ETV Bharat / state

హైదరాబాద్​లో ట్రాఫిక్ భూతం - వాహనదారులకు తప్పని నరకం - Traffic Problems in Hyderabad

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 4:43 PM IST

Traffic Problems in Hyderabad : హైదరాబాద్​లో ట్రాఫిక్​ సమస్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల వినియోగం కూడా పెరగడంతో నగరంలో ట్రాఫిక్​ అతి పెద్ద సమస్యగా మారింది. మరి ఈ రద్దీకి నివారణ మార్గాలను ట్రాఫిక్​ పోలీసులు అన్వేషిస్తున్నారా లేదా అన్న భావనలో నగరవాసి నలిగిపోతున్నాడు.

Traffic Problems in Hyderabad
Traffic Problems in Hyderabad (ETV Bharat)

Heavy Traffic Issues in Hyderabad : అత్యవసరమని కారు లేదా బైక్​తో రోడెక్కితే చాలు ట్రాఫిక్​. అందులో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరకయాతన అనుభవించాల్సిందే. దీనికి పగలు, రాత్రి అనే తేడానే లేదు. ఇలా ట్రాఫిక్​ ఉన్నప్పుడు అక్కడ పోలీసు కనిపించడు. ఈ రద్దీని పర్యవేక్షించాల్సిన అధికారులే అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పుడు ఈ సమస్య హైదరాబాద్​ మహానగరంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఆఫీసుకు వెళ్లాలన్నా, అత్యవసర పనికి, విద్యార్థులు స్కూల్​, కళాశాలకు వెళ్లాలన్నా ట్రాఫిక్​ ఇబ్బందులను చవిచూస్తూ ముందుకు సాగాల్సి వస్తోంది.

Public Facing Problems Due To Traffic Jam in Hyderabad : ఎన్నికలకు ముందు ఉన్న ట్రాఫిక్​ అదనపు సీపీ విశ్వప్రసాద్ ఎన్నికల కోడ్​​ సమయంలో బదిలీ అయ్యారు. ఇన్​ఛార్జిపై అదనపు భారం పడటంతో పర్యవేక్షణ భారంగా మారింది. కీలకమైన ఈ పోస్ట్ మూడు నెలల నుంచి ఖాళీగానే ఉంది. మారుతున్న అవసరాలకు తగినట్లుగా ట్రాఫిక్​ పోలీసు సిబ్బందిని పెంచకపోవడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది.

నగరంలో 25 లక్షలు పైనే వాహనాలు : గతంలో గ్రేటర్​ పరిధిలో నిత్యం 25 లక్షల వాహనాలు రోడ్లపైకి వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య 20 శాతం పెరిగినట్లు ట్రాఫిక్​ పోలీసులు అంచనా వేస్తున్నారు. వాహనాల సంఖ్య పెరగడం, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. దీంతో వాహనాల సంఖ్య రెట్టింపు అయింది. అదే విధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్​, కాలేజీ బస్సులు రోడ్లపైకి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇంకా వాహన రద్దీ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రముఖుల వాహనాలు, ప్రొటోకాల్​ అని చెప్పి తరచూ ట్రాఫిక్​ను నిలిపి వేస్తున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ వాహనాలు : ప్రైవేట్ బస్సులు, లారీలు, భారీ వాహనాలు యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నాయి. ఇలా గతంలో నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకునేవారు. ప్రైవేట్ వాహనదారులు చలాన్లు వేయడం వల్ల పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలోనే మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 40లక్షల ఘటనల్లో వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు గుర్తించారు. వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలుపుదల : ట్రాఫిక్​కు ప్రధాన సమస్యగా రోడ్లపై ఇరువైపులా వాహనాలు నిలపటమే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు, నగరంలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. కీలకమైన ఎల్బీనగర్​, ఉప్పల్, నాగోల్​, దిల్​సుఖ్​నగర్​, అబిడ్స్​, తార్నాక, నారాయణగూడ, బంజారాహిల్స్​, చాదర్​ఘాట్​, సికింద్రాబాద్​, జూబ్లీహిల్స్​, గచ్చిబౌలి, మాదాపూర్​, మియాపూర్​, కూకట్​పల్లి మార్గాల్లో వేలాది వాహనాలు రోడ్లుకు ఇరువైపులా నిలిపి ఉంచుతున్నారు.

రోజుకు సగటున 20 వాహనాలు మొరాయింపు : నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రోజూ సగటున 20 వాహనాలు ఇంధనం లేక, మరమ్మతులకు గురై మొరాయింపునకు గురవుతున్నాయి. ఒకవేళ రద్దీ ప్రాంతాలు, పై వంతెనలపై వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్​ సిబ్బందికి సుమారు 1 గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది వాటిని తొలగించడానికి. ఈ సమస్యలతో పాటు చీకటి పడితే చాలు వచ్చే సమస్యగా ప్రైవేట్ బస్సులు తయారయ్యాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ప్రయాణికులను తీసుకెళ్లే ఈ బస్సులు మియాపూర్​, కేవీహెచ్​బీ, ఎస్సార్​నగర్​, లక్డీకాపూల్​, అమీర్​పేట, అబిడ్స్​, కాచిగూడ, అత్తాపూర్​, ఉప్పల్​, దిల్​సుఖ్​నగర్​, ఎల్బీనగర్​, మెహిదీపట్నం, వనస్థలిపురం ప్రాంతాల్లో గంటల తరబడి నిలపడం వల్ల ట్రాఫిక్​ సమస్య తీవ్రమవుతుంది.

ట్రాఫిక్​ సౌండ్​తో గుండె డ్యామేజ్​- డయాబెటిస్​, బ్రెయిన్​ స్ట్రోక్​కు ఛాన్స్!​ ఇవి బ్యాన్ చేస్తేనే సేఫ్​!! - Traffic Noise Sound Effect

సీఎం బస్సు యాత్రా మజాకా - ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు - jagan bus yatra traffic diversions

Heavy Traffic Issues in Hyderabad : అత్యవసరమని కారు లేదా బైక్​తో రోడెక్కితే చాలు ట్రాఫిక్​. అందులో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరకయాతన అనుభవించాల్సిందే. దీనికి పగలు, రాత్రి అనే తేడానే లేదు. ఇలా ట్రాఫిక్​ ఉన్నప్పుడు అక్కడ పోలీసు కనిపించడు. ఈ రద్దీని పర్యవేక్షించాల్సిన అధికారులే అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పుడు ఈ సమస్య హైదరాబాద్​ మహానగరంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఆఫీసుకు వెళ్లాలన్నా, అత్యవసర పనికి, విద్యార్థులు స్కూల్​, కళాశాలకు వెళ్లాలన్నా ట్రాఫిక్​ ఇబ్బందులను చవిచూస్తూ ముందుకు సాగాల్సి వస్తోంది.

Public Facing Problems Due To Traffic Jam in Hyderabad : ఎన్నికలకు ముందు ఉన్న ట్రాఫిక్​ అదనపు సీపీ విశ్వప్రసాద్ ఎన్నికల కోడ్​​ సమయంలో బదిలీ అయ్యారు. ఇన్​ఛార్జిపై అదనపు భారం పడటంతో పర్యవేక్షణ భారంగా మారింది. కీలకమైన ఈ పోస్ట్ మూడు నెలల నుంచి ఖాళీగానే ఉంది. మారుతున్న అవసరాలకు తగినట్లుగా ట్రాఫిక్​ పోలీసు సిబ్బందిని పెంచకపోవడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది.

నగరంలో 25 లక్షలు పైనే వాహనాలు : గతంలో గ్రేటర్​ పరిధిలో నిత్యం 25 లక్షల వాహనాలు రోడ్లపైకి వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య 20 శాతం పెరిగినట్లు ట్రాఫిక్​ పోలీసులు అంచనా వేస్తున్నారు. వాహనాల సంఖ్య పెరగడం, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. దీంతో వాహనాల సంఖ్య రెట్టింపు అయింది. అదే విధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్​, కాలేజీ బస్సులు రోడ్లపైకి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇంకా వాహన రద్దీ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రముఖుల వాహనాలు, ప్రొటోకాల్​ అని చెప్పి తరచూ ట్రాఫిక్​ను నిలిపి వేస్తున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ వాహనాలు : ప్రైవేట్ బస్సులు, లారీలు, భారీ వాహనాలు యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నాయి. ఇలా గతంలో నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకునేవారు. ప్రైవేట్ వాహనదారులు చలాన్లు వేయడం వల్ల పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలోనే మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 40లక్షల ఘటనల్లో వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు గుర్తించారు. వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలుపుదల : ట్రాఫిక్​కు ప్రధాన సమస్యగా రోడ్లపై ఇరువైపులా వాహనాలు నిలపటమే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు, నగరంలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. కీలకమైన ఎల్బీనగర్​, ఉప్పల్, నాగోల్​, దిల్​సుఖ్​నగర్​, అబిడ్స్​, తార్నాక, నారాయణగూడ, బంజారాహిల్స్​, చాదర్​ఘాట్​, సికింద్రాబాద్​, జూబ్లీహిల్స్​, గచ్చిబౌలి, మాదాపూర్​, మియాపూర్​, కూకట్​పల్లి మార్గాల్లో వేలాది వాహనాలు రోడ్లుకు ఇరువైపులా నిలిపి ఉంచుతున్నారు.

రోజుకు సగటున 20 వాహనాలు మొరాయింపు : నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రోజూ సగటున 20 వాహనాలు ఇంధనం లేక, మరమ్మతులకు గురై మొరాయింపునకు గురవుతున్నాయి. ఒకవేళ రద్దీ ప్రాంతాలు, పై వంతెనలపై వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్​ సిబ్బందికి సుమారు 1 గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది వాటిని తొలగించడానికి. ఈ సమస్యలతో పాటు చీకటి పడితే చాలు వచ్చే సమస్యగా ప్రైవేట్ బస్సులు తయారయ్యాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ప్రయాణికులను తీసుకెళ్లే ఈ బస్సులు మియాపూర్​, కేవీహెచ్​బీ, ఎస్సార్​నగర్​, లక్డీకాపూల్​, అమీర్​పేట, అబిడ్స్​, కాచిగూడ, అత్తాపూర్​, ఉప్పల్​, దిల్​సుఖ్​నగర్​, ఎల్బీనగర్​, మెహిదీపట్నం, వనస్థలిపురం ప్రాంతాల్లో గంటల తరబడి నిలపడం వల్ల ట్రాఫిక్​ సమస్య తీవ్రమవుతుంది.

ట్రాఫిక్​ సౌండ్​తో గుండె డ్యామేజ్​- డయాబెటిస్​, బ్రెయిన్​ స్ట్రోక్​కు ఛాన్స్!​ ఇవి బ్యాన్ చేస్తేనే సేఫ్​!! - Traffic Noise Sound Effect

సీఎం బస్సు యాత్రా మజాకా - ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు - jagan bus yatra traffic diversions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.