ETV Bharat / state

భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలం - నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు - Heavy Rains in Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 6:59 AM IST

Updated : Aug 20, 2024, 11:56 AM IST

Heavy Rains in Hyderabad Today : భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైంది. కుండపోతగా కురిసిన వర్షానికి రాష్ట్ర రాజధాని తడిసిముద్దైంది. సికింద్రాబాద్ లోని జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్ నగర్ లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మలక్​పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటేశ్వరనగర్, ఇందర్​సింగ్ నగర్, వాణినగర్​లలో ఇళ్లలోకి వరద చేరి స్థానికులు ఇబ్బంది పడ్డారు. ప్రశాంతి నగర్ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షానికి సనత్​నగర్ నుంచి వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది.

Heavy Rains in Hyderabad Today
Heavy Rains in Hyderabad Today (ETV Bharat)

Heavy Rains in Hyderabad Today : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జంటనగరాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్​లోని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రహదారులపైకి వరద చేరడంతో వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. రెడ్ హిల్స్ సమీపంలో ఉన్న రహదారి, అబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. నాంపల్లి లోని దుకాణాలలో నీరు చేరడంతో నీటిని తొలిగిస్తున్నారు. ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నిలిచి పోవడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మలక్​పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు : మలక్‌పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలా పొంగి నల్గొండ చౌరస్తా నుంచి మలక్‌పేట రైల్వేస్టేషన్‌ వరకు రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. చాదర్ ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్బీనగర్, నాగోల్, మనసురాబాద్, వనస్థలిపురం, బియన్​రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్​మెట్ ప్రాంతాల్లో వానదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇళ్లలోకి వరద నీరు : సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్, పాపయ్యనగర్, సంతోష్‌నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కుత్బుల్లాపూర్‌లోని వెంకటేశ్వరనగర్, ఇందర్‌సింగ్‌నగర్, వాణినగర్‌లలో ఇళ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంతినగర్‌ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద ప్రవహిస్తోంది. న్యూబోయిన్‌పల్లి హర్షవర్ధన్ కాలనీలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. చింతల్, శ్రీనివాస్ నగర్ వీధుల్లో వరద రోడ్లను ముంచెత్తింది. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లో ఇండ్లలోకి వరద నీరు రావడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. తినే ఆహరంలోనూ నీరు చేరి మెుత్తం కలుషితం అయ్యాయని బాధితులు తెలిపారు.

రామ్​నగర్‌ రోడ్డుపైకి ఓ మృతదేహం : హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీస్టేడియం ప్రహరీ గోడ కూలింది. భారీ వరదలకు సనత్‌నగర్‌లో కార్లు కొట్టుకుపోయాయి. పార్శిగుట్ట నుంచి రామానగర్‌ రోడ్డుపైకి ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. పంజాగుట్ట కాలనీలోని సుక్‌నివాస్ అపార్ట్‌మెంట్ రెయిలింగ్‌పై పిడుగు పడడంతో ఓ కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు సైతం తెగిపడ్డాయి. తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి వరదకు కొట్టుకుపోయాడు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు సెలవు : మరోవైపు హైదరాబాద్​లోని భారీ వర్షాల వల్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే 040-21111111, 9000113667 నంబర్లకు కాల్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. పలుచోట్ల జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

హైదరాబాద్​ సహా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం - చెరువులను తలపిస్తున్న రహదారులు - Rains In Hyderabad

హైదరాబాద్​లో మరోసారి వరుణుడి బీభత్సం - జిల్లాల్లోనూ సేమ్ సిచ్యువేషన్​ -​ రెడ్ అలర్ట్ జారీ - Heavy Rainfall in Hyderabad

Heavy Rains in Hyderabad Today : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జంటనగరాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్​లోని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రహదారులపైకి వరద చేరడంతో వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. రెడ్ హిల్స్ సమీపంలో ఉన్న రహదారి, అబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. నాంపల్లి లోని దుకాణాలలో నీరు చేరడంతో నీటిని తొలిగిస్తున్నారు. ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నిలిచి పోవడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మలక్​పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు : మలక్‌పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలా పొంగి నల్గొండ చౌరస్తా నుంచి మలక్‌పేట రైల్వేస్టేషన్‌ వరకు రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. చాదర్ ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్బీనగర్, నాగోల్, మనసురాబాద్, వనస్థలిపురం, బియన్​రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్​మెట్ ప్రాంతాల్లో వానదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇళ్లలోకి వరద నీరు : సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్, పాపయ్యనగర్, సంతోష్‌నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కుత్బుల్లాపూర్‌లోని వెంకటేశ్వరనగర్, ఇందర్‌సింగ్‌నగర్, వాణినగర్‌లలో ఇళ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంతినగర్‌ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద ప్రవహిస్తోంది. న్యూబోయిన్‌పల్లి హర్షవర్ధన్ కాలనీలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. చింతల్, శ్రీనివాస్ నగర్ వీధుల్లో వరద రోడ్లను ముంచెత్తింది. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లో ఇండ్లలోకి వరద నీరు రావడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. తినే ఆహరంలోనూ నీరు చేరి మెుత్తం కలుషితం అయ్యాయని బాధితులు తెలిపారు.

రామ్​నగర్‌ రోడ్డుపైకి ఓ మృతదేహం : హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీస్టేడియం ప్రహరీ గోడ కూలింది. భారీ వరదలకు సనత్‌నగర్‌లో కార్లు కొట్టుకుపోయాయి. పార్శిగుట్ట నుంచి రామానగర్‌ రోడ్డుపైకి ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. పంజాగుట్ట కాలనీలోని సుక్‌నివాస్ అపార్ట్‌మెంట్ రెయిలింగ్‌పై పిడుగు పడడంతో ఓ కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు సైతం తెగిపడ్డాయి. తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి వరదకు కొట్టుకుపోయాడు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు సెలవు : మరోవైపు హైదరాబాద్​లోని భారీ వర్షాల వల్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే 040-21111111, 9000113667 నంబర్లకు కాల్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. పలుచోట్ల జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

హైదరాబాద్​ సహా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం - చెరువులను తలపిస్తున్న రహదారులు - Rains In Hyderabad

హైదరాబాద్​లో మరోసారి వరుణుడి బీభత్సం - జిల్లాల్లోనూ సేమ్ సిచ్యువేషన్​ -​ రెడ్ అలర్ట్ జారీ - Heavy Rainfall in Hyderabad

Last Updated : Aug 20, 2024, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.