ETV Bharat / state

బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ - తిరుపతిలో భారీ వర్షాలు - స్తంభించిన జనజీవనం

వాయుగుండం ప్రభావంతో తిరుపతి జిల్లాలో వర్షాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Heavy Rains in Tirupati District
Heavy Rains in Tirupati District (ETV Bharat)

Rains in Tirupati District : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను అందుబాటులో ఉంచారు.

ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా అతలాకుతలం అవుతోంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, పెళ్లకూరు, తడ, ఓజిలి దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలైన సూళ్లూరుపేట, తడ, చిట్టమూరు, కోట వాకాడు మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పునరావాస కేంద్రాలు పరిశీలించారు. బాధితులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Heavy Rains in AP : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏర్పేడు మండలంలోని పాపా నాయుడుపేట-గుడిమల్లం ప్రధాన రహదారిపై సీతకాలువ వాగు వరద చేరడంతో కాజ్​వే పై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నదికి వరద పోటెత్తడంతో ఏర్పేడు-మోదుగులపాలెం కాజ్​వే పై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పలు కాజ్​వేల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ఎక్కడిక్కడ స్తంభించిన జనజీవనం : చిందేపల్లి, ముళ్లపూడి, గుండ్లపల్లి, చింతలపాలెం ఎస్టీ కాలనీలోకి నీరు చేరాయి. అధికారులు వరద బయటకు పంపేలా చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు. వెంకటగిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించింది. బాలాయపల్లి మండలంలో కైవల్యా నది జలకళను సంతరించుకుంది. మరోవైపు ఏకధాటి వర్షాలతో నిమ్మ, మామిడి తోటలకు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. విడవని వర్షంతో చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.

ముంచుకొచ్చిన వాయుగుండం - అతి భారీ వర్ష సూచన - వెనక్కి వచ్చిన 61,756 మంది మత్స్యకారులు

భారీ వర్షాలపై సీఎం సమీక్ష - ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు

Rains in Tirupati District : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను అందుబాటులో ఉంచారు.

ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా అతలాకుతలం అవుతోంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, పెళ్లకూరు, తడ, ఓజిలి దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలైన సూళ్లూరుపేట, తడ, చిట్టమూరు, కోట వాకాడు మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పునరావాస కేంద్రాలు పరిశీలించారు. బాధితులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Heavy Rains in AP : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏర్పేడు మండలంలోని పాపా నాయుడుపేట-గుడిమల్లం ప్రధాన రహదారిపై సీతకాలువ వాగు వరద చేరడంతో కాజ్​వే పై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నదికి వరద పోటెత్తడంతో ఏర్పేడు-మోదుగులపాలెం కాజ్​వే పై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పలు కాజ్​వేల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ఎక్కడిక్కడ స్తంభించిన జనజీవనం : చిందేపల్లి, ముళ్లపూడి, గుండ్లపల్లి, చింతలపాలెం ఎస్టీ కాలనీలోకి నీరు చేరాయి. అధికారులు వరద బయటకు పంపేలా చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు. వెంకటగిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించింది. బాలాయపల్లి మండలంలో కైవల్యా నది జలకళను సంతరించుకుంది. మరోవైపు ఏకధాటి వర్షాలతో నిమ్మ, మామిడి తోటలకు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. విడవని వర్షంతో చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.

ముంచుకొచ్చిన వాయుగుండం - అతి భారీ వర్ష సూచన - వెనక్కి వచ్చిన 61,756 మంది మత్స్యకారులు

భారీ వర్షాలపై సీఎం సమీక్ష - ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.