ETV Bharat / state

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో విస్తారంగా వర్షాలు - వరదలకు కొట్టుకుపోయి ఐదుగురు మృతి - Five People Died Due to Rains

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 5:38 PM IST

Updated : Sep 1, 2024, 9:58 PM IST

Heavy Rains in Warangal District : ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వర్షానికి ఐదుగురు వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందారు.

Heavy Rains in Warangal District
Heavy Rains in Warangal District (ETV Bharat)

Five People Died Due to Rains in Warangal District : ఉమ్మడి వరంగల్​ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఐదుగురు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్​ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రీ కుమార్తె వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కుమార్తె మృతదేహాన్ని రెస్క్యూ టీం బయటకు తీశారు.

ఆమె వ్యవసాయ శాస్త్రవేత్తగా రాయ్​పూర్​లో విధులు నిర్వహిస్తుండేది. మరోవైపు వరంగల్​ జిల్లా దుగ్గొండి మండలంలో మందపల్లికి చెందిన వృద్ధురాలు మరణించింది. మలుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పశువులను మోతకు తీసుకెళ్లి వస్తుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పరకాల గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయ్యి చివరికి శవంగా బయటకువచ్చాడు.

సింగరేణికి రూ.కోటి నష్టం : జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో వర్షం పట్ల ఎప్పటికప్పుడు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను కలెక్టర్​ రాహుల్​ శర్మ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కలెక్టర్​ కార్యాలయంలో కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేసి టోల్​ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్​ కాస్ట్​ 2,3 గనుల్లో రోడ్లన్నీ బురదమయం అయ్యాయి.

6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో సింగరేణి సంస్థకు సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్​ జాతీయ రహదారి రఘునాథపల్లిలో రోడ్డుపై నిలిచిపోయిన వరద భూపాలపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొరాంఛవాగు, చలి వాగు, మానేరు వాగు భూపాలపల్లి సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరింది.

పలు రైళ్లు నిలిపివేత : భారీ వర్షాలకు మహబూబాబాద్​ జిల్లా తడిసి ముద్దయింది. కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని పాలేరు, మున్నేరు, ఆకేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పశువులు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు. పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. భారీ వర్షాల కారణంగా డోర్నకల్​ రైల్వే జంక్షన్​లో గౌతమి, పద్మావతి ఎక్స్​ప్రెస్​లను అధికారులు నిలిపివేశారు. గార్లలోనూ పలు రైళ్లను నిలిపివేశారు. మహబూబాబాద్​ రైల్వే స్టేషన్​లో సింహపురి, బీదర్​ ఎక్స్​ప్రెస్​లు నిలిచిపోయాయి.

భారీ వర్షాలు: తెలంగాణ, ఏపీ మధ్య రాకపోకలు బంద్‌ - Buses close between Hyd Vijayawada

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ - SCR Cancelled Trains

Five People Died Due to Rains in Warangal District : ఉమ్మడి వరంగల్​ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఐదుగురు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్​ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రీ కుమార్తె వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కుమార్తె మృతదేహాన్ని రెస్క్యూ టీం బయటకు తీశారు.

ఆమె వ్యవసాయ శాస్త్రవేత్తగా రాయ్​పూర్​లో విధులు నిర్వహిస్తుండేది. మరోవైపు వరంగల్​ జిల్లా దుగ్గొండి మండలంలో మందపల్లికి చెందిన వృద్ధురాలు మరణించింది. మలుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పశువులను మోతకు తీసుకెళ్లి వస్తుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పరకాల గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయ్యి చివరికి శవంగా బయటకువచ్చాడు.

సింగరేణికి రూ.కోటి నష్టం : జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో వర్షం పట్ల ఎప్పటికప్పుడు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను కలెక్టర్​ రాహుల్​ శర్మ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కలెక్టర్​ కార్యాలయంలో కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేసి టోల్​ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్​ కాస్ట్​ 2,3 గనుల్లో రోడ్లన్నీ బురదమయం అయ్యాయి.

6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో సింగరేణి సంస్థకు సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్​ జాతీయ రహదారి రఘునాథపల్లిలో రోడ్డుపై నిలిచిపోయిన వరద భూపాలపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొరాంఛవాగు, చలి వాగు, మానేరు వాగు భూపాలపల్లి సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరింది.

పలు రైళ్లు నిలిపివేత : భారీ వర్షాలకు మహబూబాబాద్​ జిల్లా తడిసి ముద్దయింది. కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని పాలేరు, మున్నేరు, ఆకేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పశువులు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు. పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. భారీ వర్షాల కారణంగా డోర్నకల్​ రైల్వే జంక్షన్​లో గౌతమి, పద్మావతి ఎక్స్​ప్రెస్​లను అధికారులు నిలిపివేశారు. గార్లలోనూ పలు రైళ్లను నిలిపివేశారు. మహబూబాబాద్​ రైల్వే స్టేషన్​లో సింహపురి, బీదర్​ ఎక్స్​ప్రెస్​లు నిలిచిపోయాయి.

భారీ వర్షాలు: తెలంగాణ, ఏపీ మధ్య రాకపోకలు బంద్‌ - Buses close between Hyd Vijayawada

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ - SCR Cancelled Trains

Last Updated : Sep 1, 2024, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.