ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాను వణికిస్తున్న వరుణుడు - కోదాడలో వరద నీటిలో 2 మృతదేహాలు లభ్యం - Heavy Rains in Nalgonda District

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 1:09 PM IST

Updated : Sep 1, 2024, 7:53 PM IST

Rains in Nalgonda District : ఉమ్మడి నల్గొండ జిల్లాను వరుణుడు వణికిస్తున్నాడు. కుండపోత వానకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటపొలాలు నీట మునిగాయి. వరద ఉద్ధృతికి జిల్లాలోనూ మూసీనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా వరదల్లో కొట్టుకోయిన రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

Heavy Rains in Nalgonda District Today
Rains in Nalgonda District (ETV Bharat)

Heavy Rains in Nalgonda District Today : సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం సంగెం- తిమ్మాపురం మధ్య వాగు ప్రవహించడంతో ఇళ్లు మునిగిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో నల్లకుంట చెరువు అలుగు పోయడంతో వరి పొలాలు కొట్టుకుపోయాయి. తెలంగాణ రెండవ భద్రాద్రిగా పేరు గాంచిన శ్రీ సీతారామాలయంలోకి వరద నీరు చేరింది. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రకుంట చెరువు నిండటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు 50మంది వరకూ ముంపు బాధితులను బోట్ల సాయంతో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందం కాపాడారు.

కొట్టుకొచ్చిన కారులో మృతదేహం : కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన వాహనాల్లోంచి రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు అధికారులు సహాయ చర్యలు కాబట్టి క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. వరదలో చిక్కుకున్న ప్రాంతాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పరిశీలించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి కస్తూర్భా గాంధీ పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ పాఠశాలను సందర్శించి సుమారు 180 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మఠంపల్లిలో భారీ వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా కనిపిస్తోంది. దాదాపు వంద మీటర్ల మేర పట్టాలు కుంగిపోయాయి.

Heavy Flood Water in Nalgonda : నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. శెట్టిపాలం వద్ద చిత్రపరక వాగు ఉద్ధృతికి పంట పొలాలు నీట మునిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాతుర్కపల్లిమండలం దేవోజీ నాయక్ తండా గొల్లగూడెంవద్ద కొండ పోచమ్మ ప్రాజెక్టు నుంచి వచ్చే కాల్వకు గండి పడింది. గోదావరి జలాలు దారి మళ్లడంతో పంటపొలాలు నీటమునిగాయి.

హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో మూసీ నదికి వరద నీరు పెరిగింది. దీంతో 4 గేట్లు నాలుగు ఫీట్ల మేరఎత్తి నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లోలేవల్ వంతెనని తాకుతూ మూసి నది ప్రవహిస్తోంది. పెద్దవూరలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం నిల్వ చేసిన మందులు మెుత్తం నానిపోయాయి. మిర్యాలగూడలో లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరిన ఇండ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత వానలు, వరద గుప్పెట్లో ఊళ్లు - జలదిగ్బంధంలో వందలాది ఇళ్లు - Heavy Rains in Khammam 2024

తెలంగాణలో భారీ వర్షాలు - ఇప్పటివరకు 9 మంది మృతి, మరో ఇద్దరు గల్లంతు - 9 People Died Due to Rains in tg

Heavy Rains in Nalgonda District Today : సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం సంగెం- తిమ్మాపురం మధ్య వాగు ప్రవహించడంతో ఇళ్లు మునిగిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో నల్లకుంట చెరువు అలుగు పోయడంతో వరి పొలాలు కొట్టుకుపోయాయి. తెలంగాణ రెండవ భద్రాద్రిగా పేరు గాంచిన శ్రీ సీతారామాలయంలోకి వరద నీరు చేరింది. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రకుంట చెరువు నిండటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు 50మంది వరకూ ముంపు బాధితులను బోట్ల సాయంతో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందం కాపాడారు.

కొట్టుకొచ్చిన కారులో మృతదేహం : కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన వాహనాల్లోంచి రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు అధికారులు సహాయ చర్యలు కాబట్టి క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. వరదలో చిక్కుకున్న ప్రాంతాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పరిశీలించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి కస్తూర్భా గాంధీ పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ పాఠశాలను సందర్శించి సుమారు 180 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మఠంపల్లిలో భారీ వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా కనిపిస్తోంది. దాదాపు వంద మీటర్ల మేర పట్టాలు కుంగిపోయాయి.

Heavy Flood Water in Nalgonda : నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. శెట్టిపాలం వద్ద చిత్రపరక వాగు ఉద్ధృతికి పంట పొలాలు నీట మునిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాతుర్కపల్లిమండలం దేవోజీ నాయక్ తండా గొల్లగూడెంవద్ద కొండ పోచమ్మ ప్రాజెక్టు నుంచి వచ్చే కాల్వకు గండి పడింది. గోదావరి జలాలు దారి మళ్లడంతో పంటపొలాలు నీటమునిగాయి.

హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో మూసీ నదికి వరద నీరు పెరిగింది. దీంతో 4 గేట్లు నాలుగు ఫీట్ల మేరఎత్తి నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లోలేవల్ వంతెనని తాకుతూ మూసి నది ప్రవహిస్తోంది. పెద్దవూరలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం నిల్వ చేసిన మందులు మెుత్తం నానిపోయాయి. మిర్యాలగూడలో లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరిన ఇండ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత వానలు, వరద గుప్పెట్లో ఊళ్లు - జలదిగ్బంధంలో వందలాది ఇళ్లు - Heavy Rains in Khammam 2024

తెలంగాణలో భారీ వర్షాలు - ఇప్పటివరకు 9 మంది మృతి, మరో ఇద్దరు గల్లంతు - 9 People Died Due to Rains in tg

Last Updated : Sep 1, 2024, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.