ETV Bharat / state

టెన్షన్! టెన్షన్​! - 53.6 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం - మూడో ప్రమాద హెచ్చరిక జారీ - Heavy Water Flow in Godavari

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 6:51 PM IST

Updated : Jul 27, 2024, 8:01 PM IST

Heavy Water Flow In Godavari : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రానికి జలాశయం నీటమట్టం 53.6 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సుమారు 83 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. విలీన మండలాల్లోని చాలా గ్రామాలు గత వారంరోజులుగా వరద ముంపులోనే ఉన్నాయి.

Heavy Water Flow In Godavari
Heavy Water Flow In Godavari (ETV Bharat)

Heavy Water Flow In Godavari : ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటి ఉద్ధృతికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 53.6 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు వరదనీటి కారణంగా జనజీవనం స్తంభించింది.

పునరావాస కేంద్రాలకు తరలింపు : గోదావరి నీటిమట్టం పెరగడంతో పట్టణంలోని ఏఎంసీ ప్రాంతంతోపాటు , కొత్త కాలనీల్లోకి వచ్చే మురుగునీరు గోదావరిలో కలవడానికి వెళ్లే పరిస్థితి లేక కాలనీల్లోకి వరదనీరు చేరింది. దీంతో జనజీవనం స్తంభించింది. సుమారు 80 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కాలనీల్లోని సుమారు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. నీటిమట్టం పెరగడం వల్ల భద్రాచలం నుంచి వివిధ మండలాలకు ప్రయాణాలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.

వరద బాధితుల బాధలు వర్ణణాతీతం : భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మండలం చర్ల మండలంలోని ముంపు ప్రభావిత ప్రాంతాలైన కునవరం, చింతూరు, కుకనూరు, వెలెరుపాడు మండలాలకు రవాణా నిలిచిపోయింది. విలీన మండలాల్లోని చాలా గ్రామాలు గత వారంరోజులుగా వరద ముంపులోనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాలకు రాకపోకలు లేక నిత్యావసరాలకు వరద బాధితులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా కొంతమేర నీటిమట్టం పెరగవచ్చని కేంద్ర జలవనులశాఖ అధికారులు అంచనావేస్తున్నారు.

ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు : భద్రాచలంలోని అన్నదాన సత్రంలోనికి, సుభాష్​ నగర్ కాలనీ లోనికి, కొత్త కాలనీలోనికి వరద నీరు రాకుండా అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి బ్యాక్ వాటర్​ను ఎప్పటికప్పుడు తోడి బయటకు పోస్తున్నారు. మరోవైపు కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న నూతన గోదావరి కరకట్ట వద్ద ప్రస్తుతానికి వరద నీరు పట్టణంలోనికి రాకుండా అధికారులు జాతీయ రహదారిపై మట్టిని పోసి ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి మూడవ ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహించడం వల్ల లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారుల సూచనలను పాటిస్తూ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరుతున్నారు.

భద్రాచలం వద్ద డేంజర్ - 52.4 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం - కాసేపట్లో మూడో వార్నింగ్ - BHADRACHALAM GODAVARI WATER LEVEL

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం - రెండో ప్రమాద హెచ్చరిక జారీ - Bhadrachalam Godavari Water Level

Heavy Water Flow In Godavari : ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటి ఉద్ధృతికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 53.6 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు వరదనీటి కారణంగా జనజీవనం స్తంభించింది.

పునరావాస కేంద్రాలకు తరలింపు : గోదావరి నీటిమట్టం పెరగడంతో పట్టణంలోని ఏఎంసీ ప్రాంతంతోపాటు , కొత్త కాలనీల్లోకి వచ్చే మురుగునీరు గోదావరిలో కలవడానికి వెళ్లే పరిస్థితి లేక కాలనీల్లోకి వరదనీరు చేరింది. దీంతో జనజీవనం స్తంభించింది. సుమారు 80 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కాలనీల్లోని సుమారు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. నీటిమట్టం పెరగడం వల్ల భద్రాచలం నుంచి వివిధ మండలాలకు ప్రయాణాలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.

వరద బాధితుల బాధలు వర్ణణాతీతం : భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మండలం చర్ల మండలంలోని ముంపు ప్రభావిత ప్రాంతాలైన కునవరం, చింతూరు, కుకనూరు, వెలెరుపాడు మండలాలకు రవాణా నిలిచిపోయింది. విలీన మండలాల్లోని చాలా గ్రామాలు గత వారంరోజులుగా వరద ముంపులోనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాలకు రాకపోకలు లేక నిత్యావసరాలకు వరద బాధితులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా కొంతమేర నీటిమట్టం పెరగవచ్చని కేంద్ర జలవనులశాఖ అధికారులు అంచనావేస్తున్నారు.

ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు : భద్రాచలంలోని అన్నదాన సత్రంలోనికి, సుభాష్​ నగర్ కాలనీ లోనికి, కొత్త కాలనీలోనికి వరద నీరు రాకుండా అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి బ్యాక్ వాటర్​ను ఎప్పటికప్పుడు తోడి బయటకు పోస్తున్నారు. మరోవైపు కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న నూతన గోదావరి కరకట్ట వద్ద ప్రస్తుతానికి వరద నీరు పట్టణంలోనికి రాకుండా అధికారులు జాతీయ రహదారిపై మట్టిని పోసి ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి మూడవ ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహించడం వల్ల లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారుల సూచనలను పాటిస్తూ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరుతున్నారు.

భద్రాచలం వద్ద డేంజర్ - 52.4 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం - కాసేపట్లో మూడో వార్నింగ్ - BHADRACHALAM GODAVARI WATER LEVEL

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం - రెండో ప్రమాద హెచ్చరిక జారీ - Bhadrachalam Godavari Water Level

Last Updated : Jul 27, 2024, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.