ETV Bharat / state

హైదరాబాద్​లోని పర్యాటక ప్రదేశాలతో పాటు యాదాద్రి దర్శనం - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ! - IRCTC Taste of Telangana Tour

IRCTC Tour Packages: హైదరాబాద్‌లోని టూరిస్ట్ స్పాట్స్ కవర్ చేస్తూ IRCTC టూరిజం కొత్త ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌ వాసులతో పాటు భాగ్యనగరానికి వచ్చే పర్యాటకులకు ఈ టూర్ ప్యాకేజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి, ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 6:25 PM IST

IRCTC Taste of Telangana Tour Package
IRCTC Tour Package (ETV Bharat)

IRCTC Taste of Telangana Tour Package: ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ పలు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అందుబాటు ధరలోనే ఈ ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తోంది. తాజాగా హైదరాబాద్​లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని చూసేందుకు వీలుగా ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీలో ఏఏ ప్రాంతాలు కవర్​ అవుతాయి? ధర ఎంత? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

IRCTC టేస్ట్‌ ఆఫ్‌ తెలంగాణ(Taste of Telangana) పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్​లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు యాదాద్రి, రామోజీ ఫిల్మ్‌ సిటీ కూడా దీనిలో కవర్​ అవుతాయి. వీకెండ్‌లో ఏదైనా టూర్‌ ప్లాన్‌ చేసే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. మూడు రాత్రుళ్లు, నాలుగు పగళ్లు ఉండే ఈ టేస్ట్‌ ఆఫ్‌ తెలంగాణ టూర్ ప్యాకేజీ మంగళవారం, శనివారం తప్పించి మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటుంది.

ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను పికప్​ చేసుకుని.. ముందుగానే బుక్​ చేసిన హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్లో ఫ్రెషప్​ తర్వాత చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్​ను విజిట్​ చేయవచ్చు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి భోజనంతో పాటు అక్కడే స్టే ఉంటుంది.
  • రెండో రోజు హోటల్లో బ్రేక్​ఫాస్ట్ చేశాక.. బిర్లా మందిర్, గోల్కొండ కోట సందర్శిస్తారు. మధ్యాహ్నం లంచ్​ తర్వాత అంబేడ్కర్​ విగ్రహం సహా చుట్టు పక్కల ప్రదేశాలను విజిట్ చేస్తారు. సాయంత్రానికి హోటల్​కి చేరి.. రాత్రి భోజనం చేసి, అక్కడే స్టే చేస్తారు.
  • మూడో రోజు హోటల్లో బ్రేక్​ఫాస్ట్ అనంతరం యాదాద్రికి బయలుదేరుతారు. అక్కడ నరసింహ స్వామి దర్శనం చేసుకుని సురేంద్రపురి సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్​కి తిరిగి వచ్చి రాత్రికి హోటల్లో డిన్నర్ చేసి అక్కడే బస చేస్తారు.
  • నాలుగో రోజు ఉదయం టిఫెన్​ తిన్నాక.. రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్​ ఉంటుంది. సాయంత్రం మళ్లీ హైదరాబాద్/సికింద్రాబాద్/కాచీగూడ రైల్వే స్టేషన్​కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

అటు శ్రీశైల మల్లన్న - ఇటు యాదాద్రి నరసింహ​ - తక్కువ ధరకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! పైగా ఈ ప్లేస్​లు కూడా!

ప్యాకేజీ ధరలు ఇలా..

  • ఒక్కరు లేదా ఇద్దరు, ముగ్గురు కలిసి వెళ్తే.. సింగిల్​ షేరింగ్​కి రూ. 30,390 ఛార్జ్ చేస్తారు. డబుల్​ షేరింగ్​కు రూ. 16,130, ట్రిపుల్​ షేరింగ్​ కోసం రూ. 12,610 నిర్ణయించారు. ఇక ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు విత్​ బెడ్​తో రూ. 8,350 నిర్ణయించారు.
  • నలుగురు నుంచి ఆరుగురుకి.. డబుల్ షేరింగ్ అయితే రూ.13,080, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.11,410 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు రూ. 8,350 ఛార్జ్​ చేస్తారు.

ప్యాకేజీలో కవరయ్యేవి..

  • హైదరాబాద్​లో ఏసీ వసతి సౌకర్యం కల్పిస్తారు. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు. లోకల్ ప్రయాణాలకు ఏసీ వాహనాన్ని అందిస్తారు. ట్రావెల్ ఇన్సురెన్స్ అందిస్తారు.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

బ్యాంకాక్ చూసొద్దామా బాసూ..? - IRCTC సూపర్ ప్యాకేజీ! - సఫారీ వరల్డ్ టూర్ కూడా! - IRCTC Treasures of Thailand Ex Hyd

IRCTC Taste of Telangana Tour Package: ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ పలు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అందుబాటు ధరలోనే ఈ ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తోంది. తాజాగా హైదరాబాద్​లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని చూసేందుకు వీలుగా ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీలో ఏఏ ప్రాంతాలు కవర్​ అవుతాయి? ధర ఎంత? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

IRCTC టేస్ట్‌ ఆఫ్‌ తెలంగాణ(Taste of Telangana) పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్​లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు యాదాద్రి, రామోజీ ఫిల్మ్‌ సిటీ కూడా దీనిలో కవర్​ అవుతాయి. వీకెండ్‌లో ఏదైనా టూర్‌ ప్లాన్‌ చేసే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. మూడు రాత్రుళ్లు, నాలుగు పగళ్లు ఉండే ఈ టేస్ట్‌ ఆఫ్‌ తెలంగాణ టూర్ ప్యాకేజీ మంగళవారం, శనివారం తప్పించి మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటుంది.

ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను పికప్​ చేసుకుని.. ముందుగానే బుక్​ చేసిన హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్లో ఫ్రెషప్​ తర్వాత చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్​ను విజిట్​ చేయవచ్చు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి భోజనంతో పాటు అక్కడే స్టే ఉంటుంది.
  • రెండో రోజు హోటల్లో బ్రేక్​ఫాస్ట్ చేశాక.. బిర్లా మందిర్, గోల్కొండ కోట సందర్శిస్తారు. మధ్యాహ్నం లంచ్​ తర్వాత అంబేడ్కర్​ విగ్రహం సహా చుట్టు పక్కల ప్రదేశాలను విజిట్ చేస్తారు. సాయంత్రానికి హోటల్​కి చేరి.. రాత్రి భోజనం చేసి, అక్కడే స్టే చేస్తారు.
  • మూడో రోజు హోటల్లో బ్రేక్​ఫాస్ట్ అనంతరం యాదాద్రికి బయలుదేరుతారు. అక్కడ నరసింహ స్వామి దర్శనం చేసుకుని సురేంద్రపురి సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్​కి తిరిగి వచ్చి రాత్రికి హోటల్లో డిన్నర్ చేసి అక్కడే బస చేస్తారు.
  • నాలుగో రోజు ఉదయం టిఫెన్​ తిన్నాక.. రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్​ ఉంటుంది. సాయంత్రం మళ్లీ హైదరాబాద్/సికింద్రాబాద్/కాచీగూడ రైల్వే స్టేషన్​కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

అటు శ్రీశైల మల్లన్న - ఇటు యాదాద్రి నరసింహ​ - తక్కువ ధరకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! పైగా ఈ ప్లేస్​లు కూడా!

ప్యాకేజీ ధరలు ఇలా..

  • ఒక్కరు లేదా ఇద్దరు, ముగ్గురు కలిసి వెళ్తే.. సింగిల్​ షేరింగ్​కి రూ. 30,390 ఛార్జ్ చేస్తారు. డబుల్​ షేరింగ్​కు రూ. 16,130, ట్రిపుల్​ షేరింగ్​ కోసం రూ. 12,610 నిర్ణయించారు. ఇక ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు విత్​ బెడ్​తో రూ. 8,350 నిర్ణయించారు.
  • నలుగురు నుంచి ఆరుగురుకి.. డబుల్ షేరింగ్ అయితే రూ.13,080, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.11,410 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు రూ. 8,350 ఛార్జ్​ చేస్తారు.

ప్యాకేజీలో కవరయ్యేవి..

  • హైదరాబాద్​లో ఏసీ వసతి సౌకర్యం కల్పిస్తారు. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు. లోకల్ ప్రయాణాలకు ఏసీ వాహనాన్ని అందిస్తారు. ట్రావెల్ ఇన్సురెన్స్ అందిస్తారు.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

బ్యాంకాక్ చూసొద్దామా బాసూ..? - IRCTC సూపర్ ప్యాకేజీ! - సఫారీ వరల్డ్ టూర్ కూడా! - IRCTC Treasures of Thailand Ex Hyd

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.