ETV Bharat / state

'వేసిన విత్తనం మొలకెత్తడం లేదు - మొలకెత్తిన మొలకలు బతకడం లేదు' - Cotton Farmers Problems

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 11:04 AM IST

Updated : Jun 24, 2024, 11:15 AM IST

Cotton Farmers Problems in Mahabubnagar : వేసిన విత్తనం మొలకెత్తడం లేదు. మొలకెత్తిన మొలకలు బతకడం లేదు. మొలకెత్తకుండా పాడైన విత్తుల్ని తీసేసి మళ్లీ విత్తనాలు నాటినా, అవీ బతుకుతాయన్న విశ్వాసం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ఇది. జిల్లావ్యాప్తంగా 3 మండలాల్లో తప్ప, మరెక్కడా వర్షపాతం లేదు. నాటిన విత్తనాలు కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు.

Cotton Farmers Problems in Mahabubnagar
Farmers Facing Problems Due To No Rains in Mahabubnagar (ETV Bharat)

Farmers Facing Problems Due To No Rains in Mahabubnagar : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలకరి వానలు కురవగానే పొలాల్ని దున్ని విత్తనాలు వేసిన రైతులు, ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలకరి వానలు జూన్ ప్రారంభంలోనే పలకరించాయి. పంటలు సాగు చేసుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. దీంతో రైతులు పత్తి వైపు మొగ్గు చూపారు. 10 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సైతం అంచనా వేశారు. కానీ మొదట్లో కురిసి, ఆ తర్వాత వానలు లేకుండా పోవడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

చాలా చోట్ల వేసిన విత్తనాలకు సరిపడా తడి అందకపోవడంతో అవి మొలకెత్తడం లేదు. మొలకెత్తిన చోట వానల్లేక మొలకలు వాడిపోతుతున్నాయి. కొందరు మళ్లీ విత్తనాలు నాటినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో రైతులు వరుణుడు కరుణిస్తాడేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. వారం పాటు ఇవే పరిస్థితులు ఉంటే ప్రత్యామ్నాయ పంట వైపు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.

వేసిన విత్తనాలు మొలకెత్తక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. సొంతంగా పొలం ఉన్న వారు ఇప్పటిదాకా ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కౌలుకు తీసుకున్న రైతులు కౌలుతో పాటు పెట్టుబడినీ కోల్పోతున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్దామన్నా, తిరిగి మళ్లీ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. వానల్లేకుంటే అవి కూడా మొలకెత్తుతాయన్న నమ్మకం లేదు. అందుకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు వానజాడ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

బోరు నీళ్లతో పంటలను కాపాడుకుంటూ : వాన జాడ లేకపోవడంతో వేసిన పంటల్ని రక్షించుకునేందుకు అన్నదాతలు నానాతంటాలు పడుతున్నారు. వానల్లేక భూగర్భ జలాలూ అడుగంటాయి. బోర్లు అక్కడక్కడా అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఉన్న బోరునీళ్లతో సగం పంటనైనా కాపాడుకునేందుకు పైపులు కొనుగోలు చేసి తుంపర సేద్యం ద్వారా కొందరు నీళ్లందిస్తున్నారు. పంటను వేసేందుకు పెట్టిన పెట్టుబడి ఒక ఎత్తైతే, దానికి నీళ్లందించి కాపాడుకునేందుకు అవుతున్న ఖర్చు మరో ఎత్తని రైతులు వాపోతున్నారు.

Crop Damage in Mahabubnagar : వానలు లేక ఎండిపోతున్న పంట.. మళ్లీ రైతన్నకు తప్పని ఇబ్బందులు

గతేడాది వానలు సరిగ్గా కురవకపోవడంతో చెరువులు, కుంటలు, జలాశయాల్లోనూ నీళ్లు అందుబాటులో లేకుండా పోయాయి. జూరాల, కేఎల్ఐ, కోయల్ సాగర్, నెట్టెంపాడు లాంటి ఎత్తిపోతల పథకాల ద్వారా నీరందేందుకు చాలా సమయం పట్టేలా ఉంది. అప్పటి వరకూ పంటల్ని కాపాడుకోవడం కర్షకులకు కష్టంగా మారేలా ఉంది. వారం, పది రోజులుగా వర్షాలు ముఖం చాటేయటంతో జొన్న, కంది, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలు సైతం ఎండుతున్నాయి. నీళ్లు లేక వరి సాగే మొదలు కాలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వానాకాలంలో సాధారణ సాగు 18 లక్షల ఎకరాలుంటే, ఇప్పటి వరకు 30 నుంచి 40 శాతం వరకే పంటలు వేశారు. వాటిలో అత్యధికంగా 2 నుంచి 3 లక్షల ఎకరాల వరకూ పత్తి సాగైంది.

వ్యవసాయ అధికారుల సూచనలు : వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. జొన్న, కంది, పత్తి మొక్కల వేర్లు లోతుగా భూమిలోకి వెళ్తాయని, మరో నాలుగైదు రోజుల్లో వర్షాలు పడితే తిరిగి పుంజుకుంటాయంటున్నారు. లోతు దుక్కులు పూర్తిగా తడిసిన తర్వాత మాత్రమే విత్తనాలు విత్తుకోవాలని సూచిస్తున్నారు. మొక్కజొన్న, కంది, ఆముదం వంటి పంటల సాగుకు ఇంకా సమయం ఉంది. వరి సాగుకు మరో రెండు మాసాల సమయం పట్టనుంది.

Cotton Farmers Problems in Telangana : వరుణదేవా.. కరుణించరా.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటంతా..!

NO RAINS: ఊరించి ఉసూరుమనిపించిన వరుణుడు.. లబోదిబోమంటున్న రైతన్న

Farmers Facing Problems Due To No Rains in Mahabubnagar : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలకరి వానలు కురవగానే పొలాల్ని దున్ని విత్తనాలు వేసిన రైతులు, ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలకరి వానలు జూన్ ప్రారంభంలోనే పలకరించాయి. పంటలు సాగు చేసుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. దీంతో రైతులు పత్తి వైపు మొగ్గు చూపారు. 10 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సైతం అంచనా వేశారు. కానీ మొదట్లో కురిసి, ఆ తర్వాత వానలు లేకుండా పోవడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

చాలా చోట్ల వేసిన విత్తనాలకు సరిపడా తడి అందకపోవడంతో అవి మొలకెత్తడం లేదు. మొలకెత్తిన చోట వానల్లేక మొలకలు వాడిపోతుతున్నాయి. కొందరు మళ్లీ విత్తనాలు నాటినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో రైతులు వరుణుడు కరుణిస్తాడేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. వారం పాటు ఇవే పరిస్థితులు ఉంటే ప్రత్యామ్నాయ పంట వైపు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.

వేసిన విత్తనాలు మొలకెత్తక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. సొంతంగా పొలం ఉన్న వారు ఇప్పటిదాకా ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కౌలుకు తీసుకున్న రైతులు కౌలుతో పాటు పెట్టుబడినీ కోల్పోతున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్దామన్నా, తిరిగి మళ్లీ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. వానల్లేకుంటే అవి కూడా మొలకెత్తుతాయన్న నమ్మకం లేదు. అందుకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు వానజాడ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

బోరు నీళ్లతో పంటలను కాపాడుకుంటూ : వాన జాడ లేకపోవడంతో వేసిన పంటల్ని రక్షించుకునేందుకు అన్నదాతలు నానాతంటాలు పడుతున్నారు. వానల్లేక భూగర్భ జలాలూ అడుగంటాయి. బోర్లు అక్కడక్కడా అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఉన్న బోరునీళ్లతో సగం పంటనైనా కాపాడుకునేందుకు పైపులు కొనుగోలు చేసి తుంపర సేద్యం ద్వారా కొందరు నీళ్లందిస్తున్నారు. పంటను వేసేందుకు పెట్టిన పెట్టుబడి ఒక ఎత్తైతే, దానికి నీళ్లందించి కాపాడుకునేందుకు అవుతున్న ఖర్చు మరో ఎత్తని రైతులు వాపోతున్నారు.

Crop Damage in Mahabubnagar : వానలు లేక ఎండిపోతున్న పంట.. మళ్లీ రైతన్నకు తప్పని ఇబ్బందులు

గతేడాది వానలు సరిగ్గా కురవకపోవడంతో చెరువులు, కుంటలు, జలాశయాల్లోనూ నీళ్లు అందుబాటులో లేకుండా పోయాయి. జూరాల, కేఎల్ఐ, కోయల్ సాగర్, నెట్టెంపాడు లాంటి ఎత్తిపోతల పథకాల ద్వారా నీరందేందుకు చాలా సమయం పట్టేలా ఉంది. అప్పటి వరకూ పంటల్ని కాపాడుకోవడం కర్షకులకు కష్టంగా మారేలా ఉంది. వారం, పది రోజులుగా వర్షాలు ముఖం చాటేయటంతో జొన్న, కంది, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలు సైతం ఎండుతున్నాయి. నీళ్లు లేక వరి సాగే మొదలు కాలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వానాకాలంలో సాధారణ సాగు 18 లక్షల ఎకరాలుంటే, ఇప్పటి వరకు 30 నుంచి 40 శాతం వరకే పంటలు వేశారు. వాటిలో అత్యధికంగా 2 నుంచి 3 లక్షల ఎకరాల వరకూ పత్తి సాగైంది.

వ్యవసాయ అధికారుల సూచనలు : వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. జొన్న, కంది, పత్తి మొక్కల వేర్లు లోతుగా భూమిలోకి వెళ్తాయని, మరో నాలుగైదు రోజుల్లో వర్షాలు పడితే తిరిగి పుంజుకుంటాయంటున్నారు. లోతు దుక్కులు పూర్తిగా తడిసిన తర్వాత మాత్రమే విత్తనాలు విత్తుకోవాలని సూచిస్తున్నారు. మొక్కజొన్న, కంది, ఆముదం వంటి పంటల సాగుకు ఇంకా సమయం ఉంది. వరి సాగుకు మరో రెండు మాసాల సమయం పట్టనుంది.

Cotton Farmers Problems in Telangana : వరుణదేవా.. కరుణించరా.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటంతా..!

NO RAINS: ఊరించి ఉసూరుమనిపించిన వరుణుడు.. లబోదిబోమంటున్న రైతన్న

Last Updated : Jun 24, 2024, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.