజరయ్యారు. వారి నుంచి అవసరమైన వివరాలు, సమాచారం తీసుకున్న కమిషన్​ ఆ అంశాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బుధవారం ఏఈఈలు జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ముందు హాజరుకానున్నారు.

కాళేశ్వరం పంపుహౌస్‌లపైనా పీసీ ఘోష్ కమిషన్ విచారణ - ఇంజినీర్లు, గుత్తేదారులకు నోటీసులు - PC GHOSH COMMISSION ON KALESHWARAM

మేడిగడ్డలో ఆనకట్ట నిర్మాణం ఆలోచన కేసీఆర్​దే - కమిషన్​కు వెల్లడించిన విశ్రాంత ఇంజినీర్లు - Ghose Meeting Retired Engineers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.