ETV Bharat / state

అల్పపీడనం ప్రభావం ఎఫెక్ట్ - రాష్ట్రంలో జోరందుకున్న వర్షాలు - AP Rains Updates

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Heavy Rains in AP : అల్పపీడనం కారణంగా ఏపీలో మంగళవారం రాత్రి నుంచి వర్షాలు జోరందుకున్నాయి. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంటలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

AP Rains Updates
AP Rains Updates (ETV Bharat)

Rains in Andhra Pradesh : పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉంది. ఈ ప్రభావంతో నేడు కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు విజయవాడలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. దీనికితోడూ మురికి కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నీట మునిగిన పంటపొలాలు : మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి అనకాపల్లి జిల్లా పరవాడ పైడితల్లి అమ్మవారి గుడికి అనుకుని ఉన్న చెరువుకు గండి పడింది. దీంతో వరి పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నీటమునిగిన పొలాలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడంతా వరద పాలైందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలో వాన దంచికొట్టింది వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే బ్రహ్మంగారిమఠం సమీప సోమిరెడ్డిపల్లె వద్ద వంక పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా బద్వేలు-బ్రహ్మంగారిమఠం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

బద్వేల్ మున్సిపాలిటీలో రాత్రి కురిసిన వర్షానికి వీధులు జలమయ్యాయి. దీంతో ప్రజలు బయటకి వెళ్లేందుకు జంకుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వరద నీటిలో రాకపోకలు సాగించాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అమ్మిరేకుల- కిమ్మలగెడ్డ మార్గంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఓ ద్విచక్ర వాహనదారుడు వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్​ నీటిలో కొట్టుకుపోయింది. అప్రమత్తమైన వాహనదారుడు వెనక్కి వచ్చాడు. స్థానికులు బైక్​ను నీటిలో నుంచి బయటకుతీశారు. మరోవైపు ప్రవాహ సమయంలో గెడ్డలు దాటవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి- ఎడతెరిపిలేని వర్షాలతో ప్రమాదకరంగా వాగులు - Heavy rains in Uttarandhra

రహదారులకు వరద కష్టం - రాష్ట్రవ్యాప్తంగా 5,921 కి.మీ. ధ్వంసం - Roads Destroyed in ap

Rains in Andhra Pradesh : పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉంది. ఈ ప్రభావంతో నేడు కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు విజయవాడలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. దీనికితోడూ మురికి కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నీట మునిగిన పంటపొలాలు : మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి అనకాపల్లి జిల్లా పరవాడ పైడితల్లి అమ్మవారి గుడికి అనుకుని ఉన్న చెరువుకు గండి పడింది. దీంతో వరి పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నీటమునిగిన పొలాలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడంతా వరద పాలైందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలో వాన దంచికొట్టింది వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే బ్రహ్మంగారిమఠం సమీప సోమిరెడ్డిపల్లె వద్ద వంక పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా బద్వేలు-బ్రహ్మంగారిమఠం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

బద్వేల్ మున్సిపాలిటీలో రాత్రి కురిసిన వర్షానికి వీధులు జలమయ్యాయి. దీంతో ప్రజలు బయటకి వెళ్లేందుకు జంకుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వరద నీటిలో రాకపోకలు సాగించాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అమ్మిరేకుల- కిమ్మలగెడ్డ మార్గంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఓ ద్విచక్ర వాహనదారుడు వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్​ నీటిలో కొట్టుకుపోయింది. అప్రమత్తమైన వాహనదారుడు వెనక్కి వచ్చాడు. స్థానికులు బైక్​ను నీటిలో నుంచి బయటకుతీశారు. మరోవైపు ప్రవాహ సమయంలో గెడ్డలు దాటవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి- ఎడతెరిపిలేని వర్షాలతో ప్రమాదకరంగా వాగులు - Heavy rains in Uttarandhra

రహదారులకు వరద కష్టం - రాష్ట్రవ్యాప్తంగా 5,921 కి.మీ. ధ్వంసం - Roads Destroyed in ap

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.