ETV Bharat / state

'గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం' - అప్పీలును తిరస్కరించిన హైకోర్టు - HC Dismissed Single Judge Appeal to Group 1

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 9:42 PM IST

High Court Rejects Group 1 Candidates Petition : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదాకు సింగిల్ జడ్జి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీలును హైకోర్టు కొట్టివేసింది. ఈనెల 9న జరగనున్న గ్రూపు-1 పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. అన్ని ఏర్పాట్లు పూర్తయి అదివారం జరగనున్న పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది.

HC on  Group1 Exam
High Court Rejects Postponement Of Group1 Exam (ETV Bharat)

High Court Dismissed Appeal on Group 1 Postpone : రాష్ట్రంలో ఈనెల 9న జరగనున్న గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. అన్ని ఏర్పాట్లు పూర్తయి అదివారం జరగనున్న పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది. కేవలం కొందరి కోసం ఎక్కువమంది ప్రయోజనాలు దెబ్బతినేలా ఉత్తర్వులు జారీ చేయలేమంది. గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదాకు సింగిల్ జడ్జి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీలును హైకోర్టు కొట్టివేసింది.

జూన్ 9వ తేదీన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్-1 ప్రిలిమ్స్​ను వాయిదా వేసేలా ఆదేశించాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం గణేశ్, హనుమకొండకు చెందిన భూక్యా భరత్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారించిన సింగిల్ జడ్జి పిటిషన్ కొట్టివేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ గణేశ్, భరత్‌లు అప్పీలు దాఖలు చేశారు.

HC Rejects Group 1 Candidates Petition : దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రెండు పరీక్షలు ఒకే రోజు జరుగుతున్నందున ఒక ఎగ్జామ్​కు అటెండ్ కాలేకపోతున్నట్లు తెలిపారు. పరీక్షను వాయిదా వేసినట్లయితే నిరుద్యోగులకు కొంత ఊరట లభిస్తుందన్నారు.

టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలో రెండు ఇంటెలిజెన్స్‌ పోస్టులకు 700 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, గ్రూప్-1 ప్రిలిమ్స్​కు మాత్రం 4లక్షల మందికి పైగా అప్లై చేసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే వారంతా హాల్​టిక్కెట్లు సైతం డౌన్​లోడ్​ చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా ఆదివారం పరీక్ష జరుగుతున్నందున ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూరయ్యాయని తెలిపారు. ఈ దశలో పరీక్షలను వాయిదా చేస్తే లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతారన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం పరీక్షను వాయిదా వేయడానికి నిరాకరిస్తూ అప్పీలును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ - High Court Rejects Postponement of Group1 Exam

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సామాన్యమైన విషయం కాదు - వ్యక్తిగత గోప్యతలోకి చొరబడ్డమే : హైకోర్టు - TELANGANA HC ON PHONE TAPPING CASE

High Court Dismissed Appeal on Group 1 Postpone : రాష్ట్రంలో ఈనెల 9న జరగనున్న గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. అన్ని ఏర్పాట్లు పూర్తయి అదివారం జరగనున్న పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది. కేవలం కొందరి కోసం ఎక్కువమంది ప్రయోజనాలు దెబ్బతినేలా ఉత్తర్వులు జారీ చేయలేమంది. గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదాకు సింగిల్ జడ్జి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీలును హైకోర్టు కొట్టివేసింది.

జూన్ 9వ తేదీన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్-1 ప్రిలిమ్స్​ను వాయిదా వేసేలా ఆదేశించాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం గణేశ్, హనుమకొండకు చెందిన భూక్యా భరత్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారించిన సింగిల్ జడ్జి పిటిషన్ కొట్టివేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ గణేశ్, భరత్‌లు అప్పీలు దాఖలు చేశారు.

HC Rejects Group 1 Candidates Petition : దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రెండు పరీక్షలు ఒకే రోజు జరుగుతున్నందున ఒక ఎగ్జామ్​కు అటెండ్ కాలేకపోతున్నట్లు తెలిపారు. పరీక్షను వాయిదా వేసినట్లయితే నిరుద్యోగులకు కొంత ఊరట లభిస్తుందన్నారు.

టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలో రెండు ఇంటెలిజెన్స్‌ పోస్టులకు 700 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, గ్రూప్-1 ప్రిలిమ్స్​కు మాత్రం 4లక్షల మందికి పైగా అప్లై చేసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే వారంతా హాల్​టిక్కెట్లు సైతం డౌన్​లోడ్​ చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా ఆదివారం పరీక్ష జరుగుతున్నందున ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూరయ్యాయని తెలిపారు. ఈ దశలో పరీక్షలను వాయిదా చేస్తే లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతారన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం పరీక్షను వాయిదా వేయడానికి నిరాకరిస్తూ అప్పీలును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ - High Court Rejects Postponement of Group1 Exam

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సామాన్యమైన విషయం కాదు - వ్యక్తిగత గోప్యతలోకి చొరబడ్డమే : హైకోర్టు - TELANGANA HC ON PHONE TAPPING CASE

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.