ETV Bharat / state

ప్రకృతి సోయగాలు, మైమరిపించే అందాలు - భూమికి పచ్చని రంగేసినట్టుగా ఇందూరు - Indur Reveling in Beauty of Nature

Indur Reveling in Beauty of Nature Nizamabad : ప్రకృతి సోయగాలు, మైమరిపించే అందాలు మనసును ఉల్లాస పరిచే పచ్చని చెట్లు, వాటి మధ్యలో గుట్టలు. మనసును హత్తుకునే ఆహ్లాదకర వాతావరణం. ఇవన్నీ చెప్పగానే అరకు, ఊటీ అని పొరబడితే తప్పు. ఇలాంటి ప్రకృతి అందాలే మన రాష్ట్రంలోనూ కనువిందుచేస్తున్నాయి. వింటుంటూనే వెళ్లాలనిపిస్తోంది కదూ! అయితే పదండి మన ఇందూరు అందాలను వీక్షిద్దాం.

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 4:53 PM IST

Updated : Aug 14, 2024, 5:07 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Indur Reveling in Beauty of Nature Nizamabad Dist : వాన చినుకులు పడుతుండగా పచ్చని ప్రకృతిలో ఎత్తైన కొండల మధ్య విహరిస్తే ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా! ప్రకృతి అందాలు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అరకు. అలాంటి ప్రకృతి అందాలే మన రాష్ట్రంలోనూ కనువిందుచేస్తున్నాయి. చుట్టూ పచ్చని చెట్లు వాటి మధ్యలో గుట్టలు . మనసును హత్తుకునే ఆహ్లాదకర వాతావరణం. కనుచూపు మేర భూమికి రంగేసినట్లు కనిపించే వివిధ రకాల ఉద్యాన పంటలు. వింటుంటూనే వెళ్లాలనిపిస్తోంది కదూ! అయితే పదండి మన ఇందూరు అందాలను వీక్షిద్దాం.

భూమికి పచ్చని రంగేసినట్టుగా గుట్టలు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పకృతి అందాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. ఎటు చూసినా కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ మార్గంలో ప్రయాణం అరకు అనుభూతిని కలిగిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి గిరిజన తండాల్లో ప్రజలు గుట్టలను చదును చేసి పంటలు పండించడంతో ఎటు చూసినా పచ్చదనమే దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఈ గుట్టలన్నీ భూమికి పచ్చని రంగేసినట్టుగానే కనిపిస్తున్నాయి. ఆ సోయగాన్ని చూసేకొద్దీ మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోంది.

ప్రకృతి అందాలను పరవశించేలా వృక్షాలు : నిజామాబాద్ జిల్లా మోపాల్, కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలాలకు వెళ్లే దారంతా ప్రకృతి రమణీయ దృశ్యాలే కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలోని గిరిజన తండాలు ఎత్తైన కొండల మధ్య ఉంటాయి. ఇక్కడ గిరిజనలు వివిధ రకాల ఆరు తడి పంటలను సాగు చేస్తుంటారు. ఇక పెద్ద పెద్ద వృక్షాలు ప్రకృతి అందాలను పరవశించేలా మైమరిపిస్తుంటాయి. ఈ దారి గుండా వెళ్తుంటే పకృతి రమణీయత స్వాగతం పలుకుతోంది. రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు ఇట్టే కట్టిపడేస్తుంటాయి. ఇవి పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.

రహదారులను చూస్తే ఫిదా : ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతమంతా కొత్త అందాలను సంతరించుకుంది. ఈ తండాలకు వెళ్లే రహదారులను చూస్తే వాహనదారులే ఫిదా అవుతున్నారు. పచ్చని వాతావరణం తమకు ఎనలేని ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతుందని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రకృతి అందాలను వీక్షించే వారికి ఇందూరు అందాలు మరిచిపోలేని అనుభూతినిస్తాయనడంలో సందేహం లేదు.

భారీ వర్షాలతో ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న జలపాతాలు - మురిసిపోతున్న ప్రకృతి ప్రేమికులు - GOURIGUNDALA Water FALLS

Kerala Tourism: సరికొత్తగా "కేరళ టూరిజం".. ఏడాది పొడవునా పర్యాటకులకు ఆతిథ్యం

Indur Reveling in Beauty of Nature Nizamabad Dist : వాన చినుకులు పడుతుండగా పచ్చని ప్రకృతిలో ఎత్తైన కొండల మధ్య విహరిస్తే ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా! ప్రకృతి అందాలు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అరకు. అలాంటి ప్రకృతి అందాలే మన రాష్ట్రంలోనూ కనువిందుచేస్తున్నాయి. చుట్టూ పచ్చని చెట్లు వాటి మధ్యలో గుట్టలు . మనసును హత్తుకునే ఆహ్లాదకర వాతావరణం. కనుచూపు మేర భూమికి రంగేసినట్లు కనిపించే వివిధ రకాల ఉద్యాన పంటలు. వింటుంటూనే వెళ్లాలనిపిస్తోంది కదూ! అయితే పదండి మన ఇందూరు అందాలను వీక్షిద్దాం.

భూమికి పచ్చని రంగేసినట్టుగా గుట్టలు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పకృతి అందాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. ఎటు చూసినా కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ మార్గంలో ప్రయాణం అరకు అనుభూతిని కలిగిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి గిరిజన తండాల్లో ప్రజలు గుట్టలను చదును చేసి పంటలు పండించడంతో ఎటు చూసినా పచ్చదనమే దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఈ గుట్టలన్నీ భూమికి పచ్చని రంగేసినట్టుగానే కనిపిస్తున్నాయి. ఆ సోయగాన్ని చూసేకొద్దీ మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోంది.

ప్రకృతి అందాలను పరవశించేలా వృక్షాలు : నిజామాబాద్ జిల్లా మోపాల్, కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలాలకు వెళ్లే దారంతా ప్రకృతి రమణీయ దృశ్యాలే కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలోని గిరిజన తండాలు ఎత్తైన కొండల మధ్య ఉంటాయి. ఇక్కడ గిరిజనలు వివిధ రకాల ఆరు తడి పంటలను సాగు చేస్తుంటారు. ఇక పెద్ద పెద్ద వృక్షాలు ప్రకృతి అందాలను పరవశించేలా మైమరిపిస్తుంటాయి. ఈ దారి గుండా వెళ్తుంటే పకృతి రమణీయత స్వాగతం పలుకుతోంది. రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు ఇట్టే కట్టిపడేస్తుంటాయి. ఇవి పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.

రహదారులను చూస్తే ఫిదా : ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతమంతా కొత్త అందాలను సంతరించుకుంది. ఈ తండాలకు వెళ్లే రహదారులను చూస్తే వాహనదారులే ఫిదా అవుతున్నారు. పచ్చని వాతావరణం తమకు ఎనలేని ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతుందని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రకృతి అందాలను వీక్షించే వారికి ఇందూరు అందాలు మరిచిపోలేని అనుభూతినిస్తాయనడంలో సందేహం లేదు.

భారీ వర్షాలతో ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న జలపాతాలు - మురిసిపోతున్న ప్రకృతి ప్రేమికులు - GOURIGUNDALA Water FALLS

Kerala Tourism: సరికొత్తగా "కేరళ టూరిజం".. ఏడాది పొడవునా పర్యాటకులకు ఆతిథ్యం

Last Updated : Aug 14, 2024, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.