ETV Bharat / state

బంగారం కొనాలా వద్దా? - ఆకాశాన్నంటిన పసిడి ధరలు - అదే కారణమట! - Gold rate Hike In Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 10:41 AM IST

Updated : Jul 18, 2024, 2:16 PM IST

Gold Rates Hike In Telangana : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మూడు నెలల క్రితం భారీగా పెరిగిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. మార్కెట్‌లో ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో మళ్లీ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులతో పాటు రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా కొనుగోళ్లు చేయడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

Gold Rates Hike In Telangana
Gold Rates Hike In Telangana (ETV Bharat)

Gold Rates Hike In Telangana : పెళ్లైనా, పేరంటమైనా లేక ఏ చిన్నపాటి వేడుకైనా సరే మహిళలు బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎవరికైనా బహుమతిగా పసిడి ఇస్తే దాన్ని తీసుకున్న వ్యక్తికి ఉండే ఆనందమే వేరు. మహిళలకే కాదు చిన్నారులు, పురుషులు సైతం బంగారు ఆభరణాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. తులాల కొద్ది గొలుసులు, ఉంగరాలను పెట్టుకునే మగవాళ్లు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. ఆలంకరణ కోసం కొందరు హోదాగా భావించి మరికొందరు పెట్టుబడిగా ఉంటుందని ఇంకొందరు ఇలా దాదాపు అందరి దృష్టి బంగారు, వెండి పైనే ఉంటుంది.

ఏటా పెరిగిపోతున్న పసిడి ధర : పసిడి ధర ఏటా పెరుగుతూ వస్తోంది. దశాబ్దం క్రితం రూ.28వేలున్న 24 క్యారెట్ల తులం బంగారం ఇప్పుడు దాదాపు 75వేల రూపాయల మధ్య కొనసాగుతోంది. గతేడాది ఇదే సమయంలో బంగారం ధర రూ.61వేలు పలికింది. హైదరాబాద్‌లో 20 రోజుల క్రితం 72వేల 650 రూపాయలుగా ఉన్న 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు రూ.74500కు అటు ఇటుగా కొనసాగుతోంది. ఈ లెక్కన రూ.1800 పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిలో వెండి ధర కూడా దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంది.

బంగారం ధరలు పెరగడానికి కారణాలు : మార్చి నెలలో కిలో వెండి 76వేల రూపాయలు పలికింది. బంగారంతో పాటు వెండి కూడా పెరగడం సర్వసాధారణం. బంగారం కొనే స్థోమత లేని వాళ్లు వెండిని కొని అలంకరించుకుంటారు. పసిడి, వెండి ధరలు పెరగడానికి అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణం. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ బాండ్లపై వడ్డీ రేట్లను కొన్ని నెలలుగా క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. దీంతో అమెరికన్‌వాసులు బాండ్లవైపు మొగ్గు చూపకుండా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు.

"బంగారం ఉత్పత్తి ప్రస్తుతం కొంత తగ్గింది. ముఖ్యంగా మైన్స్​ తగ్గడం వల్ల బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఉక్రెయిన్ యుద్ధం కూడా మరో కారణం. పెట్రోల్, డాలర్​ ప్రభావం బంగారం ధరలపై ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల కూడా బంగారం ధరలు పెరిగేందకు అవకాశం ఏర్పడుతుంది"- ప్రతాప్​, మార్కెట్​ నిపుణులు

డిమాండ్​కు తగిన సరఫరా లేకపోవడంతో : ఇది వరకే చైనా, ఇండియా, ఇటలీ దేశాలు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఆ సమయంలో గోల్డ్‌ మైనింగ్ సంస్థలు ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేశాయి. చైనా కొనుగోళ్లను నిలిపేసేసరికి గోల్డ్ మైనింగ్ కంపెనీలు సైతం ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో మరోసారి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

అంతేకాకుండా గోల్డ్ మైనింగ్ చేయడానికి కంపెనీలకు సైతం ఖర్చు గతంతో పోలిస్తే తడిసి మోపెడవుతోంది. ఇప్పటికే భారీగా తవ్వకాలు చేశారు. ప్రస్తుతం చాలా లోతుకు తవ్వకాలు జరిపితే కానీ బంగారు గనులు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఖర్చు ఎక్కువ అవుతుండటంతో ఉత్పత్తిని తగ్గించాయి. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ప్రస్తుతం ధర పెరుగుతోంది. పసిడిని పెట్టుబడిగా ఎంచుకోవడం చాలా సులభం.

సులభంగా పెట్టుబడి పెట్టేవిధంగా : స్టాక్‌ మార్కెట్ లేదా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలంటే ఆయా షేర్లపై పూర్తి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. బంగారంలో పెట్టుబడుల కోసం అంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోవడంతో ఉన్న డబ్బులతో పుత్తడిని కొనిపెట్టుకుంటున్నారు. సౌదీ అరేబియా విక్రయించే పెట్రోల్‌ లావాదేవీలన్ని ఇది వరకు డాలర్ల రూపంలో మాత్రమే జరిగేవి ఇకనుంచి ఆయా దేశాల కరెన్సీల్లో క్రయవిక్రయాలు నిర్వహించేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ ప్రభావం కూడా బంగారం పెరగడానికి ఒక కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు.

నేటి గోల్డ్ & సిల్వర్​ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-3 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి! - Gold Investment Tips For Women

Gold Rates Hike In Telangana : పెళ్లైనా, పేరంటమైనా లేక ఏ చిన్నపాటి వేడుకైనా సరే మహిళలు బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎవరికైనా బహుమతిగా పసిడి ఇస్తే దాన్ని తీసుకున్న వ్యక్తికి ఉండే ఆనందమే వేరు. మహిళలకే కాదు చిన్నారులు, పురుషులు సైతం బంగారు ఆభరణాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. తులాల కొద్ది గొలుసులు, ఉంగరాలను పెట్టుకునే మగవాళ్లు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. ఆలంకరణ కోసం కొందరు హోదాగా భావించి మరికొందరు పెట్టుబడిగా ఉంటుందని ఇంకొందరు ఇలా దాదాపు అందరి దృష్టి బంగారు, వెండి పైనే ఉంటుంది.

ఏటా పెరిగిపోతున్న పసిడి ధర : పసిడి ధర ఏటా పెరుగుతూ వస్తోంది. దశాబ్దం క్రితం రూ.28వేలున్న 24 క్యారెట్ల తులం బంగారం ఇప్పుడు దాదాపు 75వేల రూపాయల మధ్య కొనసాగుతోంది. గతేడాది ఇదే సమయంలో బంగారం ధర రూ.61వేలు పలికింది. హైదరాబాద్‌లో 20 రోజుల క్రితం 72వేల 650 రూపాయలుగా ఉన్న 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు రూ.74500కు అటు ఇటుగా కొనసాగుతోంది. ఈ లెక్కన రూ.1800 పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిలో వెండి ధర కూడా దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంది.

బంగారం ధరలు పెరగడానికి కారణాలు : మార్చి నెలలో కిలో వెండి 76వేల రూపాయలు పలికింది. బంగారంతో పాటు వెండి కూడా పెరగడం సర్వసాధారణం. బంగారం కొనే స్థోమత లేని వాళ్లు వెండిని కొని అలంకరించుకుంటారు. పసిడి, వెండి ధరలు పెరగడానికి అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణం. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ బాండ్లపై వడ్డీ రేట్లను కొన్ని నెలలుగా క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. దీంతో అమెరికన్‌వాసులు బాండ్లవైపు మొగ్గు చూపకుండా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు.

"బంగారం ఉత్పత్తి ప్రస్తుతం కొంత తగ్గింది. ముఖ్యంగా మైన్స్​ తగ్గడం వల్ల బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఉక్రెయిన్ యుద్ధం కూడా మరో కారణం. పెట్రోల్, డాలర్​ ప్రభావం బంగారం ధరలపై ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల కూడా బంగారం ధరలు పెరిగేందకు అవకాశం ఏర్పడుతుంది"- ప్రతాప్​, మార్కెట్​ నిపుణులు

డిమాండ్​కు తగిన సరఫరా లేకపోవడంతో : ఇది వరకే చైనా, ఇండియా, ఇటలీ దేశాలు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఆ సమయంలో గోల్డ్‌ మైనింగ్ సంస్థలు ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేశాయి. చైనా కొనుగోళ్లను నిలిపేసేసరికి గోల్డ్ మైనింగ్ కంపెనీలు సైతం ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో మరోసారి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

అంతేకాకుండా గోల్డ్ మైనింగ్ చేయడానికి కంపెనీలకు సైతం ఖర్చు గతంతో పోలిస్తే తడిసి మోపెడవుతోంది. ఇప్పటికే భారీగా తవ్వకాలు చేశారు. ప్రస్తుతం చాలా లోతుకు తవ్వకాలు జరిపితే కానీ బంగారు గనులు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఖర్చు ఎక్కువ అవుతుండటంతో ఉత్పత్తిని తగ్గించాయి. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ప్రస్తుతం ధర పెరుగుతోంది. పసిడిని పెట్టుబడిగా ఎంచుకోవడం చాలా సులభం.

సులభంగా పెట్టుబడి పెట్టేవిధంగా : స్టాక్‌ మార్కెట్ లేదా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలంటే ఆయా షేర్లపై పూర్తి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. బంగారంలో పెట్టుబడుల కోసం అంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోవడంతో ఉన్న డబ్బులతో పుత్తడిని కొనిపెట్టుకుంటున్నారు. సౌదీ అరేబియా విక్రయించే పెట్రోల్‌ లావాదేవీలన్ని ఇది వరకు డాలర్ల రూపంలో మాత్రమే జరిగేవి ఇకనుంచి ఆయా దేశాల కరెన్సీల్లో క్రయవిక్రయాలు నిర్వహించేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ ప్రభావం కూడా బంగారం పెరగడానికి ఒక కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు.

నేటి గోల్డ్ & సిల్వర్​ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-3 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి! - Gold Investment Tips For Women

Last Updated : Jul 18, 2024, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.