ETV Bharat / state

ఎల్లుండి నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా - Govt Employees Regular Transfers

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 6:00 PM IST

Updated : Jul 3, 2024, 7:59 PM IST

Govt Employees Transfers In Telangana :ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 5 నుంచి 20 వరకు బదిలీలకు షెడ్యూలు ప్రకటించింది. ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగులను బదిలీ చేయనున్న ప్రభుత్వం వితంతువులు, స్పౌజ్, కొన్ని కేటగిరీల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యమివ్వనున్నారు.

Govt Employees Transfers In Telangana
Govt Employees Transfers In Telangana (ETV Bharat)

Govt Employees Regular Transfers In Telangana : ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు షెడ్యూలు విడుదలయింది. బదిలీలకు అవకాశం ఇవ్వాలని కొంత కాలంగా ఉద్యోగులను ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ జీవో 80 విడుదల చేసింది. సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. జులై 5 నుంచి 20 వరకు బదిలీలకు షెడ్యూలు ప్రకటించింది. బదిలీలకు విధివిధానాలు, మార్గదర్శకాలను కూడా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఒకే చోట నాలుగేళ్లు పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది.

ఉద్యోగుల సాదారణ బదిలీలకు అనుమతి : రెండేళ్లు కూడా పూర్తి కాని ఉద్యోగులను బదిలీ చేయరాదని జీవోలో ఆర్థిక శాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది జూన్ 30లోగా ఉద్యోగ విరమణ చేసే వారు స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప బదిలీలు ఉండవు. ఒకే కేడర్​లో 40 శాతానికి మించి ఉద్యోగును బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీల్లో పలు కేటగిరీలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం వెల్లడించింది. స్పౌజ్, వితంతువు, ఏడాది లోపు రిటైర్ అయ్యే వారు, 70 శాతానికి మించి దివ్యాంగులు, మానసిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఉన్న వారు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంట్, ఓపెన్ హర్ట్ సర్జరీ, ఎముకల టీబీ ఉన్న ఉద్యోగులు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతుల పండగ - 18,942 మంది టీచర్లకు లబ్ధి - Teachers Promotion in Telangana

వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల ఆప్షన్ల స్వీకరణ : ప్రస్తుతం అప్రాధాన్యత పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ప్రాధాన్యత స్థానాల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో వెల్లడించింది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించి బదిలీలు చేయనున్నారు. జులై 5 నుంచి 8 వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు, కచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడిస్తారు. జులై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరిస్తారు. జులై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తుల పరిశీలించి జులై 19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులను జారీ చేస్తారు. జులై 21 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు పేర్కొన్నారు.

సిద్దిపేట సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే - తదుపరి విచారణ జూన్ 18కి వాయిదా - Telangana HC Stay on SERP Employees

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సర్కార్ కసరత్తు ముమ్మరం - జాబ్​ క్యాలెండర్ ఎప్పుడంటే? - Govt Job Recruitment In Telangna

Govt Employees Regular Transfers In Telangana : ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు షెడ్యూలు విడుదలయింది. బదిలీలకు అవకాశం ఇవ్వాలని కొంత కాలంగా ఉద్యోగులను ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ జీవో 80 విడుదల చేసింది. సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. జులై 5 నుంచి 20 వరకు బదిలీలకు షెడ్యూలు ప్రకటించింది. బదిలీలకు విధివిధానాలు, మార్గదర్శకాలను కూడా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఒకే చోట నాలుగేళ్లు పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది.

ఉద్యోగుల సాదారణ బదిలీలకు అనుమతి : రెండేళ్లు కూడా పూర్తి కాని ఉద్యోగులను బదిలీ చేయరాదని జీవోలో ఆర్థిక శాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది జూన్ 30లోగా ఉద్యోగ విరమణ చేసే వారు స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప బదిలీలు ఉండవు. ఒకే కేడర్​లో 40 శాతానికి మించి ఉద్యోగును బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీల్లో పలు కేటగిరీలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం వెల్లడించింది. స్పౌజ్, వితంతువు, ఏడాది లోపు రిటైర్ అయ్యే వారు, 70 శాతానికి మించి దివ్యాంగులు, మానసిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఉన్న వారు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంట్, ఓపెన్ హర్ట్ సర్జరీ, ఎముకల టీబీ ఉన్న ఉద్యోగులు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతుల పండగ - 18,942 మంది టీచర్లకు లబ్ధి - Teachers Promotion in Telangana

వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల ఆప్షన్ల స్వీకరణ : ప్రస్తుతం అప్రాధాన్యత పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ప్రాధాన్యత స్థానాల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో వెల్లడించింది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించి బదిలీలు చేయనున్నారు. జులై 5 నుంచి 8 వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు, కచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడిస్తారు. జులై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరిస్తారు. జులై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తుల పరిశీలించి జులై 19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులను జారీ చేస్తారు. జులై 21 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు పేర్కొన్నారు.

సిద్దిపేట సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే - తదుపరి విచారణ జూన్ 18కి వాయిదా - Telangana HC Stay on SERP Employees

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సర్కార్ కసరత్తు ముమ్మరం - జాబ్​ క్యాలెండర్ ఎప్పుడంటే? - Govt Job Recruitment In Telangna

Last Updated : Jul 3, 2024, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.